కోలీవుడ్లో కొన్నేళ్ల నుంచి విజయ్, అజిత్ల మధ్యే బాక్సాఫీస్ రికార్డుల పోటీ నడుస్తోంది. కానీ అంతకుముందంతా రజినీకాంత్ హవానే నడిచింది. విజయ్, అజిత్ ఆయన ముందు అసలు నిలిచేవారే కాదు. వీళ్లిద్దరూ పెద్ద స్టార్లుగా ఎదగడానికి ముందు తమిళంలో సూపర్ స్టార్కు బలమైన పోటీ ఇచ్చింది లోకనాయకుడు కమల్ హాసనే. 80, 90 దశకాల్లో వీరి మధ్య గట్టి పోటీనే ఉండేది. వైవిధ్యమైన సినిమాలతోనే కమల్ రికార్డ్ బ్రేకింగ్ హిట్లు ఇచ్చాడు.
చివరగా ఆయన రజినీకాంత్ను దాటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిందంటే 1996లో వచ్చిన ‘భారతీయుడు’తోనే. అప్పటికి ఉన్న రజినీ సినిమాల బాక్సాఫీస్ రికార్డులన్నీ ఈ చిత్రంతో అధిగమించాడు కమల్. కానీ ఆ రికార్డులు మరీ ఎక్కువ కాలం నిలవలేదు. 1999లో రిలీజైన ‘పడయప్పా’ (నరసింహా) సినిమాతో రజినీ కొత్త రికార్డులు నెలకొల్పాడు. ఆ తర్వాత కమల్కు రజినీ రికార్డులు బద్దలు కొట్టడం చాలా కష్టమైపోయింది.
కమల్ రేంజ్ పడుతూ వస్తే.. చంద్రముఖి, శివాజి, రోబో, 2.0.. ఇలా ఒక్కో సినిమాతో కొత్త రికార్డులు నెలకొల్పుతూ వెళ్లాడు రజినీ. ఐతే చాలా ఏళ్ల పాటు అసలు కలెక్షన్ల చర్చల్లోనే లేకుండా పోయిన కమల్ హాసన్ గత ఏడాది ‘విక్రమ్’ సినిమాతో బలంగా బౌన్స్ బ్యాక్ అయ్యాడు. రజినీ సినిమాల వసూళ్ల రికార్డులను అధిగమించాడు. తమిళనాడు వరకు ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు. ఐతే ఈ రికార్డు కేవలం ఏడాది మాత్రమే నిలిచింది.
ఇప్పుడు రజినీ ‘జైలర్’ మూవీతో వసూళ్ల మోత మోగిస్తున్నాడు. వరల్డ్ వైడ్ ఈ సినిమా ఆల్రెడీ రూ.300 కోట్ల మార్కును దాటేసింది. ఇంకో పది రోజులైనా ఈ సినిమా ఊపు కొనసాగేలా ఉంది. ఆల్రెడీ ‘విక్రమ్’ తమిళనాడు వసూళ్లను ఈ సినిమా దాటేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఫుల్ రన్లో ‘.2.0’ను కూడా అధిగమించి కొత్త రికార్డును రజినీ నెలకొల్పడం ఖాయంగా కనిపిస్తోంది. కమల్ 23 ఏళ్ల తర్వాత రజినీ సినిమాను అధిగమిస్తే.. ఇంకో ఏడాదికే ఆ రికార్డును కొట్టి సూపర్ స్టార్ తనేంటో చూపించాడంటూ ఆయన అభిమానులు ఎలివేషన్లు ఇస్తున్నారు.
This post was last modified on August 14, 2023 6:21 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…