మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా రీ రిలీజ్ చేసిన బిజినెస్ మెన్ అనుకున్నట్టే కొత్త రికార్డులు సెట్ చేసింది. ఎలాగైనా ఇది నెంబర్ వన్ గా నిలవాలన్న అభిమానుల ఆకాంక్ష తీరింది. పదకొండేళ్ల క్రితం వచ్చిన సినిమాకు ఈ స్థాయిలో స్పందన రావడం చూసి డిస్ట్రిబ్యూటర్ వర్గాలు షాక్ అవుతున్నాయి. దీని దెబ్బకే చాలా చోట్ల గత వారం వచ్చిన కొత్త రిలీజులకు కనీస జనం లేక షోలు క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. మొదటి రోజు అక్షరాలా 5 కోట్ల 30 లక్షల గ్రాస్ సాధించి ఆల్ టైం రికార్డు సాధించింది. నైజామ్ లో అత్యధికంగా 2 కోట్ల 50 లక్షలు రావడం అరుదైన ఘనత.
దీంతో ఇప్పటిదాకా ఫస్ట్ ప్లేస్ లో ఉన్న ఖుషి (4 కోట్ల 14 లక్షలు) రెండో స్థానానికి వెళ్ళింది. ఆ తర్వాత వరసగా సింహాద్రి(4 కోట్లు), జల్సా(3 కోట్ల 20 లక్షలు), ఒక్కడు(2 కోట్లు), ఈ నగరానికి ఏమైంది(1 కోటి 76 లక్షలు), పోకిరి(1 కోటి 72 లక్షలు), ఆరంజ్(1 కోటి 52 లక్షలు), దేశముదురు (1 కోటి 50లక్షలతో)మిగిలిన ర్యాంకుల్లో ఉన్నాయి. సూర్య సన్ అఫ్ కృష్ణన్ అనూహ్యంగా ఈ లిస్టులో 1 కోటి 45 లక్షలతో చివరిగా నిలిచింది. ఇంకా కొన్ని చోట్ల రన్ అవుతోంది కానీ పెద్దగా వసూళ్లు నమోదు కాకపోవచ్చు. మొత్తానికి బిజినెస్ మెన్ రేపిన సంచలనం అభిమానుల్లో ఎక్కడ లేని జోష్ తీసుకొచ్చింది
ఇప్పుడు కొత్త టార్గెట్ రావడంతో నెక్స్ట్ గుడుంబా శంకర్ దీన్ని దాటుతుందా లేదానే అంచనాలు మొదలయ్యాయి. అయితే ఇది అంత సులభంగా ఉండకపోవచ్చు. అప్పట్లోనే అబోవ్ యావరేజ్ గా నిలిచిన ఈ సినిమాని ఇప్పుడు బాగానే రిసీవ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మణిశర్మ పాటలు, పవన్ కళ్యాణ్ కాస్ట్యూమ్స్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. పైగా ఖుషిని బిజినెస్ మెన్ దాటేసిందన్న అంశం మనసులో ఉంటుంది కనక ఫ్యాన్స్ థియేటర్లకు పోటెత్తే అవకాశాలున్నాయి. ఆగస్ట్ 31 నుంచే స్క్రీనింగ్స్ ఉండబోతున్నాయి. బిజినెస్ మెన్ దెబ్బకు రాబోయే రోజుల్లో చాలా రీరిలీజులు క్యూ కట్టడం ఖాయం.
This post was last modified on August 10, 2023 10:41 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…