బావ బావమరుదులుగా చిరంజీవి, అల్లు అరవింద్ ల మధ్య ఉన్న బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇటీవలే జరిగిన భోళా శంకర్ ఈవెంట్ లో అరవింద్ మాట్లాడుతూ బ్లడ్ బ్యాంక్ మీద అనవసర ఆరోపణలు చేసిన వాళ్లకు పదిహేను సంవత్సరాల పాటు పోరాడి శిక్ష వేయించే దాకా వదల్లేదని చిరు అంటే తనకంత అభిమానమని పబ్లిక్ గా చెప్పేశారు. అయితే ఈ ఇద్దరూ కలిసి గీతా ఆర్ట్స్ కోసం సినిమా చేసి ఏళ్ళు గడిచిపోయాయి. 2005లో వచ్చిన అందరివాడు ఆఖరిది. ఆ తర్వాత కొంత కాలానికే మెగాస్టార్ రాజకీయాల్లోకి వెళ్లిపోవడం, అరవింద్ సైతం ప్రజారాజ్యం వెంటే ఉండటం గడిచిన చరిత్ర.
చిరు కంబ్యాక్ జరిగాక ఆయనకు సంబంధించిన ప్రొడక్షన్ వ్యవహారాలన్నీ రామ్ చరణ్ చేతికి వెళ్లిపోయాయి. కొణిదెల బ్యానర్ ని స్థాపించి ఖైదీ నెంబర్ 150, సైరాలు నిర్మించి ఆచార్యకు భాగస్వామిగా ఉన్నాడు. కానీ తన ప్యాన్ ఇండియా సినిమాలకే ఇప్పుడు టైం లేకపోవడంతో క్రమంగా తండ్రి బయటి సంస్థలకు ఓకే చెబుతున్నా కెరీర్ ని దృష్టిలో పెట్టుకుని సైడ్ అయ్యాడు. ఈ మొత్తం సీన్ లో అరవింద్ ఎక్కడా లేరు. 18 ఏళ్ళ గ్యాప్ వచ్చేసింది. ఇంత సుదీర్ఘమైన సమయంలో ఎన్నోసార్లు కలుసుకున్నారు కానీ కలిసి ఏదైనా మూవీ చేసే దిశగా మాత్రం సంకేతాలు ఇవ్వలేదు.
ఇప్పుడు అల్లు అరవింద్ అనుభవం అవసరమవుతోందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. కథలను జడ్జ్ చేయడంలో, చిరుకు ఎలాంటివి సూటవుతాయో పసిగట్టడంలో ఆయనది తిరుగు లేని చేయి. పసివాడి ప్రాణం, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, మాస్టర్ ఇలా ఎన్నో సినిమాలు ఋజువు చేశాయి. గీతా ఆర్ట్స్ 2 పేరుతో బన్నీ వాస్ పార్ట్ నర్ షిప్ లో మరో సంస్థని ఏర్పాటు చేసి చిన్న సినిమాలతో బిజీగా ఉన్న అరవింద్ త్వరలో చిరుతో జట్టు కట్టడం అనుమానమే. ఎందుకంటే మెగాస్టార్ కొత్తగా ఒప్పుకున్న మూడు సినిమాలు అన్నీ ఇతర ప్రొడ్యూసర్లతోనే. మరి గీతతో ఎప్పుడు సాధ్యమయ్యేనో.
This post was last modified on August 12, 2023 7:30 pm
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…