పెద్ద మాస్ ఇమేజ్ ఉన్న హీరోలకు సినిమాలు, పాత్రల ఎంపికలో కొన్ని పరిమితులు ఉంటాయి. ప్రతిదీ అభిమానులను దృష్టిలో ఉంచుకునే చేయాల్సి ఉంటుంది. కొంచెం కొత్తగా ట్రై చేయాలంటే అభిమానులు అంగీకరిస్తారో లేదో అన్న భయం వెంటాడుతుంది. అందుకే ఇమేజ్ ఛట్రంలో ఇరుక్కుపోయి ఇబ్బంది పడుతుంటారు. వయసు పెరుగుతున్నా యువకుల పాత్రలే వేస్తుంటారు.
మహా అయితే ఒక బిడ్డకు తండ్రిగా నడి వయస్కుల పాత్రలు వేస్తారే తప్ప.. తాతల క్యారెక్టర్లు వేయాలంటే మాత్రం వెనుకంజ వేస్తుంటారు. డబుల్ రోల్ చేసినపుడు తండ్రి పాత్ర కోసం తెల్లజుట్లు కనిపిస్తారే తప్ప.. మాస్ హీరోలు ఫుల్ లెంగ్త్లో ముసలి పాత్రలు చేయడం అరుదు. కానీ ఈ మధ్య ట్రెండు మారుతోంది. తమిళంలో ఇద్దరు సీనియర్ హీరోలు ధైర్యం చేసి తాత పాత్రల్లో కనిపించి అభిమానులను మెప్పించారు. ఒప్పించారు. వాళ్లే.. సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్.
కమల్ హాసన్ గత ఏడాది ‘విక్రమ్’ సినిమాలో చేసింది తాత పాత్రే. సినిమాలో పూర్తిగా ఆయన ఆ పాత్రలోనే కనిపించారు. ఆయనకు అందులో కొడుకు, మనవడు కూడా ఉన్నాడు. సరిగ్గా ఇంత వయసు అని చెప్పలేదు కానీ.. 60 ఏళ్లు పైబడ్డట్లుగా అంచనా వేయొచ్చు. ఆ వయసు పాత్ర అయినా.. అందులో హీరోయిజం ఒక రేంజిలో పండింది. ఎక్కడా అభిమానులకు ఇబ్బందిగా అనిపించలేదు. ఇక లేటేస్ట్గా సూపర్ స్టార్ రజినీకాంత్ తాత పాత్రలో కనిపించి మెప్పించారు. ‘జైలర్’లో ఆయనకు కొడుకు.. మనవడు ఉన్నారు. ఆ మనవడు కూడా ఏడెనిమిదేళ్ల వయసున్నట్లు కనిపిస్తాడు.
రజినీ ఇందులో రిటైర్డ్ జైలర్ పాత్రలో కనిపించారు. కమల్తో పోలిస్తే రజినీకి మాస్ ఇమేజ్ ఎక్కువ. అభిమానుల నుంచి చాలా ఆబ్లిగేషన్స్ ఉంటాయి. కానీ అవేవీ పట్టించుకోకుండా ఆయన తాత పాత్రలో ఒదిగిపోయారు. అభిమానులనూ మెప్పించారు. ఇంతకుముందు కబాలి, కాలా, పేట సినిమాల్లో సైతం రజినీ పెద్ద వయస్కుడిగా కనిపించడం విశేషం. మన సీనియర్ హీరోలు కూడా ఇలా పరిమితులు పెట్టుకోకుండా వయసుకు తగ్గ పాత్రల్లో కనిపిస్తే అభిమానులు అంగీకరిస్తారనడంలో సందేహం లేదు.
This post was last modified on August 11, 2023 7:35 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…