మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్లోనే అతి పెద్ద బాక్సాఫీస్ పరాభవాన్ని ఎదుర్కొంటున్నారు ‘భోళా శంకర్’ రూపంలో. ‘ఆచార్య’నే చిరు కెరీర్లో ‘లో’ అనుకుంటే.. ఇది అంతకుమించిన పతనాన్ని చూపిస్తోంది. ఫుల్ రన్లో పాతిక కోట్ల షేర్ కూడా కష్టమవుతోందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వీకెండ్లోనే నిలబడలేకపోయిన ఈ సినిమా.. ఆ తర్వాత ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుందో అందరికీ అర్థమైపోయింది. ఇక సినిమా మీద ఆశలు పెట్టుకోవడానికి ఏమీ లేదు.
‘ఆచార్య’ తర్వాత సెటిల్మెంట్ సమస్యలతో ఇబ్బంది పడ్డట్లే ‘భోళా శంకర్’ తర్వాత కూడా చిరు అండ్ కోకు తలనొప్పులు తప్పేలా లేవు. ఐతే ఈ విషయాలను చిరు ఎలా డీల్ చేస్తాడో ఏమో కానీ.. తన కొత్త సినిమా షూటింగ్ను మాత్రం సాధ్యమైనంత త్వరగా మొదలుపెట్టేస్తాడని ఇంతకుముందు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ వార్తలు నిజం కాకపోవచ్చని అంటున్నారు.
కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో తన కూతురు సుశ్మిత నిర్మించే కొత్త చిత్రాన్ని చిరు ఈ నెలలోనే మొదలుపెడతాడని అనుకున్నారు. త్వరగా ఈ చిత్రాన్ని పూర్తి చేసి 2024 సంక్రాంతి రేసులో నిలబడతారని కూడా ఇంతకుముందు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు చిరు ఆలోచన మారిందట. కొంత కాలంగా తనను ఇబ్బంది పెడుతున్న మోకాలి నొప్పికి శస్త్ర చికిత్స చేయించుకోవాలని చిరు ఫిక్సయ్యారట.
ఢిల్లీ లేదా బెంగళూరులో సర్జరీ చేయించుకోవాలని చూస్తున్నారట. అది గనుక జరిగితే చిరు నెలా రెండు నెలలు షూటింగ్లో పాల్గొనరు. పూర్తిగా విశ్రాంతికే పరిమితం అవుతారు. అంటే కళ్యాణ్ కృష్ణ సినిమా మొదలవడంలో ఆలస్యం తప్పదు. అంటే సంక్రాంతికి ఆ సినిమా లేనట్లే. వేసవిని టార్గెట్ చేయొచ్చు. చిరుకు ఇప్పుడీ విరామం చాలా అవసరమని.. ‘భోళా శంకర్’ రిజల్ట్ తర్వాత సినిమాల ఎంపికలో చిరు పునరాలోచనకు ఇది ఉపయోగపడుతుందని అభిమానులు అంటున్నారు.
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…