జైలర్ రాకముందు వరకు రజనీకాంత్ మార్కెట్ ఇతర భాషల్లో ఎంతో పడిపోయిందే అనుకుంటున్న టైంలో ఒక్కసారిగా లెక్కలు మారిపోయాయి. వారం తిరగకుండానే ఏకంగా 400 కోట్ల వసూళ్లను దాటేయడం చూసి ఎవరికీ నోట మాట రావడం లేదు. భోళా శంకర్ టాక్ ఎంత బ్యాడ్ గా ఉన్నా దానికి రావాల్సిన కనీస వసూళ్లను దెబ్బేసే రేంజ్ లో సూపర్ స్టార్ అరాచకం బయ్యర్ల పాలిట కామధేనువుగా మార్చేసింది. ఇంకో వారం పది రోజులు ఇదే దూకుడు కొనసాగడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనికి రజని కూతురు జాక్ పాట్ కొట్టడానికి లింక్ ఏంటనేగా డౌట్.
అక్కడికే వద్దాం. ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో లాల్ సలామ్ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. కీలక భాగం షెడ్యూల్స్ పూర్తి చేశారు. కూతురు కోసం తండ్రి ఒక ప్రత్యేక క్యామియో చేశారు. మరీ తక్కువ నిడివి కాకుండా కాస్త చెప్పుకోదగ్గ లెన్త్ తో ఈ పాత్ర ఉంటుందట. ఈ భాగం చిత్రీకరణ అయిపోయింది. విష్ణు విశాల్ హీరోగా నటిస్తుండగా ఏఆర్ రెహమాన్ సంగీతం మీద మంచి అంచనాలున్నాయి. గెస్టు రోల్స్ కి ఎప్పుడో గుడ్ బై చెప్పిన రజని కేవలం ఐశ్యర్యకు బ్రేక్ దక్కాలనే ఉద్దేశంతో కథ నచ్చి రెండో ఆలోచన చేయకుండా ఎస్ అన్నారు.
కట్ చేస్తే జైలర్ దెబ్బకు ఇప్పుడు లాల్ సలామ్ కు డిమాండ్ పెరిగింది. ఎందుకంటే తలైవర్ నెక్స్ట్ రిలీజ్ అయ్యే సినిమా ఇదే. కొత్తవి మొదలుపెట్టలేదు. హిమాలయాలకు వెళ్లిన రజని తిరిగి వచ్చాక కొంత రెస్ట్ తీసుకుని ఆ తర్వాత జై భీం టిజె జ్ఞానవేల్ సెట్లో పాల్గొంటారు. అయితే దీనికి టైం పట్టేలా ఉంది. జైలర్ ఫీవర్ తో ఊగిపోతున్న జనాలకు తక్కువ గ్యాప్ లో లాల్ సలాంతో రజని దర్శనమిస్తే అంతకన్నా కావాల్సింది ఏముంటుంది. పైగా ఇందులో ముస్లిం వర్గానికి చెందిన డాన్ గా నటించారు. బిజినెస్ ఆఫర్లు చూస్తుంటే లైకా సంస్థ నిర్మాతలకు నోట మాట రావడం లేదట.
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…