ప్రస్తుతం టాలీవుడ్లో డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి దయనీయంగా ఉంది. పెద్ద సినిమాల్లో పెట్టుబడి వెనక్కి తెస్తున్న సినిమాల శాతం చాలా తక్కువగా ఉంటోంది. మంచి టాక్ తెచ్చుకుని ‘బ్లాక్బస్టర్’ అనిపించుకున్న సినిమాల నుంచి కూడా లాభాలు తక్కువగానే ఉంటున్నాయి. కానీ సినిమా తేడా కొడితే వచ్చే నష్టాలు మాత్రం భారీగా ఉంటున్నాయి. నష్టపరిహారాల తాలూకు సెటిల్మెంట్ కేసులు క్రమంగా పెరిగిపోతున్నాయి. నెమ్మదిగా డిస్ట్రిబ్యూటర్లు ఒక్కొక్కరుగా కాడి వదిలేస్తున్న పరిస్థితి.
ఇలాంటి పరిస్థితుల్లో కూడా అగ్ర నిర్మాత దిల్ రాజు మాత్రం డిస్ట్రిబ్యూషన్లో మంచి సక్సెస్ రేట్తో సాగుతున్నారు. ఏ సినిమాను కొనాలి.. ఎంతకు కొనాలి అనే విషయంలో రాజుకు ఉన్న జడ్జిమెంట్ టాలీవుడ్లో ఇంకెవరికీ లేదు అంటే అతిశయోక్తి కాదు. తాజాగా ఇండిపెండెన్స్ డే వీకెండ్లో మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘భోళా శంకర్’, సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ ‘జైలర్’ రిలీజైతే.. ఆయన డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నది ‘జైలర్’ మూవీకే.
మామూలుగా అయితే చిరు, రజినీ పోటీలో ఉంటే దిల్ రాజు లాంటి డిస్ట్రిబ్యూటర్ చిరు వైపే ఉండాలి. అందులోనూ ‘వాల్తేరు వీరయ్య’ లాంటి బ్లాక్బస్టర్ తర్వాత చిరు సినిమా అంటే దాని హక్కుల కోసమే ఎగబడాలి. కానీ ‘భోళా శంకర్’ మీద దిల్ రాజుకు సరైన అంచనానే ఉన్నట్లుంది. అందుకే దాని జోలికి వెళ్లలేదు. అదే సమయంలో రజినీకాంత్ చివరి సినిమాలు దారుణమైన ఫలితాలు అందుకున్నా సరే.. ఆయన సునీల్ నారంగ్తో కలిసి ‘జైలర్’ రైట్స్ తీసుకున్నారు. రజినీ మార్కెట్ దెబ్బ తినడం వల్ల తక్కువ మొత్తానికే హక్కులు దక్కాయి.
‘జైలర్’ రిలీజ్ ముంగిట ఊహించని విధంగా మంచి హైప్ తెచ్చుకుంది. టాక్ యావరేజ్గా ఉన్నా సరే.. భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. ‘భోళా శంకర్’ తేడా కొట్టడంతో ‘జైలర్’ వసూళ్లు ఇంకా పెరిగిపోయాయి. రజినీ ఒకప్పటి వైభవాన్ని గుర్తు చేస్తూ ఈ సినిమా వీకెండ్లో వసూళ్ల మోత మోగించేసింది. ఇండిపెండెన్స్ డే వరకు ‘జైలర్’ దూకుడు కొనసాగబోతోంది. దిల్ రాజు పెట్టుబడి మీద మూడు రెట్ల ఆదాయం వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయంటే ఆయన జాక్పాట్ కొట్టినట్లే చెప్పాలి.
This post was last modified on August 13, 2023 12:54 pm
సినీ జనాలు తమ కెరీర్లో ఏదైనా పెద్ద డిజాస్టర్ ఎదురైనపుడు.. దాని గురించి తర్వాతి రోజుల్లో మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడరు.…
పార్లమెంటు శీతాకాల సమావేశాలు శుక్రవారం(రేపు)తో ముగియనున్నాయి. ఈ సమావేశాల్లో చివరి రెండో రోజైన గురువారం రాజకీయ వేడి లోక్సభను కుదిపేసింది.…
రెండేళ్లు సిల్వర్ స్క్రీన్ గ్యాప్ తీసుకున్న అడవి శేష్ ఈసారి డెకాయిట్ గా రాబోతున్నాడు. టీజర్ ప్రామిసింగ్ గా అనిపించింది.…
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గన్నవరం టీడీపీ ఆఫీసుపై…
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటే వేరే వాళ్ల భాగస్వామ్యంలో లో బడ్జెట్ సినిమాలు తీసే నిర్మాణ సంస్థ. కానీ గత కొన్నేళ్లలో…
పై అధికారులకు ఆ కలెక్టర్ ఎందుకో నచ్చలేదు.. నీ మీద ఇటువంటి అభిప్రాయం ఉందని స్వయంగా సీఎం ఆ కలెక్టర్…