బాహుబలి లాంటి సినిమా చేసిన తర్వాత జాతీయ వ్యాప్తంగా వచ్చిన ఇమేజ్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. బాహుబలి విడుదలకి ముందే తదుపరి రెండు చిత్రాలను యువ దర్శకులతో ప్రభాస్ ఓకే చేసేసుకోవడం వల్ల బాహుబలి తర్వాత ప్లానింగ్కి టైమ్ కుదరలేదు. అప్పట్నుంచీ షూటింగ్స్తోనే బిజీగా వున్న ప్రభాస్కి ఈ లాక్ డౌన్ వల్ల చాలా తీరిక సమయం దొరికింది. అందుకే వివిధ దర్శకులు చెప్పిన కథలు విని తనకు బాగా నచ్చినవి, తన పాన్ ఇండియా ఇమేజ్కి సరితూగుతాయని అనిపించినవీ ప్రభాస్ ఎంచుకున్నాడు.
ఈ క్రమంలో సందీప్ రెడ్డి వంగా, సురేందర్ రెడ్డి తదితరులు చెప్పిన కథలు ప్రభాస్కి నచ్చలేదు. నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ని సింగిల్ సిట్టింగ్లో ఓకే చేసిన ప్రభాస్ ‘ఆదిపురుష్’తో బాలీవుడ్లో స్ట్రెయిట్ సినిమా చేయాలనే లక్ష్యం కూడా చేరుకుంటున్నాడు. ఒకవేళ లాక్ డౌన్ లేనట్టయితే ప్రభాస్ ఈ టైమ్లో రాధేశ్యామ్ షూటింగ్ కోసం యూరప్ పరిసర ప్రాంతాల్లో వుండేవాడు. లాక్ డౌన్ వల్ల చాలా మంది దర్శకులను కలిసి, కథలు ఎంచుకునే సౌలభ్యం చిక్కింది. ఈ లాక్ డౌన్ని ఇంత ఎఫెక్టివ్గా వాడుకున్న మరో హీరో లేడంటే అతిశయెక్తి కాదు.
This post was last modified on August 19, 2020 12:11 am
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…
సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…
అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పుడు కేవలం భూమి, ఆకాశానికే పరిమితం కాకుండా సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థపై కూడా నీలినీడలు…
రోటీన్ కు తగ్గట్లు వ్యవహరిస్తే కిక్ ఏముంటుంది? వినూత్న ఆలోచనలకు వేదికగా హైదరాబాద్ మహానగరం సాగుతోంది. ఇందులో భాగంగా సరికొత్త…
వసూళ్ల లెక్కల్లోనే కాదు చాలా విషయాల్లో దురంధర్ ది రివెంజ్ ఎవరికీ అందని రికార్డులు సొంతం చేసుకుంటోంది. భారతీయ సినీ…