కొద్దిరోజుల క్రితం రజనీకాంత్ – అమితాబ్ బచ్చన్ కాంబినేషన్ లో జై భీం దర్శకుడు టిజె జ్ఞానవేల్ తీయబోయే సినిమాలో న్యాచురల్ స్టార్ నానికి ఓ కీలక పాత్ర ఆఫర్ చేశారనే వార్త గట్టిగానే తిరిగింది. నిప్పు లేనిదే పొగరాదు తరహాలో చెన్నై మొదలైన ఈ న్యూస్ హైదరాబాద్ దాకా పాకిపోయింది. అయితే తెరవెనుక పరిణామాలు ఏం జరిగాయో కానీ ఇప్పుడా స్థానంలో శర్వానంద్ రాబోతున్నట్టు లేటెస్ట్ అప్డేట్. ఈ ప్రాజెక్ట్ అఫీషియల్ గా మొదలవ్వలేదు. స్క్రిప్ట్ మాత్రమే లాక్ అయ్యింది. రజని హిమాలయాల నుంచి తిరిగి వచ్చాక రెగ్యులర్ షూటింగ్ కోసం డేట్లు ఫిక్స్ చేస్తారు.
నిజంగానే నాని వదులుకున్నాడా లేక ఇంకేదైనా సమస్య వల్ల నో చెప్పాల్సి వచ్చిందా అనేది ఇంకా తెలియదు. సూపర్ స్టార్, బిగ్ బి షేర్ చేసుకునే స్క్రీన్ లో భాగం కావడమంటే అంత కన్నా అదృష్టం ఉండదు. అయితే ఇన్ సైడ్ టాక్ లో వినిపిస్తోంది ఏంటంటే ఈ ముగ్గురి కాంబో సీన్లు స్క్రీన్ మీద ఉండవట. స్టోరీ అలా ఉందని, రజని అమితాబ్ లు కలిసే ఎపిసోడ్లు ఉంటాయి కానీ మూడో పాత్రలో నటించే యూత్ స్టార్ ట్రాక్ వేరుగా ఉంటుందని అంటున్నారు. బహుశా ఈ కారణం వల్లే నాని నో చెప్పి ఉండే అవకాశాలను కొట్టిపారేయలేం. ఏదీ అఫీషియల్ కాదు కాబట్టి ఖచ్చితంగా చెప్పలేం.
ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సినిమా చేస్తున్న శర్వానంద్ కు మెగాస్టార్ చిరంజీవి ప్రాజెక్టులోనూ భాగం కాబోతున్నాడనే వార్త గత రెండు వారాలుగా చక్కర్లు కొడుతూనే ఉంది. సిద్దు జొన్నలగడ్డ స్థానంలో కళ్యాణ్ కృష్ణ తీయబోయే మెగా మూవీలో శర్వా ఓకే అయ్యాడనే టాక్ కు సైతం ఎలాంటి నిర్ధారణ లేదు. వరస ఫ్లాపుల తర్వాత ఒకే ఒక జీవితంతో తిరిగి హిట్ ట్రాక్ లోకి వచ్చిన శర్వానంద్ ఈ మధ్యే ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. ఏదైతేనేం నిజంగానే రజని అమితాబ్ సినిమాలో ఛాన్స్ కన్ఫర్మ్ అయితే ఒక చిరకాల జ్ఞాపకం ఫిల్మోగ్రఫీలో ఉండిపోతుంది.
This post was last modified on August 16, 2023 4:52 pm
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…