గత ఏడాది ఆచార్య మూవీతో చిరంజీవి చాలా పెద్ద పరాభవాన్ని ఎదుర్కొన్నారు. మెగాస్టార్ కెరీర్లో డిజాస్టర్లు లేవని కాదు కానీ.. మరీ ఆ స్థాయిలో బాక్సాఫీస్ దగ్గర చతికిలపడ్డ సినిమాలు అరుదు. వీకెండ్లోనే థియేటర్లు వెలవెలబోయాయి. మధ్యలో గాడ్ ఫాదర్ కూడా ఆశించిన పలితాన్ని ఇవ్వకపోయినా.. ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్యతో చిరు బలంగా బౌన్స్ బ్యాక్ అయ్యారు.
ఈ సినిమా పెద్ద బ్లాక్బస్టర్ అయి మెగా అభిమానుల్లో తిరిగి ఉత్సాహాన్ని తెచ్చింది. కానీ భోళా శంకర్ ఆ ఉత్సాహం మీద పూర్తిగా నీళ్లు చల్లేసింది. ఆచార్యను మించి డిజాస్టర్ అయి చిరుకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. చిరు తన సినిమాల ఎంపిక, జడ్జిమెంట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని భోళా శంకర్ను గుర్తు చేసింది. అందుకే చిరు కూడా వెంటనే తన కొత్త సినిమాను మొదలుపెట్టట్లేదు.
కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చిరు తన కొత్త చిత్రాన్ని వెంటనే మొదలుపెట్టాల్సి ఉన్నప్పటికీ.. ఇప్పుడు ఆలోచన మారినట్లు తెలుస్తోంది. మోకాలి శస్త్ర చికిత్స కూడా ఆలస్యానికి ఒక కారణం అయినప్పటికీ.. అత్యవసరం కాకపోయినప్పటికీ ఈ టైంలోనే సర్జరీ పెట్టుకోవడం ఒక రకంగా బ్రేక్ కోసమే అంటున్నారు. చిరు కోలుకునే లోపు మరోసారి స్క్రిప్టు మీద పని చేయబోతున్నారట. ఈ సినిమా బ్రో డాడీ రీమేక్ అని వార్తలు వచ్చినప్పటికీ.. అదేమీ కాదని ఇటీవల వార్తలు వచ్చాయి.
ఐతే మాతృకలో మూల కథను మాత్రమే తీసుకుని పూర్తిగా డిఫరెంట్ ట్రీట్మెంట్తో స్క్రిప్టు తయారు చేస్తున్నారట. భోళా శంకర్ తర్వాత చిరు అలెర్ట్ అయి స్క్రిప్టు మీద మరింత వర్క్ చేయాలని చెప్పినట్లు సమాచారం. దీంతో కళ్యాణ్ కృష్ణ తన రైటర్స్ టీంతో కలిసి మళ్లీ హైదరాబాద్లోని ఓ హోటల్లో సిట్టింగ్స్ మొదలుపెట్టినట్లు తెలిసింది. ఆలస్యం అయినా సరే.. రీమేక్ ఛాయలు లేకుండా.. పకడ్బందీగా స్క్రిప్టు రెడీ చేసుకుని చిరు ఆమోద ముద్ర వేశాక షూటింగ్కు వెళ్తారట.
This post was last modified on August 17, 2023 11:30 am
మొన్నటిదాకా టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా అత్యధిక డిమాండ్ అనుభవించిన పూజా హెగ్డే కెరీర్ ప్రారంభంలో వచ్చిన ఐరన్ లెగ్…
ప్రకాశం జిల్లాలో ఆమంచి కృష్ణమోహన్ రాజకీయంగా ఒక బలమైన నాయకుడే అని చెప్పాలి. అయితే తన రాజకీయ భవిష్యత్తు కోసం…
తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రెండు ప్రమాదాలు తప్పించుకుని మూడో ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. నెలల వ్యవధిలో…
ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ 2003లో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో 681 చదరపు గజాల స్థలం సుంకు గీత అనే…
ఒక్క చిన్న ఇన్స్ టా పోస్ట్ తో ప్రభాస్ సోషల్ మీడియాని ఊపేస్తున్నాడు. హలో డార్లింగ్స్ చివరికి చాలా ప్రత్యేకం…
ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే మనకు వెంటనే గుర్తొచ్చే బ్యానర్లు సితార, మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…