రీ రిలీజుల ట్రెండ్ లో సీనియర్ జూనియర్ హీరోల్లో దాదాపు అందరివీ ఒకటో రెండో పాత సినిమాలు థియేటర్లకు వచ్చేసి కాసులు కురిపించేశాయి. మహేష్ బాబువి ఏకంగా మూడు హంగామా చేశాయి. ఇక బ్యాలన్స్ ఉన్నది నాగార్జున, వెంకటేష్ లే. ఈ నెల 29న కింగ్ పుట్టినరోజుని పురస్కరించుకుని మన్మథుడుని మళ్ళీ విడుదల చేయబోతున్నారని సమాచారం. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై రూపొందిన ఈ కల్ట్ ఎంటర్ టైనర్ కి విజయభాస్కర్ దర్శకత్వం వహించగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన మాటలు, దేవిశ్రీ ప్రసాద్ పాటలు ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయాయి.
వాస్తవానికి దీనికన్నా ముందు నాగ్ ఎవర్ గ్రీన్ క్లాసిక్ శివని పెద్ద తెరపై చూసుకోవాలని మూవీ లవర్స్ కోరిక. కొన్నేళ్ల క్రితం దీని పాతికేళ్ల యానివర్సరీ సందర్భంగా రీ మాస్టర్ చేయిస్తున్నామని చెప్పారు కానీ తర్వాత ఎలాంటి ఊసు లేదు. ట్విస్టు ఏంటంటే శివ ఒరిజినల్ నెగటివ్ అందుబాటులో లేదట. కొన్ని భాగాలు డ్యామేజ్ కావడంతో వాటిని సరిద్దిదడానికి ఎక్కువ సమయం అవసరం ఉండటంతో లేట్ అవుతోందని తెలిసింది. అందుకే శివ స్థానంలో మన్మథుడుకి అంగీకారం తెలిపినట్టు ఇన్ సైడ్ టాక్. ఇంకా అఫీషియల్ ప్రకటన రాలేదు కానీ త్వరలో వెలువడవచ్చు.
టాలీవుడ్ కున్న పెద్ద సమస్య ఒకప్పటి బ్లాక్ బస్టర్ల మాస్టర్ ప్రింట్లు సరిగా అందుబాటులో లేకపోవడం. హాలీవుడ్ తరహాలో ఎప్పటికప్పుడు టెక్నాలజీని వాడుకుంటూ వాటిని కాపాడే ప్రయత్నం పెద్దగా జరగలేదు. మగధీరనే ఒరిజినల్ ఫుటేజ్ దొరకడం లేదని రాజమౌళి ఓ ఈవెంట్ లో చెప్పిన వీడియో యూట్యూబ్ లో చూడొచ్చు. దీనికే ఇలా ఉంటే ఇక శివ, ఖైదీ, మంగమ్మగారి మనవడు లాంటివి ఇంకెంత క్షేమంగా భద్రపరిచి ఉండాలి. ఇంకో యాభై సంవత్సరాల తర్వాతైనా సరే కొత్త తరాలు గొప్పగా అనుభూతి చెందేలా అన్నిటిని ఫోర్ కెతో అప్డేట్ చేయించే ఆవశ్యకతని అర్జెంట్ గా గుర్తించాలి.
This post was last modified on August 14, 2023 12:05 am
సరిగ్గా వారం రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేస్తాడు. థియేటర్ యజమానులు ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నారు. కేవలం…
ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…