Movie News

ప్రభాస్.. ఆ సినిమాను హోల్డ్‌లో పెట్టాడా?

ప్రభాస్ ఉన్నట్లుండి పెద్ద సర్ప్రైజే ఇచ్చాడు అభిమానులకు. ‘బాహుబలి’తో తర్వాత ఉత్తరాదిన కూడా తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించుకున్న ప్రభాస్‌తో డైరెక్ట్ హిందీ సినిమా చేయాలని అక్కడి వాళ్లు చేస్తున్న ప్రయత్నం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది.

‘తానాజీ’తో సత్తా చాటుకున్న ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ పేరుతో ఒక భారీ సినిమా చేయబోతున్నాడు ప్రభాస్. ఆ సినిమా గురించి అనౌన్స్ చేస్తూ 2021లో ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్తుందని.. 2022లో విడుదలవుతుందని మేకర్స్ ప్రకటించారు.

ఇది చాలామందిని ఆశ్చర్యానికి, కొంతమందిని విస్మయానికి గురి చేసింది. ఎందుకంటే ప్రభాస్ కమిట్మెంట్ల ప్రకారం చూస్తే ఈ సినిమా వచ్చే ఏడాదే మొదలై.. తర్వాతి ఏడాది విడుదలయ్యే అవకాశం లేదు.

ప్రభాస్ ఇంకా తన 20వ సినిమా అయిన ‘రాధేశ్యామ్’నే పూర్తి చేయలేదు. ఈ సినిమా కోసం ఇంకా కొన్ని నెలలు పన చేయాల్సి ఉంది. దాన్ని పూర్తి చేశాక నాగ్ అశ్విన్ సినిమాలో అతను నటిస్తాడని అంతా అనుకుంటున్నారు. దాన్ని ‘ప్రభాస్ 21’గా పేర్కొంటున్న సంగతి తెలిసిందే. అది భారీగా విజువల్ ఎఫెక్ట్స్, భారీ తారాగణం, వందల కోట్ల బడ్జెట్‌, భారీ లొకేషన్లతో ముడిపడ్డ సినిమా.

కనీసం ఏడాది పాటు చిత్రీకరణ జరపాల్సి ఉంటుంది. ప్రస్తుత కరోనా ప్రభావం చూస్తుంటే.. ‘రాధేశ్యామ్’ను పూర్తి చేశాక నాగ్ అశ్విన్ సినిమాను వచ్చే ఏడాది మధ్యలో కానీ మొదలు పెట్టే అవకాశం లేదు. ఈ సంగతి తెలిసి కూడా ‘ఆదిపురుష్’ను 2021లో మొదలుపెట్టి 2022లో విడుదల చేస్తామని ప్రకటించారంటే ఏదో తేడాగానే అనిపిస్తోంది.

అశ్విన్ సినిమాను ప్రభాస్ హోల్డ్‌లో పెట్టి.. ముందు ఓం రౌత్ మూవీని పూర్తి చేసి.. ఆ తర్వాతే దాని సంగతి చూస్తాడేమో అనిపిస్తోంది. ఆ లెక్కన ‘ఆదిపురుష్’యే ప్రభాస్ 21వ సినిమాగా భావించాల్సి ఉంటుంది.

Satya

Recent Posts

అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి!

తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువ ఉద్యోగుల మరణ వార్తలు అమెరికా నుంచి వరుసగా వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు…

2 hours ago

వైసీపీ కాపుల సభలో ఏం జరిగింది?

వైసీపీ ఆధ్వ‌ర్యంలో ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లాలోని కోన‌సీమ‌లో ఆదివారం నిర్వ‌హించిన కాపుల స‌భ‌లో మాజీ మంత్రి, ఉత్త‌రాంధ్ర‌కు చెందిన బొత్స…

4 hours ago

ప్రేక్షక దేవుళ్ల ఆశీర్వాదం దొరికిందా

బిచ్చగాడు హీరోగా విజయ్ ఆంటోనీకి ఫ్లాపులతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంది. అయితే వరస డిజాస్టర్లు తన…

9 hours ago

అమెరికా వెళ్లే వారికి అలెర్ట్‌… నాలుగేళ్లే గ‌డువు!

అగ్ర‌రాజ్యం అమెరికాలో చ‌దువుకునేందుకు వెళ్లేవారు అప్ర‌మ‌త్తం కావాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ దేశంలో చ‌దువుకునేందుకు వెళ్లేవారు.. ఎడ్యుకేష‌న్…

9 hours ago

పెద్ది కాస్త తొందరపడి ఉండాల్సింది

400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు,…

11 hours ago

హనుమాన్ ఇంత హడావిడి ఎందుకు చేసినట్టు

ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…

12 hours ago