కొన్ని దశాబ్దాల పాటు టాలీవుడ్కు మకుటం లేని మహారాజులా ఉన్నాడు చిరు. ఆయన ఉన్నంత వరకు రికార్డులన్నీ తన పేరు మీదే ఉండేవి. కానీ సినిమాల నుంచి పదేళ్లు బ్రేక్ తీసుకుని.. తిరిగి వచ్చే సమయానికి పరిస్థితులు మారాయి. కొత్త సూపర్ స్టార్లు వచ్చారు. కొత్త రికార్డులు నమోదయ్యాయి. అయినా సరే.. రీఎంట్రీలో ‘ఖైదీ నంబర్ 150’తో నాన్ బాహుబలి రికార్డు నెలకొల్పిన ఘనత చిరుకే సొంతం. మధ్యలో కొన్ని ఎదురు దెబ్బలు తగిలినా.. ఈ ఏడాది సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’తో మళ్లీ తన సత్తాను చూపించాడు.
కానీ ఇప్పుడొచ్చిన ‘భోళా శంకర్’ మెగా అభిమానుల ఉత్సాహంపై నీళ్లు చల్లింది. చిరు కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్ దిశగా అడుగులు వేస్తోంది. ఈ సినిమా అనేక రకాలుగా విమర్శలకు గురైంది. ఇదే అదనుగా చిరు మీద తీవ్ర స్థాయిలో దుష్ప్రచారానికి తెరతీశాయి మీడియాలో, సోషల్ మీడియాలో కొన్ని వర్గాలు. సినిమా ఫలితం ఏమైనా సరే.. తన పారితోషకం తనకు ఇవ్వాల్సిందే అంటూ ‘భోళా శంకర్’ నిర్మాత అనిల్ సుంకరను చిరు ఇబ్బంది పెడుతున్నట్లుగా రెండు రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
చిరు కోసం తన ఫామ్ హౌస్ను కూడా అనిల్ అమ్మేస్తున్నట్లు వార్తలు పుట్టించేశారు. ‘ఆచార్య’ సమయంలోనూ ఇలాంటి ప్రచారాలే జరిగాయి. కానీ ఆ సినిమాకు తనతో పాటు రామ్ చరణ్ పారితోషకం నుంచి మెజారిటీ షేర్ను చిరు వెనక్కి ఇచ్చేసిన విషయం తర్వాతే వెల్లడైంది. ఇక ‘భోళా శంకర్’ విషయంలో చిరు లాంటి అంత దారుణంగా వ్యవహరిస్తాడని ఆయనేంటో తెలిసిన వాళ్లెవ్వరూ ఆలోచించరు. కానీ యాంటీ ఫ్యాన్స్ ఈ ప్రచారాలను ఉద్ధృతం చేస్తున్నారు. వీరికి స్వయంగా నిర్మాత అనిలే చెక్ పెట్టారు. మీడియాలో వస్తున్న న్యూస్ను షేర్ చేసి అనిల్కు ఫార్వార్డ్ చేసిన ఒకతను ఇది నిజమేనా అని అడిగితే.. ఆయన ఇలాంటివి పట్టించుకోవద్దని తేల్చి చెప్పడం విశేషం. అంతే కాక చిరు గొప్ప మనిషి అని.. ఆయనతో తాను మరో సినిమా కూడా చేయబోతున్నానని అనిల్ చెప్పడం గమనార్హం.
This post was last modified on August 14, 2023 11:00 pm
గత ఏడాది సెప్టెంబర్ లో ఆంధ్రకింగ్ తాలూకా రిలీజైనప్పుడు పాజిటివ్ రివ్యూలు వెల్లువెత్తాయి. మౌత్ టాక్ కూడా బాగానే ఉంది.…
వేలంటైన్ప్ డే వీకెండ్లో మంచి అంచనాల మధ్య విడుదలైన చిత్రం.. ఫంకీ. యూత్లో మంచి ఫాలోయింగ్ ఉన్న విశ్వక్సేన్ను హీరీగా…
ఇప్పుడు మధ్య తరగతి వాళ్లు సైతం కోటి.. అంతకంటే ఎక్కువ పెట్టి ఫ్లాట్ కొనే రోజులు వచ్చేశాయి. ధరలు అంతగా…
సంగీత ప్రియులకు పరిచయమే అక్కర్లేని పేరు ఎంఎం కీరవాణి. 1990లో మనసు మమత అనే చిన్న సినిమాతో ప్రయాణం మొదలుపెట్టి…
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…