గత ఏడాది ఆచార్య మూవీతో చిరంజీవి చాలా పెద్ద పరాభవాన్ని ఎదుర్కొన్నారు. మెగాస్టార్ కెరీర్లో డిజాస్టర్లు లేవని కాదు కానీ.. మరీ ఆ స్థాయిలో బాక్సాఫీస్ దగ్గర చతికిలపడ్డ సినిమాలు అరుదు. వీకెండ్లోనే థియేటర్లు వెలవెలబోయాయి. మధ్యలో గాడ్ ఫాదర్ కూడా ఆశించిన పలితాన్ని ఇవ్వకపోయినా.. ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్యతో చిరు బలంగా బౌన్స్ బ్యాక్ అయ్యారు.
ఈ సినిమా పెద్ద బ్లాక్బస్టర్ అయి మెగా అభిమానుల్లో తిరిగి ఉత్సాహాన్ని తెచ్చింది. కానీ భోళా శంకర్ ఆ ఉత్సాహం మీద పూర్తిగా నీళ్లు చల్లేసింది. ఆచార్యను మించి డిజాస్టర్ అయి చిరుకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. చిరు తన సినిమాల ఎంపిక, జడ్జిమెంట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని భోళా శంకర్ను గుర్తు చేసింది. అందుకే చిరు కూడా వెంటనే తన కొత్త సినిమాను మొదలుపెట్టట్లేదు.
కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చిరు తన కొత్త చిత్రాన్ని వెంటనే మొదలుపెట్టాల్సి ఉన్నప్పటికీ.. ఇప్పుడు ఆలోచన మారినట్లు తెలుస్తోంది. మోకాలి శస్త్ర చికిత్స కూడా ఆలస్యానికి ఒక కారణం అయినప్పటికీ.. అత్యవసరం కాకపోయినప్పటికీ ఈ టైంలోనే సర్జరీ పెట్టుకోవడం ఒక రకంగా బ్రేక్ కోసమే అంటున్నారు. చిరు కోలుకునే లోపు మరోసారి స్క్రిప్టు మీద పని చేయబోతున్నారట. ఈ సినిమా బ్రో డాడీ రీమేక్ అని వార్తలు వచ్చినప్పటికీ.. అదేమీ కాదని ఇటీవల వార్తలు వచ్చాయి.
ఐతే మాతృకలో మూల కథను మాత్రమే తీసుకుని పూర్తిగా డిఫరెంట్ ట్రీట్మెంట్తో స్క్రిప్టు తయారు చేస్తున్నారట. భోళా శంకర్ తర్వాత చిరు అలెర్ట్ అయి స్క్రిప్టు మీద మరింత వర్క్ చేయాలని చెప్పినట్లు సమాచారం. దీంతో కళ్యాణ్ కృష్ణ తన రైటర్స్ టీంతో కలిసి మళ్లీ హైదరాబాద్లోని ఓ హోటల్లో సిట్టింగ్స్ మొదలుపెట్టినట్లు తెలిసింది. ఆలస్యం అయినా సరే.. రీమేక్ ఛాయలు లేకుండా.. పకడ్బందీగా స్క్రిప్టు రెడీ చేసుకుని చిరు ఆమోద ముద్ర వేశాక షూటింగ్కు వెళ్తారట.
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…