కొద్దిరోజుల క్రితం రజనీకాంత్ – అమితాబ్ బచ్చన్ కాంబినేషన్ లో జై భీం దర్శకుడు టిజె జ్ఞానవేల్ తీయబోయే సినిమాలో న్యాచురల్ స్టార్ నానికి ఓ కీలక పాత్ర ఆఫర్ చేశారనే వార్త గట్టిగానే తిరిగింది. నిప్పు లేనిదే పొగరాదు తరహాలో చెన్నై మొదలైన ఈ న్యూస్ హైదరాబాద్ దాకా పాకిపోయింది. అయితే తెరవెనుక పరిణామాలు ఏం జరిగాయో కానీ ఇప్పుడా స్థానంలో శర్వానంద్ రాబోతున్నట్టు లేటెస్ట్ అప్డేట్. ఈ ప్రాజెక్ట్ అఫీషియల్ గా మొదలవ్వలేదు. స్క్రిప్ట్ మాత్రమే లాక్ అయ్యింది. రజని హిమాలయాల నుంచి తిరిగి వచ్చాక రెగ్యులర్ షూటింగ్ కోసం డేట్లు ఫిక్స్ చేస్తారు.
నిజంగానే నాని వదులుకున్నాడా లేక ఇంకేదైనా సమస్య వల్ల నో చెప్పాల్సి వచ్చిందా అనేది ఇంకా తెలియదు. సూపర్ స్టార్, బిగ్ బి షేర్ చేసుకునే స్క్రీన్ లో భాగం కావడమంటే అంత కన్నా అదృష్టం ఉండదు. అయితే ఇన్ సైడ్ టాక్ లో వినిపిస్తోంది ఏంటంటే ఈ ముగ్గురి కాంబో సీన్లు స్క్రీన్ మీద ఉండవట. స్టోరీ అలా ఉందని, రజని అమితాబ్ లు కలిసే ఎపిసోడ్లు ఉంటాయి కానీ మూడో పాత్రలో నటించే యూత్ స్టార్ ట్రాక్ వేరుగా ఉంటుందని అంటున్నారు. బహుశా ఈ కారణం వల్లే నాని నో చెప్పి ఉండే అవకాశాలను కొట్టిపారేయలేం. ఏదీ అఫీషియల్ కాదు కాబట్టి ఖచ్చితంగా చెప్పలేం.
ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సినిమా చేస్తున్న శర్వానంద్ కు మెగాస్టార్ చిరంజీవి ప్రాజెక్టులోనూ భాగం కాబోతున్నాడనే వార్త గత రెండు వారాలుగా చక్కర్లు కొడుతూనే ఉంది. సిద్దు జొన్నలగడ్డ స్థానంలో కళ్యాణ్ కృష్ణ తీయబోయే మెగా మూవీలో శర్వా ఓకే అయ్యాడనే టాక్ కు సైతం ఎలాంటి నిర్ధారణ లేదు. వరస ఫ్లాపుల తర్వాత ఒకే ఒక జీవితంతో తిరిగి హిట్ ట్రాక్ లోకి వచ్చిన శర్వానంద్ ఈ మధ్యే ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. ఏదైతేనేం నిజంగానే రజని అమితాబ్ సినిమాలో ఛాన్స్ కన్ఫర్మ్ అయితే ఒక చిరకాల జ్ఞాపకం ఫిల్మోగ్రఫీలో ఉండిపోతుంది.
This post was last modified on August 16, 2023 4:52 pm
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…
బారత ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ... వరుసబెట్టి మూడు పర్యాయాలు దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా దేశానికి అత్యధిక…