మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్లోనే అతి పెద్ద బాక్సాఫీస్ పరాభవాన్ని ఎదుర్కొంటున్నారు ‘భోళా శంకర్’ రూపంలో. ‘ఆచార్య’నే చిరు కెరీర్లో ‘లో’ అనుకుంటే.. ఇది అంతకుమించిన పతనాన్ని చూపిస్తోంది. ఫుల్ రన్లో పాతిక కోట్ల షేర్ కూడా కష్టమవుతోందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వీకెండ్లోనే నిలబడలేకపోయిన ఈ సినిమా.. ఆ తర్వాత ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుందో అందరికీ అర్థమైపోయింది. ఇక సినిమా మీద ఆశలు పెట్టుకోవడానికి ఏమీ లేదు.
‘ఆచార్య’ తర్వాత సెటిల్మెంట్ సమస్యలతో ఇబ్బంది పడ్డట్లే ‘భోళా శంకర్’ తర్వాత కూడా చిరు అండ్ కోకు తలనొప్పులు తప్పేలా లేవు. ఐతే ఈ విషయాలను చిరు ఎలా డీల్ చేస్తాడో ఏమో కానీ.. తన కొత్త సినిమా షూటింగ్ను మాత్రం సాధ్యమైనంత త్వరగా మొదలుపెట్టేస్తాడని ఇంతకుముందు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ వార్తలు నిజం కాకపోవచ్చని అంటున్నారు.
కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో తన కూతురు సుశ్మిత నిర్మించే కొత్త చిత్రాన్ని చిరు ఈ నెలలోనే మొదలుపెడతాడని అనుకున్నారు. త్వరగా ఈ చిత్రాన్ని పూర్తి చేసి 2024 సంక్రాంతి రేసులో నిలబడతారని కూడా ఇంతకుముందు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు చిరు ఆలోచన మారిందట. కొంత కాలంగా తనను ఇబ్బంది పెడుతున్న మోకాలి నొప్పికి శస్త్ర చికిత్స చేయించుకోవాలని చిరు ఫిక్సయ్యారట.
ఢిల్లీ లేదా బెంగళూరులో సర్జరీ చేయించుకోవాలని చూస్తున్నారట. అది గనుక జరిగితే చిరు నెలా రెండు నెలలు షూటింగ్లో పాల్గొనరు. పూర్తిగా విశ్రాంతికే పరిమితం అవుతారు. అంటే కళ్యాణ్ కృష్ణ సినిమా మొదలవడంలో ఆలస్యం తప్పదు. అంటే సంక్రాంతికి ఆ సినిమా లేనట్లే. వేసవిని టార్గెట్ చేయొచ్చు. చిరుకు ఇప్పుడీ విరామం చాలా అవసరమని.. ‘భోళా శంకర్’ రిజల్ట్ తర్వాత సినిమాల ఎంపికలో చిరు పునరాలోచనకు ఇది ఉపయోగపడుతుందని అభిమానులు అంటున్నారు.
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…