ఈ రోజుల్లో సినిమాల ప్రమోషన్లు మామూలుగా సాగితే జనాల దృష్టిలో పడటం కష్టం. సినిమాలో కంటెంట్ ఉన్నా సరే.. ప్రోమోలు సెన్సేషనల్గా ఉండేలా చూసుకోవాలి. అలాగే ప్రమోషన్లు కొంచెం భిన్నంగా చేసి సినిమా గురించి జనాల నోళ్లలో నానేలా చూసుకోవాలి. అందుకే యువ కథానాయకులు, ఫిలిం మేకర్స్ ఔట్ ఆఫ్ ద బాక్స్ ఐడియాలతో ముందుకు వెళ్తున్నారు. ఇందుకోసం కొంచెం బోల్డ్గానూ ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా విజయ్ దేవరకొండ అనగానే ప్రమోషన్ల వ్యవహారమే వేరుగా ఉంటుంది.
తాజాగా ఖుషి సినిమా మ్యూజికల్ కన్సర్ట్ వేడుకలో సమంతతో కలిసి అతను స్టేజ్ మీద రొమాన్స్ను పండించిన తీరు.. వాళ్లిద్దరి కెమిస్ట్రీ చర్చనీయాంశం అయింది. ఈ విషయంలో కొన్ని విమర్శలు వచ్చినా ఖుషి టీం పట్టించుకోలేదు. విజయ్, సామ్ హద్దులు దాటారని విమర్శలు కొనసాగుతున్న సమయంలోనే ఇంకో పెయిర్ ఇదే స్టయిల్లో స్టేజ్ మీద రొమాన్స్ చేయడం హాట్ టాపిక్గా మారింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా నుంచి సుట్టంలా సూసి అనే పాటను బుధవారం లాంచ్ చేశారు.
హైదరాబాద్లో జరిగిన ఈ వేడుకలో హీరో హీరోయిన్లు విశ్వక్సేన్, నేహా శెట్టి ఒక బోల్డ్ యాక్ట్తో అందరి దృష్టినీ ఆకర్షించారు. ఈ పాటలో నేహా చీరలో చాలా సెక్సీగా కనిపించింది. ఆ పాటకు తగ్గట్లే స్టేజ్ మీద తన చీర కొంగును తీసి.. విశ్వక్కు ఇవ్వడం.. అతను దాన్ని నోట్లో పెట్టుకోవడం.. చుట్టుకోవడం.. అలాగే ఇద్దరూ కలిసి స్టెప్పులేయడం.. ఇలా స్టేజ్ మీద ఇద్దరి రచ్చ మామూలుగా లేదు. ఈ వీడియో కాసేపటికే సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. విజయ్, సామ్లను విశ్వక్, నేహా కాపీ కొట్టారని కొందరంటే.. ప్రమోషన్ల పేరుతో ఏమిటీ అతి అంటూ కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
This post was last modified on August 16, 2023 9:47 pm
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…