నిర్మాతగా ఎంత పెద్ద స్థాయికి ఎదిగినా డిస్ట్రిబ్యూషన్ మాత్రం ఆపలేదు దిల్ రాజు. ఓవైపు గ్యాప్ లేకుండా పెద్ద సినిమాలు నిర్మిస్తూనే.. ఇంకోవైపు నైజాం ఏరియాలో తరచుగా సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాడు రాజు. అలా అని ఆయన ఏ సినిమా పడితే ఆ సినిమాను పంపిణీ చేయడు. ఏది వర్కవుట్ అవుతుందో సరిగ్గా అంచనా వేసి హక్కులు తీసుకుంటూ ఉంటాడు. చాలా వరకు ఆయన జడ్జిమెంట్ కరెక్ట్ అవుతుంటుంది.
తాజాగా రాజుకు ‘జైలర్’ రూపంలో జాక్పాట్ దక్కింది. రజినీ గత సినిమాల ప్రభావం వల్ల ‘జైలర్’ రైట్స్ తక్కువ మొత్తానికే అమ్మారు. పెట్టుబడి మీద ఈ చిత్రం మూడు రెట్ల దాకా ఆదాయం తెచ్చిపెడుతుండటం విశేషం. ఈ ఏడాది మిగిలిన నాలుగు నెలల్లో రాజు నుంచి మరిన్ని సినిమాలు రాబోతున్నాయి. దసరాకు ఆయన ఒకేసారి రెండు సినిమాలను నైజాం ఏరియాలో రిలీజ్ చేస్తుండటం విశేషం.
ఆల్రెడీ అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘భగవంత్ కేసరి’ సినిమా నైజాం డిస్ట్రిబ్యూషన్ను ఫ్యాన్సీ రేటుకు తీసుకున్నాడు రాజు. దీంతో పాటుగా ‘లియో’ రైట్స్ కూడా నైజాం వరకు చేజిక్కించుకున్నట్లు సమాచారం. ‘లియో’ తెలుగు హక్కులను హోల్సేల్గా సితార సంస్థ తీసుకుంది. వారి నుంచి నైజాం రైట్స్ను మారు బేరానికి రాజు తీసుకున్నట్లు సమాచారం.
ఒకే సీజన్లో రెండు క్రేజీ సినిమాలను ఒకే పంపిణీ సంస్థ రిలీజ్ చేయడం విశేషమే. కానీ రాజుకు ఇదేమీ కొత్త కాదు. గతంలోనూ సంక్రాంతి టైంలో ఇలా చేశాడు. ‘భగవంత్ కేసరి’ మీద భారీ అంచనాలే ఉన్నాయి. బాలయ్య కెరీర్లోనే అత్యధిక బిజినెస్ చేస్తోంది ఈ చిత్రం. ఇప్పుడు బాలయ్య టైం నడుస్తోందని రాజుకు అర్థమై మంచి రేటు పెట్టి రైట్స్ తీసుకున్నాడు. అలాగే విజయ్కి తెలుగులో క్రేజ్ పెరిగిన నేపథ్యంలో ‘లియో’ రైట్స్కు కూడా ఫ్యాన్సీ రేటే ఇచ్చారట రాజు. మరి దసరాకు రాజు డిస్ట్రిబ్యూటర్గా డబుల్ ధమాకా కొడతారేమో చూడాలి.
గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ తర్వాత వెంకటేష్ బాగా గ్యాప్ తీసుకున్నారు. అతిథి పాత్ర కాబట్టి మన…
తెలంగాణ… 4 కోట్ల మంది తెలంగాణ భూమిపుత్రుల జాగీరేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.…
గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక అభిమానులను బాధ పెడుతున్న మాస్ మహారాజ రవితేజ ఎట్టకేలకు రూటు మార్చేశారు. రొటీన్…
ఇవాళ సాయంత్రం ప్రీమియర్లతో విడుదల కాబోతున్న పెద్దికి సంబంధించి అందరు దృష్టి సారిస్తున్న ప్రధానాంశాల్లో ఏఅర్ రెహమాన్ సంగీతం ఒకటి.…
మెగా కౌంట్ డౌన్ లో సంవత్సరాలు నెలలుగా మారిపోయి, రోజులకు దిగిపోయి, ఇప్పుడు గంటల్లోకి వచ్చేసింది. మెగాభిమానులు, సినీ ప్రియులు…
తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మొన్నటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాాలే ఇందుకు కారణమని చెప్పాలి. ఈ…