మెగా ఫ్యామిలీని.. ఆ ఫ్యామిలీ హీరోల అభిమానులను ఒక కలవరపాటుకు గురి చేసి చాలా ఏళ్ల పాటు వెంటాడిన సినిమా ‘ఆరెంజ్’. ‘మగధీర’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రామ్ చరణ్ నుంచి వచ్చిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి అప్పట్లో. ఆడియో బ్లాక్ బస్టర్ కావడంతో సినిమా గురించి ఏదో ఊహించుకున్నారు ఫ్యాన్స్.
కానీ వారి అంచనాలకు భిన్నంగా క్లాస్గా, స్లోగా, బోరింగ్గా సాగడంతో సినిమా మెజారిటీ జనాలకు రుచించలేదు. ఫ్యాన్స్కు అయితే అదొక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. చరణ్ కెరీర్కు పెద్ద స్పీడ్ బ్రేకర్ అయిందీ సినిమా. ఈ చిత్రం వల్లే నాగబాబు తీవ్రంగా నష్టపోయి.. ఒక దశలో ఆత్మహత్య ఆలోచన కూడా చేసినట్లు స్వయంగా వెల్లడించాడు. మరి ఇలాంటి ఫలితాన్నందుకున్న సినిమా దర్శకుడి పరిస్థితి ఏంటో అంచనా వేయడం కష్టం కాదు.
‘ఆరెంజ్’ దెబ్బకు బొమ్మరిల్లు భాస్కర్ కెరీర్ మసకబారి.. చాలా ఏళ్లు కనిపించకుండా పోయాడు. దీని తర్వాత పదేళ్ల వ్యవధిలో అతను తీసింది ఒక్క ‘ఒంగోలు గిత్త’ మాత్రమే. ఆ సినిమా తర్వాత అంతర్ధానం అయిపోయిన భాస్కర్ను పిలిచి సినిమా చేయించింది అల్లు అరవింద్. మెగా ఫ్యామిలీకి, అభిమానులకు అంతటి చేదు అనుభవాన్ని మిగిల్చిన దర్శకుడిపై నమ్మకం పెట్టి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చేయించారు. అది ఓ మోస్తరు ఫలితాన్నే అందుకుంది.
అయినా భాస్కర్ మీద అరవింద్ నమ్మకం సడలిపోలేదు. తిరిగి గీతా ఆర్ట్స్ బేనర్లో ఇంకో ఛాన్స్ ఇచ్చారు. కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లే ఈ చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా కన్ఫమ్ అయ్యాడు. గురువారమే ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంది. ఈసారి కొంచెం కమర్షియల్ టచ్ ఉన్న సినిమా చేయబోతున్నాడట భాస్కర్. సిద్ధు లాంటి ఫామ్లో ఉన్న హీరో దొరకడం భాస్కర్కు కలిసొచ్చే అంశం. మరి భాస్కర్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఏమేర నెరవేరుస్తాడో చూడాలి.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…