మెగా ఫ్యామిలీని.. ఆ ఫ్యామిలీ హీరోల అభిమానులను ఒక కలవరపాటుకు గురి చేసి చాలా ఏళ్ల పాటు వెంటాడిన సినిమా ‘ఆరెంజ్’. ‘మగధీర’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రామ్ చరణ్ నుంచి వచ్చిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి అప్పట్లో. ఆడియో బ్లాక్ బస్టర్ కావడంతో సినిమా గురించి ఏదో ఊహించుకున్నారు ఫ్యాన్స్.
కానీ వారి అంచనాలకు భిన్నంగా క్లాస్గా, స్లోగా, బోరింగ్గా సాగడంతో సినిమా మెజారిటీ జనాలకు రుచించలేదు. ఫ్యాన్స్కు అయితే అదొక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. చరణ్ కెరీర్కు పెద్ద స్పీడ్ బ్రేకర్ అయిందీ సినిమా. ఈ చిత్రం వల్లే నాగబాబు తీవ్రంగా నష్టపోయి.. ఒక దశలో ఆత్మహత్య ఆలోచన కూడా చేసినట్లు స్వయంగా వెల్లడించాడు. మరి ఇలాంటి ఫలితాన్నందుకున్న సినిమా దర్శకుడి పరిస్థితి ఏంటో అంచనా వేయడం కష్టం కాదు.
‘ఆరెంజ్’ దెబ్బకు బొమ్మరిల్లు భాస్కర్ కెరీర్ మసకబారి.. చాలా ఏళ్లు కనిపించకుండా పోయాడు. దీని తర్వాత పదేళ్ల వ్యవధిలో అతను తీసింది ఒక్క ‘ఒంగోలు గిత్త’ మాత్రమే. ఆ సినిమా తర్వాత అంతర్ధానం అయిపోయిన భాస్కర్ను పిలిచి సినిమా చేయించింది అల్లు అరవింద్. మెగా ఫ్యామిలీకి, అభిమానులకు అంతటి చేదు అనుభవాన్ని మిగిల్చిన దర్శకుడిపై నమ్మకం పెట్టి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చేయించారు. అది ఓ మోస్తరు ఫలితాన్నే అందుకుంది.
అయినా భాస్కర్ మీద అరవింద్ నమ్మకం సడలిపోలేదు. తిరిగి గీతా ఆర్ట్స్ బేనర్లో ఇంకో ఛాన్స్ ఇచ్చారు. కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లే ఈ చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా కన్ఫమ్ అయ్యాడు. గురువారమే ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంది. ఈసారి కొంచెం కమర్షియల్ టచ్ ఉన్న సినిమా చేయబోతున్నాడట భాస్కర్. సిద్ధు లాంటి ఫామ్లో ఉన్న హీరో దొరకడం భాస్కర్కు కలిసొచ్చే అంశం. మరి భాస్కర్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఏమేర నెరవేరుస్తాడో చూడాలి.
టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా మొత్తానికి ముహూర్త వేడుకను ముగించింది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్…
టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…
పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…