పాపం టాలెంట్, బడా బ్యానర్ల అండదండలు, ఇమేజ్ ఉన్న దర్శకులతో సినిమాలు చేస్తున్నా సరే సంతోష్ శోభన్ కు హిట్టు అందని ద్రాక్షే అయ్యింది. వైజయంతి లాంటి పెద్ద సంస్థతో అన్నీ మంచి శకునములే చేస్తే అది కూడా డిజాస్టర్ కావడంతో ఈ కుర్ర హీరోకు ఏం పాలు పోవడం లేదు. అంతకు ముందు శ్రీదేవి శోభన్ బాబు, కళ్యాణం కమనీయం, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, మంచి రోజులు వచ్చాయి అన్నీ ఒకదాన్ని మించి మరొకటి దెబ్బ కొట్టిన కళాఖండాలు. ఓటిటిలో డైరెక్ట్ గా వచ్చిన ఏక్ మినీ కథ తప్ప మరో చెప్పుకునే విజయం ఇప్పటిదాకా జమ కాలేదు.
ఇలాంటి ట్రాక్ రికార్డు ఉన్నప్పటికీ సంతోష్ శోభన్ కు అవకాశాల లోటు లేదు. నిర్మాతలు వస్తూనే ఉన్నారు. రాబోయే శుక్రవారం ఆగస్ట్ 18 ప్రేమ్ కుమార్ విడుదల కానుంది. రాశి సింగ్ హీరోయిన్. ప్రమోషన్లు గట్రా బాగానే చేస్తున్నారు. కంటెంట్ కూడా ఇంటరెస్టింగ్ గానే ఉంది. డేట్ పరంగా ఇదొక మంచి ఛాన్స్ అని చెప్పాలి. ఎందుకంటే ఆ రోజు చెప్పుకోదగ్గ కొత్త సినిమాలు లేవు. సుహైల్ మిస్టర్ ప్రెగ్నెంట్ ని జనాలు సీరియస్ గా తీసుకునేలా కనిపించడం లేదు. సో ప్రేమ్ కుమార్ ఓ మోస్తరుగా పర్వాలేదు అనిపించుకున్నా చాలు దానికి పెట్టిన బడ్జెట్ కి ఈజీగా గట్టెకేస్తాడు.
ఆ టైంకల్లా భోళా శంకర్ దాదాపుగా వాషౌట్ అయిపోతుంది. జైలర్ దూకుడు కొంతయినా తగ్గుతుంది. గదర్ 2, ఓ మై గాడ్ 2లను తెలుగు ఆడియన్స్ మరీ గొప్పగా రిసీవ్ చేసుకోలేదు కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ ని తనవైపుకు తిప్పుకుంటే ప్రేమ్ కుమార్ కి ప్రయోజనం ఉంటుంది. ఆపై వారం దుల్కర్ సల్మాన్, వరుణ్ తేజ్, కార్తికేయలు వచ్చేస్తారు కాబట్టి వారం రోజుల్లోనే వీలైనంత రాబట్టుకోవాలి. తర్వాత థియేటర్లు తగ్గిపోతాయి. అభిషేక్ మహర్షి దర్శకత్వం వహించిన ఈ కామెడీ ఎంటర్ టైనర్ ఏదైనా బ్రేక్ ఇస్తేనే సంతోష్ శోభన్ కెరీర్ లో కాస్త జోష్ వస్తుంది. పబ్లిసిటీ కూడా పెంచాల్సిందే.
This post was last modified on August 13, 2023 2:52 pm
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…