Movie News

ప్రభాస్.. ఆ సినిమాను హోల్డ్‌లో పెట్టాడా?

ప్రభాస్ ఉన్నట్లుండి పెద్ద సర్ప్రైజే ఇచ్చాడు అభిమానులకు. ‘బాహుబలి’తో తర్వాత ఉత్తరాదిన కూడా తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించుకున్న ప్రభాస్‌తో డైరెక్ట్ హిందీ సినిమా చేయాలని అక్కడి వాళ్లు చేస్తున్న ప్రయత్నం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది.

‘తానాజీ’తో సత్తా చాటుకున్న ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ పేరుతో ఒక భారీ సినిమా చేయబోతున్నాడు ప్రభాస్. ఆ సినిమా గురించి అనౌన్స్ చేస్తూ 2021లో ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్తుందని.. 2022లో విడుదలవుతుందని మేకర్స్ ప్రకటించారు.

ఇది చాలామందిని ఆశ్చర్యానికి, కొంతమందిని విస్మయానికి గురి చేసింది. ఎందుకంటే ప్రభాస్ కమిట్మెంట్ల ప్రకారం చూస్తే ఈ సినిమా వచ్చే ఏడాదే మొదలై.. తర్వాతి ఏడాది విడుదలయ్యే అవకాశం లేదు.

ప్రభాస్ ఇంకా తన 20వ సినిమా అయిన ‘రాధేశ్యామ్’నే పూర్తి చేయలేదు. ఈ సినిమా కోసం ఇంకా కొన్ని నెలలు పన చేయాల్సి ఉంది. దాన్ని పూర్తి చేశాక నాగ్ అశ్విన్ సినిమాలో అతను నటిస్తాడని అంతా అనుకుంటున్నారు. దాన్ని ‘ప్రభాస్ 21’గా పేర్కొంటున్న సంగతి తెలిసిందే. అది భారీగా విజువల్ ఎఫెక్ట్స్, భారీ తారాగణం, వందల కోట్ల బడ్జెట్‌, భారీ లొకేషన్లతో ముడిపడ్డ సినిమా.

కనీసం ఏడాది పాటు చిత్రీకరణ జరపాల్సి ఉంటుంది. ప్రస్తుత కరోనా ప్రభావం చూస్తుంటే.. ‘రాధేశ్యామ్’ను పూర్తి చేశాక నాగ్ అశ్విన్ సినిమాను వచ్చే ఏడాది మధ్యలో కానీ మొదలు పెట్టే అవకాశం లేదు. ఈ సంగతి తెలిసి కూడా ‘ఆదిపురుష్’ను 2021లో మొదలుపెట్టి 2022లో విడుదల చేస్తామని ప్రకటించారంటే ఏదో తేడాగానే అనిపిస్తోంది.

అశ్విన్ సినిమాను ప్రభాస్ హోల్డ్‌లో పెట్టి.. ముందు ఓం రౌత్ మూవీని పూర్తి చేసి.. ఆ తర్వాతే దాని సంగతి చూస్తాడేమో అనిపిస్తోంది. ఆ లెక్కన ‘ఆదిపురుష్’యే ప్రభాస్ 21వ సినిమాగా భావించాల్సి ఉంటుంది.

This post was last modified on August 20, 2020 3:18 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తమిళనాడు కూడా తేలింది.. కానీ కేరళ మాత్రం…

తమిళగ వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖరారైంది. ఆరు రోజులుగా ట్విస్టులతో సాగిన రాజకీయ…

52 minutes ago

కమ్యూనిస్టులు… మళ్ళీ అదే తప్పిదం

రాజ‌కీయాల్లో అవ‌కాశాలు రావ‌డ‌మే అరుదు. వ‌చ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవ‌స‌రం.. వాటిని ప‌ట్టుకుని ఎద‌గాల్సిన అవ‌స‌రం కూడా పార్టీల‌కు, నాయ‌కుల‌కు…

6 hours ago

సంచలనాలకు సిద్ధమవుతున్న జన నాయకుడు

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…

7 hours ago

దృశ్యం 3 ఇక్కడితో ఆగడం లేదా

పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…

7 hours ago

ఇక సీఎం విజయ్ ను ఎవరు ఆపలేరు

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత ప‌రిస్థితి తొలిగిపోయింది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించిన…

7 hours ago

ప‌వ‌న్ ఇంటికి ప్ర‌ధాని మోడీ?

దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఆదివారం హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ ప‌ర్య‌ట‌న‌లో మ‌రో…

9 hours ago