రీ రిలీజుల ట్రెండ్ లో సీనియర్ జూనియర్ హీరోల్లో దాదాపు అందరివీ ఒకటో రెండో పాత సినిమాలు థియేటర్లకు వచ్చేసి కాసులు కురిపించేశాయి. మహేష్ బాబువి ఏకంగా మూడు హంగామా చేశాయి. ఇక బ్యాలన్స్ ఉన్నది నాగార్జున, వెంకటేష్ లే. ఈ నెల 29న కింగ్ పుట్టినరోజుని పురస్కరించుకుని మన్మథుడుని మళ్ళీ విడుదల చేయబోతున్నారని సమాచారం. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై రూపొందిన ఈ కల్ట్ ఎంటర్ టైనర్ కి విజయభాస్కర్ దర్శకత్వం వహించగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన మాటలు, దేవిశ్రీ ప్రసాద్ పాటలు ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయాయి.
వాస్తవానికి దీనికన్నా ముందు నాగ్ ఎవర్ గ్రీన్ క్లాసిక్ శివని పెద్ద తెరపై చూసుకోవాలని మూవీ లవర్స్ కోరిక. కొన్నేళ్ల క్రితం దీని పాతికేళ్ల యానివర్సరీ సందర్భంగా రీ మాస్టర్ చేయిస్తున్నామని చెప్పారు కానీ తర్వాత ఎలాంటి ఊసు లేదు. ట్విస్టు ఏంటంటే శివ ఒరిజినల్ నెగటివ్ అందుబాటులో లేదట. కొన్ని భాగాలు డ్యామేజ్ కావడంతో వాటిని సరిద్దిదడానికి ఎక్కువ సమయం అవసరం ఉండటంతో లేట్ అవుతోందని తెలిసింది. అందుకే శివ స్థానంలో మన్మథుడుకి అంగీకారం తెలిపినట్టు ఇన్ సైడ్ టాక్. ఇంకా అఫీషియల్ ప్రకటన రాలేదు కానీ త్వరలో వెలువడవచ్చు.
టాలీవుడ్ కున్న పెద్ద సమస్య ఒకప్పటి బ్లాక్ బస్టర్ల మాస్టర్ ప్రింట్లు సరిగా అందుబాటులో లేకపోవడం. హాలీవుడ్ తరహాలో ఎప్పటికప్పుడు టెక్నాలజీని వాడుకుంటూ వాటిని కాపాడే ప్రయత్నం పెద్దగా జరగలేదు. మగధీరనే ఒరిజినల్ ఫుటేజ్ దొరకడం లేదని రాజమౌళి ఓ ఈవెంట్ లో చెప్పిన వీడియో యూట్యూబ్ లో చూడొచ్చు. దీనికే ఇలా ఉంటే ఇక శివ, ఖైదీ, మంగమ్మగారి మనవడు లాంటివి ఇంకెంత క్షేమంగా భద్రపరిచి ఉండాలి. ఇంకో యాభై సంవత్సరాల తర్వాతైనా సరే కొత్త తరాలు గొప్పగా అనుభూతి చెందేలా అన్నిటిని ఫోర్ కెతో అప్డేట్ చేయించే ఆవశ్యకతని అర్జెంట్ గా గుర్తించాలి.
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా సినిమా మేజర్ షెడ్యూల్ ఈ జూన్ మధ్యలో ప్రారంభం కాబోతున్నట్లు…
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…
వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…