‘భోళా శంకర్’ సినిమా మెగా అభిమానులకు ఎప్పటికీ మరిచిపోలేని చేదు జ్ఞాపకం అయ్యేలాగే కనిపిస్తోంది. ‘ఆచార్య’ను మించి చిరు కెరీర్లో ఇది బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలవబోతోందన్నది స్పష్టం. ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర్నుంచి మెగా అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతూనే వస్తోంది. అసలే రీమేక్.. పైగా రొటీన్ మాస్ మూవీ.. అందులోనూ మెహర్ రమేష్ డైరెక్షన్ అనేసరికి అప్పట్లోనే బెంబేలెత్తిపోయారు ఫ్యాన్స్. ఈ సినిమా వద్దే వద్దంటూ చిరును సోషల్ మీడియా వేదికగా వేడుకున్నారు. కానీ చిరు అవేవీ పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయారు.
అందుకు ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారు. ఈ దెబ్బతో అయినా చిరు రీమేక్లు మానేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. కానీ చిరు మాత్రం ‘బ్రో డాడీ’ ఆధారంగా కొత్త సినిమాను మొదలుపెట్టబోతున్నారు. ఇది రీమేక్ కాదని ఓ ప్రచారం నడుస్తున్నప్పటికీ అభిమానులు నమ్మట్లేదు. కథను ఎంతగా మార్చినా సరే.. మూలం అయితే ‘బ్రో డాడీ’నే కదా అంటున్నారు. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ట్రాక్ రికార్డు కూడా అంతంతమాత్రం కావడం.. అతడిది ఓల్డ్ స్టైల్ టేకింగ్ కావడంతో ఆ చిత్రం మీదా పెద్దగా అంచనాలు లేవు. దీని తర్వాత చిరు చేయబోయే సినిమా మీదే ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు.
ఆ చిత్రాన్ని రూపొందించబోయేది ‘బింబిసార’ దర్శకుడు వశిష్ట కావడం వారి ఆశలకు కారణం. ఇలాంటి యువతరం దర్శకులతో చిరు పని చేయాలన్నదే అభిమానుల ఆశ. ‘బింబిసార’లో ఫాంటసీ టచ్ ఉన్న కథను వశిష్ఠ డీల్ చేసిన విధానం ప్రశంసలందుకుంది. చిరుతో కూడా అతను ఫాంటసీ సినిమానే చేయబోతున్నాడట. చిరుతో ఈ జానర్ అనగానే అందరికీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమా గుర్తుకు వస్తుంది. పెద్ద కాన్వాస్లో, బడ్జెట్లో ఈ సినిమా తీయడానికి యువి క్రియేషన్స్ ప్లాన్ చేస్తోంది. చిరు స్టామినాను వశిష్ఠ సరిగా వాడుకుని తన పనితనం చూపిస్తే కచ్చితంగా ఒక మెగా బ్లాక్బస్టర్ చూడొచ్చన్న ఆశలతో ఫ్యాన్స్ ఉన్నారు.
This post was last modified on August 14, 2023 10:31 pm
దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల ఐదో దశ పోలింగ్ సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభం కానుంది. మొత్తం 6…
లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే తెలంగాణలో ఉన్న 33 జిల్లాలను 17 జిల్లాలకు కుదిస్తారని వస్తున్న వార్తలు…
ఇండస్ట్రీలో సుదీర్ఘ అనుభవంతో ఎన్నో బ్లాక్ బస్టర్లు చూసిన డివివి దానయ్య సగటు మాములు ప్రేక్షకుడికి బాగా దగ్గరయ్యింది మాత్రం…
భారత దేశ చరిత్రలో ఇదోక అనూహ్యమైన.. అసహ్యించుకునే ఘటన. ఈ దేశాన్ని పాలించి, రైతుల మన్ననలు, మహిళల మన్ననలు పొందిన…
ఏపీ సీఎం జగన్.. నీరో చక్రవర్తిని తలపిస్తున్నారంటూ.. సీబీఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ సంచ లన వ్యాఖ్యలు చేశారు.…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో అత్యంత దురదృష్టకరమైన జట్టు పేరు చెప్పమని అడిగితే…ఠపీమని ఆర్సీబీ పేరు చెప్పేస్తారు క్రికెట్…