బాహుబలి లాంటి సినిమా చేసిన తర్వాత జాతీయ వ్యాప్తంగా వచ్చిన ఇమేజ్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. బాహుబలి విడుదలకి ముందే తదుపరి రెండు చిత్రాలను యువ దర్శకులతో ప్రభాస్ ఓకే చేసేసుకోవడం వల్ల బాహుబలి తర్వాత ప్లానింగ్కి టైమ్ కుదరలేదు. అప్పట్నుంచీ షూటింగ్స్తోనే బిజీగా వున్న ప్రభాస్కి ఈ లాక్ డౌన్ వల్ల చాలా తీరిక సమయం దొరికింది. అందుకే వివిధ దర్శకులు చెప్పిన కథలు విని తనకు బాగా నచ్చినవి, తన పాన్ ఇండియా ఇమేజ్కి సరితూగుతాయని అనిపించినవీ ప్రభాస్ ఎంచుకున్నాడు.
ఈ క్రమంలో సందీప్ రెడ్డి వంగా, సురేందర్ రెడ్డి తదితరులు చెప్పిన కథలు ప్రభాస్కి నచ్చలేదు. నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ని సింగిల్ సిట్టింగ్లో ఓకే చేసిన ప్రభాస్ ‘ఆదిపురుష్’తో బాలీవుడ్లో స్ట్రెయిట్ సినిమా చేయాలనే లక్ష్యం కూడా చేరుకుంటున్నాడు. ఒకవేళ లాక్ డౌన్ లేనట్టయితే ప్రభాస్ ఈ టైమ్లో రాధేశ్యామ్ షూటింగ్ కోసం యూరప్ పరిసర ప్రాంతాల్లో వుండేవాడు. లాక్ డౌన్ వల్ల చాలా మంది దర్శకులను కలిసి, కథలు ఎంచుకునే సౌలభ్యం చిక్కింది. ఈ లాక్ డౌన్ని ఇంత ఎఫెక్టివ్గా వాడుకున్న మరో హీరో లేడంటే అతిశయెక్తి కాదు.
This post was last modified on August 19, 2020 12:11 am
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…