ఊహించని విధంగా మెగాస్టార్ కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచిన భోళా శంకర్ నిర్మాత అనిల్ సుంకర దీని నష్టాల వల్లే ఇబ్బందులు పడుతున్నారని, పలు ఆస్తులు అమ్మి డ్యామేజీని భర్తీ చేసే ప్లాన్ చేసే ప్లాన్ లో ఇలా ఏదేదో ప్రచారం జరిగింది. ఇంతే కాదు చిరంజీవి తనకు రావలసిన పారితోషికం గురించి పట్టు పట్టినందువల్లే ఇలా జరిగిందనే పుకారు కూడా రెక్కలు తొడిగింది. ఒకపక్క ఫ్లాప్ ఫలితం, ఇంకో వైపు ఈ వార్తల షికారు వెరసి సోషల్ మీడియా ట్రోల్స్ కు హద్దు అదుపు లేకుండా పోయింది. ఫైనల్ గా స్వయానా అనిల్ సుంకర దీనికి ట్విట్టర్ వేదికగా చెక్ పెట్టారు.
కొందరి వినోదాన్ని సంతృప్తి పరచడం కోసం పుకార్లు పుట్టొచ్చు, కానీ దాని కోసం దశాబ్దాల తరబడి ఒకరు సంపాదించుకున్న పేరుకి నష్టం కలిగించాలని చూడటం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాని నేరం. నాకు చిరంజీవికి మధ్య విభేదాలు ఉన్నాయని వస్తున్న వార్తలేవీ నిజాలు కాదు. అంతా ట్రాష్. నాకు ఎప్పుడూ మద్దతుగానే ఉన్నారు. ఎప్పటిలాగే స్నేహంగా ఉంటారు. నిజాలను ద్వేషంతో కప్పొద్దు. ఇలాంటివి సృష్టించడం కొందరికి ఫన్ కావొచ్చు, కానీ వాటి ప్రభావం పని చేసిన అందరి మీదా ఉంటుంది. నాకు మద్దతుగా ఉన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ మళ్ళీ కంబ్యాక్ అవుతానని తెలియజేసుకుంటున్నాను.
ఇది అనిల్ సుంకర పెట్టిన పూర్తి ట్వీట్ తాలూకు పాఠం. మొత్తానికి విపరీత ప్రచారానికి బ్రేక్ వేసేలా అనిల్ సుంకర స్పందించడం పట్ల మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏజెంట్ టైంలోనూ రిజల్ట్ పరంగా ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి ఎదురుకున్న ఈ అగ్ర నిర్మాతకు తగిన హిట్ దక్కాలని ఇండస్ట్రీ వర్గాలతో పాటు మూవీ లవర్స్ కోరుకుంటున్నారు. భోళా శంకర్ ఫైనల్ రన్ కు చాలా దగ్గరలో ఉంది. ఎంతమేరకు నష్టాలు వస్తాయనేది ఇంకొద్ది రోజుల్లో తేలిపోతుంది కానీ మెగాస్టార్ తో మరో సినిమా చేసే అవకాశం వస్తే ఈసారి పొరపాటే లేకుండా చూసుకుంటానని అనిల్ సుంకర తన సన్నిహితులతో అంటున్నారట.
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…