కొన్ని దశాబ్దాల పాటు టాలీవుడ్కు మకుటం లేని మహారాజులా ఉన్నాడు చిరు. ఆయన ఉన్నంత వరకు రికార్డులన్నీ తన పేరు మీదే ఉండేవి. కానీ సినిమాల నుంచి పదేళ్లు బ్రేక్ తీసుకుని.. తిరిగి వచ్చే సమయానికి పరిస్థితులు మారాయి. కొత్త సూపర్ స్టార్లు వచ్చారు. కొత్త రికార్డులు నమోదయ్యాయి. అయినా సరే.. రీఎంట్రీలో ‘ఖైదీ నంబర్ 150’తో నాన్ బాహుబలి రికార్డు నెలకొల్పిన ఘనత చిరుకే సొంతం. మధ్యలో కొన్ని ఎదురు దెబ్బలు తగిలినా.. ఈ ఏడాది సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’తో మళ్లీ తన సత్తాను చూపించాడు.
కానీ ఇప్పుడొచ్చిన ‘భోళా శంకర్’ మెగా అభిమానుల ఉత్సాహంపై నీళ్లు చల్లింది. చిరు కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్ దిశగా అడుగులు వేస్తోంది. ఈ సినిమా అనేక రకాలుగా విమర్శలకు గురైంది. ఇదే అదనుగా చిరు మీద తీవ్ర స్థాయిలో దుష్ప్రచారానికి తెరతీశాయి మీడియాలో, సోషల్ మీడియాలో కొన్ని వర్గాలు. సినిమా ఫలితం ఏమైనా సరే.. తన పారితోషకం తనకు ఇవ్వాల్సిందే అంటూ ‘భోళా శంకర్’ నిర్మాత అనిల్ సుంకరను చిరు ఇబ్బంది పెడుతున్నట్లుగా రెండు రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
చిరు కోసం తన ఫామ్ హౌస్ను కూడా అనిల్ అమ్మేస్తున్నట్లు వార్తలు పుట్టించేశారు. ‘ఆచార్య’ సమయంలోనూ ఇలాంటి ప్రచారాలే జరిగాయి. కానీ ఆ సినిమాకు తనతో పాటు రామ్ చరణ్ పారితోషకం నుంచి మెజారిటీ షేర్ను చిరు వెనక్కి ఇచ్చేసిన విషయం తర్వాతే వెల్లడైంది. ఇక ‘భోళా శంకర్’ విషయంలో చిరు లాంటి అంత దారుణంగా వ్యవహరిస్తాడని ఆయనేంటో తెలిసిన వాళ్లెవ్వరూ ఆలోచించరు. కానీ యాంటీ ఫ్యాన్స్ ఈ ప్రచారాలను ఉద్ధృతం చేస్తున్నారు. వీరికి స్వయంగా నిర్మాత అనిలే చెక్ పెట్టారు. మీడియాలో వస్తున్న న్యూస్ను షేర్ చేసి అనిల్కు ఫార్వార్డ్ చేసిన ఒకతను ఇది నిజమేనా అని అడిగితే.. ఆయన ఇలాంటివి పట్టించుకోవద్దని తేల్చి చెప్పడం విశేషం. అంతే కాక చిరు గొప్ప మనిషి అని.. ఆయనతో తాను మరో సినిమా కూడా చేయబోతున్నానని అనిల్ చెప్పడం గమనార్హం.
This post was last modified on August 14, 2023 11:00 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…