Movie News

డిజాస్టర్ డైరెక్టర్‌పై ఎంత నమ్మకమో..

మెగా ఫ్యామిలీని.. ఆ ఫ్యామిలీ హీరోల అభిమానులను ఒక కలవరపాటుకు గురి చేసి చాలా ఏళ్ల పాటు వెంటాడిన సినిమా ‘ఆరెంజ్’. ‘మగధీర’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రామ్ చరణ్‌ నుంచి వచ్చిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి అప్పట్లో. ఆడియో బ్లాక్ బస్టర్ కావడంతో సినిమా గురించి ఏదో ఊహించుకున్నారు ఫ్యాన్స్.

కానీ వారి అంచనాలకు భిన్నంగా క్లాస్‌గా, స్లోగా, బోరింగ్‌గా సాగడంతో సినిమా మెజారిటీ జనాలకు రుచించలేదు. ఫ్యాన్స్‌కు అయితే అదొక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. చరణ్‌ కెరీర్‌కు పెద్ద స్పీడ్ బ్రేకర్ అయిందీ సినిమా. ఈ చిత్రం వల్లే నాగబాబు తీవ్రంగా నష్టపోయి.. ఒక దశలో ఆత్మహత్య ఆలోచన కూడా చేసినట్లు స్వయంగా వెల్లడించాడు. మరి ఇలాంటి ఫలితాన్నందుకున్న సినిమా దర్శకుడి పరిస్థితి ఏంటో అంచనా వేయడం కష్టం కాదు.

‘ఆరెంజ్’ దెబ్బకు బొమ్మరిల్లు భాస్కర్ కెరీర్ మసకబారి.. చాలా ఏళ్లు కనిపించకుండా పోయాడు. దీని తర్వాత పదేళ్ల వ్యవధిలో అతను తీసింది ఒక్క ‘ఒంగోలు గిత్త’ మాత్రమే. ఆ సినిమా తర్వాత అంతర్ధానం అయిపోయిన భాస్కర్‌ను పిలిచి సినిమా చేయించింది అల్లు అరవింద్. మెగా ఫ్యామిలీకి, అభిమానులకు అంతటి చేదు అనుభవాన్ని మిగిల్చిన దర్శకుడిపై నమ్మకం పెట్టి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చేయించారు. అది ఓ మోస్తరు ఫలితాన్నే అందుకుంది.

అయినా భాస్కర్‌ మీద అరవింద్ నమ్మకం సడలిపోలేదు. తిరిగి గీతా ఆర్ట్స్ బేనర్లో ఇంకో ఛాన్స్ ఇచ్చారు. కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లే ఈ చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా కన్ఫమ్ అయ్యాడు. గురువారమే ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంది. ఈసారి కొంచెం కమర్షియల్ టచ్ ఉన్న సినిమా చేయబోతున్నాడట భాస్కర్. సిద్ధు లాంటి ఫామ్‌లో ఉన్న హీరో దొరకడం భాస్కర్‌కు కలిసొచ్చే అంశం. మరి భాస్కర్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఏమేర నెరవేరుస్తాడో చూడాలి. 

This post was last modified on August 10, 2023 10:19 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

42 minutes ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

1 hour ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

2 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

2 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

2 hours ago

రాంబాబు రావడమే ఆలస్యం

మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…

3 hours ago