మెగాస్టార్ చిరంజీవి నుంచి ‘వాల్తేరు వీరయ్య’ లాంటి బ్లాక్బస్టర్ తర్వాత వచ్చిన సినిమా ‘భోళా శంకర్’. ఈ చిత్రంపై ముందు నుంచి అంచనాలు తక్కువే అయినప్పటికీ.. ఎంతైనా చిరంజీవి సినిమా కాబట్టి బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు ఫలితాన్నయినా అందుకుంటుందని అనుకున్నారు. కానీ సామాన్య ప్రేక్షకులతో పాటు మెగా ఫ్యాన్స్ సైతం ఈ సినిమాను తిరస్కరించడంతో చేదు అనుభవం తప్పలేదు.
‘ఆచార్య’ కంటే దారుణంగా బోల్తా కొట్టిన ఈ చిత్రం చిరు కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్గా నిలవబోతోందని స్పష్టమైపోయింది. ఫుల్ రన్లో రూ.25 కోట్ల షేర్ కూడా వచ్చే పరిస్థితి లేదంటే అర్థం చేసుకోవచ్చు. ఇండిపెండెన్స్ డే సెలవుతో ఈ సినిమా రన్ ముగిసినట్లే. మెగా ఫ్యాన్స్ కూడా ఈ సినిమాను పట్టించుకోవడం మానేశారు. ఐతే ఈ చిత్రం త్వరలోనే హిందీలో రిలీజ్ కాబోతుండటం విశేషం. ఆగస్టు 25కు రిలీజ్ డేట్ కూడా ఖరారైంది.
‘భోళా శంకర్’ను అదే పేరుతో 25న నార్త్ ఇండియాలో రిలీజ్ చేయబోతున్నారు. ఆల్రెడీ ట్రైలర్ కూడా బయటికి వచ్చింది. చిరంజీవికి హిందీలో సీనియర్ నటుడు జాకీష్రాఫ్ డబ్బింగ్ చెప్పడం విశేషం. తెలుగు వెర్షన్ పోస్ట్ ప్రొడక్షన్ టైంలోనే హిందీ డబ్బింగ్ పనులు కూడా జరిగినట్లున్నాయి. ప్రస్తుతం గదర్-2, ఓఎంజీ-2 చిత్రాలతో గట్టి పోటీ ఉంది కాబట్టి రెండు వారాలు ఆలస్యంగా రిలీజ్ ప్లాన్ చేసినట్లున్నారు.
‘భోళా శంకర్’ హిందీ ట్రైలర్ను తెలుగు వాళ్లే షేర్ చేస్తూ దాని మీద కామెడీ చేస్తున్నారు. తెలుగులో ఇంత డిజాస్టర్ అయిన సినిమా హిందీలో మాత్రం ఏం ప్రభావం చూపుతుందని కౌంటర్లు వేస్తున్నారు. కాకపోతే ఈ సినిమాతో దారుణంగా నష్టపోయిన నిర్మాత అనిల్ సుంకరకు హిందీ నుంచి అంతో ఇంతో ఆదాయం వస్తుందేమో చూడాలి. ఐతే దీని ఒరిజినల్ ‘వేదాళం’ హిందీ డబ్బింగ్ వెర్షన్ ఆల్రెడీ చాలా ఏళ్ల నుంచి యూట్యూబ్లో అందుబాటులో ఉండటం గమనార్హం.
This post was last modified on August 16, 2023 11:19 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…