కోలీవుడ్లో కొన్నేళ్ల నుంచి విజయ్, అజిత్ల మధ్యే బాక్సాఫీస్ రికార్డుల పోటీ నడుస్తోంది. కానీ అంతకుముందంతా రజినీకాంత్ హవానే నడిచింది. విజయ్, అజిత్ ఆయన ముందు అసలు నిలిచేవారే కాదు. వీళ్లిద్దరూ పెద్ద స్టార్లుగా ఎదగడానికి ముందు తమిళంలో సూపర్ స్టార్కు బలమైన పోటీ ఇచ్చింది లోకనాయకుడు కమల్ హాసనే. 80, 90 దశకాల్లో వీరి మధ్య గట్టి పోటీనే ఉండేది. వైవిధ్యమైన సినిమాలతోనే కమల్ రికార్డ్ బ్రేకింగ్ హిట్లు ఇచ్చాడు.
చివరగా ఆయన రజినీకాంత్ను దాటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిందంటే 1996లో వచ్చిన ‘భారతీయుడు’తోనే. అప్పటికి ఉన్న రజినీ సినిమాల బాక్సాఫీస్ రికార్డులన్నీ ఈ చిత్రంతో అధిగమించాడు కమల్. కానీ ఆ రికార్డులు మరీ ఎక్కువ కాలం నిలవలేదు. 1999లో రిలీజైన ‘పడయప్పా’ (నరసింహా) సినిమాతో రజినీ కొత్త రికార్డులు నెలకొల్పాడు. ఆ తర్వాత కమల్కు రజినీ రికార్డులు బద్దలు కొట్టడం చాలా కష్టమైపోయింది.
కమల్ రేంజ్ పడుతూ వస్తే.. చంద్రముఖి, శివాజి, రోబో, 2.0.. ఇలా ఒక్కో సినిమాతో కొత్త రికార్డులు నెలకొల్పుతూ వెళ్లాడు రజినీ. ఐతే చాలా ఏళ్ల పాటు అసలు కలెక్షన్ల చర్చల్లోనే లేకుండా పోయిన కమల్ హాసన్ గత ఏడాది ‘విక్రమ్’ సినిమాతో బలంగా బౌన్స్ బ్యాక్ అయ్యాడు. రజినీ సినిమాల వసూళ్ల రికార్డులను అధిగమించాడు. తమిళనాడు వరకు ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు. ఐతే ఈ రికార్డు కేవలం ఏడాది మాత్రమే నిలిచింది.
ఇప్పుడు రజినీ ‘జైలర్’ మూవీతో వసూళ్ల మోత మోగిస్తున్నాడు. వరల్డ్ వైడ్ ఈ సినిమా ఆల్రెడీ రూ.300 కోట్ల మార్కును దాటేసింది. ఇంకో పది రోజులైనా ఈ సినిమా ఊపు కొనసాగేలా ఉంది. ఆల్రెడీ ‘విక్రమ్’ తమిళనాడు వసూళ్లను ఈ సినిమా దాటేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఫుల్ రన్లో ‘.2.0’ను కూడా అధిగమించి కొత్త రికార్డును రజినీ నెలకొల్పడం ఖాయంగా కనిపిస్తోంది. కమల్ 23 ఏళ్ల తర్వాత రజినీ సినిమాను అధిగమిస్తే.. ఇంకో ఏడాదికే ఆ రికార్డును కొట్టి సూపర్ స్టార్ తనేంటో చూపించాడంటూ ఆయన అభిమానులు ఎలివేషన్లు ఇస్తున్నారు.
This post was last modified on August 14, 2023 6:21 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…