‘భోళా శంకర్’ సినిమా మెగా అభిమానులకు ఎప్పటికీ మరిచిపోలేని చేదు జ్ఞాపకం అయ్యేలాగే కనిపిస్తోంది. ‘ఆచార్య’ను మించి చిరు కెరీర్లో ఇది బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలవబోతోందన్నది స్పష్టం. ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర్నుంచి మెగా అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతూనే వస్తోంది. అసలే రీమేక్.. పైగా రొటీన్ మాస్ మూవీ.. అందులోనూ మెహర్ రమేష్ డైరెక్షన్ అనేసరికి అప్పట్లోనే బెంబేలెత్తిపోయారు ఫ్యాన్స్. ఈ సినిమా వద్దే వద్దంటూ చిరును సోషల్ మీడియా వేదికగా వేడుకున్నారు. కానీ చిరు అవేవీ పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయారు.
అందుకు ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారు. ఈ దెబ్బతో అయినా చిరు రీమేక్లు మానేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. కానీ చిరు మాత్రం ‘బ్రో డాడీ’ ఆధారంగా కొత్త సినిమాను మొదలుపెట్టబోతున్నారు. ఇది రీమేక్ కాదని ఓ ప్రచారం నడుస్తున్నప్పటికీ అభిమానులు నమ్మట్లేదు. కథను ఎంతగా మార్చినా సరే.. మూలం అయితే ‘బ్రో డాడీ’నే కదా అంటున్నారు. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ట్రాక్ రికార్డు కూడా అంతంతమాత్రం కావడం.. అతడిది ఓల్డ్ స్టైల్ టేకింగ్ కావడంతో ఆ చిత్రం మీదా పెద్దగా అంచనాలు లేవు. దీని తర్వాత చిరు చేయబోయే సినిమా మీదే ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు.
ఆ చిత్రాన్ని రూపొందించబోయేది ‘బింబిసార’ దర్శకుడు వశిష్ట కావడం వారి ఆశలకు కారణం. ఇలాంటి యువతరం దర్శకులతో చిరు పని చేయాలన్నదే అభిమానుల ఆశ. ‘బింబిసార’లో ఫాంటసీ టచ్ ఉన్న కథను వశిష్ఠ డీల్ చేసిన విధానం ప్రశంసలందుకుంది. చిరుతో కూడా అతను ఫాంటసీ సినిమానే చేయబోతున్నాడట. చిరుతో ఈ జానర్ అనగానే అందరికీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమా గుర్తుకు వస్తుంది. పెద్ద కాన్వాస్లో, బడ్జెట్లో ఈ సినిమా తీయడానికి యువి క్రియేషన్స్ ప్లాన్ చేస్తోంది. చిరు స్టామినాను వశిష్ఠ సరిగా వాడుకుని తన పనితనం చూపిస్తే కచ్చితంగా ఒక మెగా బ్లాక్బస్టర్ చూడొచ్చన్న ఆశలతో ఫ్యాన్స్ ఉన్నారు.
This post was last modified on August 14, 2023 10:31 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…