అక్కర్లేని హీరోయిజం, ప్రేమ పేరుతో మితిమీరిన తెంపరితనం పాత్రల నుంచి బయటికి వచ్చి చేసిన సినిమాగా రౌడీ హీరో ఫ్యాన్స్ ఖుషి మీద చాలా పాజిటివ్ గా ఉన్నారు. దానికి తగ్గట్టే మైత్రి చేస్తున్న ప్రమోషన్లు, ఈవెంట్లు క్రమంగా బజ్ ని పెంచుతున్నాయి. ట్రోలింగ్ జరిగినా, సూపర్ అనిపించుకున్నా మొన్న జరిగిన మ్యూజికల్ కన్సర్ట్ కి ఊహించిన దానికన్నా మంచి రెస్పాన్స్ వచ్చింది. మణిరత్నం ప్రభావం గట్టిగా చూపిస్తున్న దర్శకుడు శివ నిర్వాణ థియేటర్లకు జంటగా వచ్చినా ఒంటరిగా వచ్చినా మర్చిపోలేని జ్ఞాపకాలను ఇస్తానని హామీ ఇస్తున్నారు. తాజాగా ఖుషి సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.
సిబిఎఫ్సి అధికారులు ఖుషికి క్లీన్ యు ఇచ్చారట. విజయ్ దేవరకొండ కెరీర్ లో ఇలా అందుకున్న రెండో సినిమా ఇదే. మొదటిది గీత గోవిందం. మిగిలినవన్నీ అయితే ఏ లేదా యు/ఏ తెచ్చుకున్నవే. ఈ లెక్కన ఇందులో ఎలాంటి అసభ్య సీన్లు, లిప్ లాక్ కిస్సులు, బెడ్ రూమ్ రొమాన్సులు కాని ఉండవని అర్థమైపోయింది. నిజానికీ స్టోరీలో వాటికి స్కోప్ ఉంది. కథ ప్రకారం ఇద్దరూ పెళ్లి చేసుకున్న తర్వాత విడిగా కాపురం పెడతారు. ఆ టైంలో బోలెడంత ఘాటు కంటెంట్ పెట్టొచ్చు. కానీ శివ నిర్వాణ మాత్రం నిన్ను కోరి, మజిలీ తరహాలో ఫ్యామిలీస్ నే మళ్ళీ టార్గెట్ చేసుకున్నాడు.
బిజినెస్ పరంగా అరవై కోట్ల దాకా అమ్ముడుపోయిన ఖుషి సెప్టెంబర్ 1న రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో పబ్లిసిటీ వేగాన్ని పెంచబోతున్నారు. సమంతా తిరిగి వెళ్లబోయే ముందు ఇంకొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చేసి తన వంతు బాధ్యతను పూర్తి చేస్తుంది. మళ్ళీ ఇంకో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తారా లేదానేది ఇంకా తెలియదు. ఇంకో పదమూడు రోజులు టైం ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఓ వేడుక చేయాలనే ఆలోచనలో ఉన్నారు మైత్రి అధినేతలు. లైగర్ గాయం ఖుషి దెబ్బకు పూర్తిగా మాయమైపోయి తనకు మునుపటి ఫామ్ వస్తుందని ఎదురు చూస్తున్న విజయ్ ఈసారైనా బ్రేక్ అందుకుంటాడేమో చూడాలి.
This post was last modified on August 18, 2023 1:13 pm
చైనాలో నాలుగేళ్ల క్రితం జరిగిన ఘోర విమాన ప్రమాదానికి సంబంధించి ఇప్పుడు దిమ్మతిరిగే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చైనా ఈస్టర్న్…
పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెళ్లబోతూ తమిళ టాప్ స్టార్ విజయ్ నటించిన చివరి చిత్రం.. జననాగయన్. ఇది తెలుగు హిట్…
టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేవలం పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి కావడం దేశ రాజకీయాల్లో ఒక…
ఐపీఎల్ అంటేనే కోట్లు కురిపించే లీగ్ అని అందరూ అనుకుంటారు, కానీ దీని వెనుక కొన్ని జీవితకాల పోరాటాలు ఉంటాయి.…
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న భారీ ప్యాన్ ఇండియా మూవీ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది. విడుదల…