తెలుగులో ఎవరైనా స్టార్ హీరో రీమేక్ చేస్తున్నాడంటే చాలు.. అభిమానులు వద్దు మొర్రో అని గోల చేయడం మామూలు అయిపోయింది. ఎంత మార్పులు చేర్పులు చేసినా.. కొత్త ఆకర్షణలు జోడించినా సరే.. రీమేక్ అంటే ప్రేక్షకుల్లో ఎగ్జైట్మెంట్ ఉండట్లేదు. ఇంటర్నెట్ విప్లవం.. ఓటీటీల హవా కారణంగా అందరూ అన్ని భాషల చిత్రాలూ చూసేస్తున్న రోజులివి. అందులోనూ ఒక భాషలో ఓ సినిమా హిట్టయింది అంటే చాలు.. ఆ లాంగ్వేజ్ రాకపోయినా సరే సబ్టైటిల్స్ పెట్టుకుని చూస్తున్నారు.
అవి అందుబాటులో లేకపోయినా చూడ్డానికి వెనుకాడట్లేదు. ఒక పాపులర్ సినిమా అంటే సినిమా చూసినా చూడకపోయినా ఆటోమేటిగ్గా సినిమాలోని విశేషాలన్నీ సోషల్ మీడియాలోకి వచ్చేస్తున్నాయి. అందువల్లే దాన్ని మరో భాషలో పునర్నిర్మిస్తుంటే ప్రేక్షకుల్లో ఆసక్తి ఉండట్లేదు. కథాకథనాలతో పాటు అన్ని విశేషాలూ బయటికి వచ్చేశాక ఇంక సినిమా చూడటంలో ఎగ్జైట్మెంట్ ఏముంటుంది?
ఐతే ప్రేక్షకుల ఆలోచనను, అభిరుచిని అర్థం చేసుకోకుండా కొందరు హీరోలు మాత్రం రీమేక్ల మీద రీమేక్లు తీసేస్తున్నారు. ముఖ్యంగా మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా పోటీ పడి రీమేక్లు చేస్తున్నారు. ఈ సినిమాల విషయంలో ప్రేక్షకుల అనాసక్తి ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉన్నా మెగా బ్రదర్స్ వెనక్కి తగ్గట్లేదు. పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’, ‘భీమ్లా నాయక్’, ‘బ్రో’.. వీటిలో దేనికీ పూర్తి సంతృప్తికర ఫలితం రాలేదు.
రెవెన్యూ సినిమా సినిమాకూ తగ్గుగూ వచ్చి ‘బ్రో’ అయితే డిజాస్టరే అయింది. ఇక చిరు విషయానికి వస్తే రీఎంట్రీ మూవీ కాబట్టి ‘ఖైదీ నంబర్ 150’ బాగానే ఆడింది. కానీ ‘గాడ్ ఫాదర్’ నిరాశపరిచింది. ‘భోళా శంకర్’ అయితే భారీ డిజాస్టర్ అయింది. బ్రో, భోళా శంకర్ సినిమాల విషయంలో మెగా అభిమానుల నుంచే తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. ఇక రీమేక్లు చాలించమని మెగా బ్రదర్స్కు అభిమానులు గట్టిగా సంకేతాలు ఇచ్చినట్లే కనిపించింది ట్రెండ్ చూస్తే.
ఇక సాధారణ ప్రేక్షకుల సంగతైతే చెప్పాల్సిన పని లేదు. చిరు, పవన్ అనే కాదు.. ఏ హీరోలు అయినా రీమేక్ల జోలికి వెళ్తే డిజైరింగ్ రిజల్ట్ రాదనే హింట్స్ ప్రేక్షకులు ఇచ్చేశారు. ఫలక్నుమాదాస్, జాను, శేఖర్, ఇష్క్, బుట్టబొమ్మ.. ఇలా గత కొన్నేళ్లలో దారుణంగా దెబ్బ తిన్న రీమేక్ సినిమాల జాబితా పెద్దదే. అందుకే మొత్తం ఇండస్ట్రీలోనే రీమేక్ల గురించి ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది. వీలైనంత వరకు వీటికి దూరంగా ఉండాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on August 15, 2023 6:53 pm
ఏపీలో ఎన్నికల పోలింగ్ అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలను నిలువరించలేక పోయిన.. ఉన్నతాధికారులపై(ఒక జిల్లా కలెక్టరు, ముగ్గురు ఎస్పీలు) వేటు…
ఇంకా షూటింగ్ కాదు కదా కనీసం పూజా కార్యక్రమాలు కూడా జరగని మహేష్ బాబు - రాజమౌళి సినిమా తాలూకు…
ఏపీ సీఎం జగన్ కుటుంబ సమేతంగా విహార యాత్రకు వెళ్లిన విషయం తెలిసిందే. సతీమణి వైఎస్ భారతి, కుమార్తెలు హర్ష,…
మన కల్కి 2898 ఏడిలాగే తమిళంలోనూ విపరీతమైన జాప్యానికి గురవుతున్న ప్యాన్ ఇండియా మూవీ కంగువ. సిరుతై శివ దర్శకత్వంలో…
నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…
గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…