రీ రిలీజుల ట్రెండ్ లో సీనియర్ జూనియర్ హీరోల్లో దాదాపు అందరివీ ఒకటో రెండో పాత సినిమాలు థియేటర్లకు వచ్చేసి కాసులు కురిపించేశాయి. మహేష్ బాబువి ఏకంగా మూడు హంగామా చేశాయి. ఇక బ్యాలన్స్ ఉన్నది నాగార్జున, వెంకటేష్ లే. ఈ నెల 29న కింగ్ పుట్టినరోజుని పురస్కరించుకుని మన్మథుడుని మళ్ళీ విడుదల చేయబోతున్నారని సమాచారం. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై రూపొందిన ఈ కల్ట్ ఎంటర్ టైనర్ కి విజయభాస్కర్ దర్శకత్వం వహించగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన మాటలు, దేవిశ్రీ ప్రసాద్ పాటలు ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయాయి.
వాస్తవానికి దీనికన్నా ముందు నాగ్ ఎవర్ గ్రీన్ క్లాసిక్ శివని పెద్ద తెరపై చూసుకోవాలని మూవీ లవర్స్ కోరిక. కొన్నేళ్ల క్రితం దీని పాతికేళ్ల యానివర్సరీ సందర్భంగా రీ మాస్టర్ చేయిస్తున్నామని చెప్పారు కానీ తర్వాత ఎలాంటి ఊసు లేదు. ట్విస్టు ఏంటంటే శివ ఒరిజినల్ నెగటివ్ అందుబాటులో లేదట. కొన్ని భాగాలు డ్యామేజ్ కావడంతో వాటిని సరిద్దిదడానికి ఎక్కువ సమయం అవసరం ఉండటంతో లేట్ అవుతోందని తెలిసింది. అందుకే శివ స్థానంలో మన్మథుడుకి అంగీకారం తెలిపినట్టు ఇన్ సైడ్ టాక్. ఇంకా అఫీషియల్ ప్రకటన రాలేదు కానీ త్వరలో వెలువడవచ్చు.
టాలీవుడ్ కున్న పెద్ద సమస్య ఒకప్పటి బ్లాక్ బస్టర్ల మాస్టర్ ప్రింట్లు సరిగా అందుబాటులో లేకపోవడం. హాలీవుడ్ తరహాలో ఎప్పటికప్పుడు టెక్నాలజీని వాడుకుంటూ వాటిని కాపాడే ప్రయత్నం పెద్దగా జరగలేదు. మగధీరనే ఒరిజినల్ ఫుటేజ్ దొరకడం లేదని రాజమౌళి ఓ ఈవెంట్ లో చెప్పిన వీడియో యూట్యూబ్ లో చూడొచ్చు. దీనికే ఇలా ఉంటే ఇక శివ, ఖైదీ, మంగమ్మగారి మనవడు లాంటివి ఇంకెంత క్షేమంగా భద్రపరిచి ఉండాలి. ఇంకో యాభై సంవత్సరాల తర్వాతైనా సరే కొత్త తరాలు గొప్పగా అనుభూతి చెందేలా అన్నిటిని ఫోర్ కెతో అప్డేట్ చేయించే ఆవశ్యకతని అర్జెంట్ గా గుర్తించాలి.
This post was last modified on August 14, 2023 12:05 am
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…