ప్రభాస్ ఉన్నట్లుండి పెద్ద సర్ప్రైజే ఇచ్చాడు అభిమానులకు. ‘బాహుబలి’తో తర్వాత ఉత్తరాదిన కూడా తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించుకున్న ప్రభాస్తో డైరెక్ట్ హిందీ సినిమా చేయాలని అక్కడి వాళ్లు చేస్తున్న ప్రయత్నం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది.
‘తానాజీ’తో సత్తా చాటుకున్న ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ పేరుతో ఒక భారీ సినిమా చేయబోతున్నాడు ప్రభాస్. ఆ సినిమా గురించి అనౌన్స్ చేస్తూ 2021లో ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్తుందని.. 2022లో విడుదలవుతుందని మేకర్స్ ప్రకటించారు.
ఇది చాలామందిని ఆశ్చర్యానికి, కొంతమందిని విస్మయానికి గురి చేసింది. ఎందుకంటే ప్రభాస్ కమిట్మెంట్ల ప్రకారం చూస్తే ఈ సినిమా వచ్చే ఏడాదే మొదలై.. తర్వాతి ఏడాది విడుదలయ్యే అవకాశం లేదు.
ప్రభాస్ ఇంకా తన 20వ సినిమా అయిన ‘రాధేశ్యామ్’నే పూర్తి చేయలేదు. ఈ సినిమా కోసం ఇంకా కొన్ని నెలలు పన చేయాల్సి ఉంది. దాన్ని పూర్తి చేశాక నాగ్ అశ్విన్ సినిమాలో అతను నటిస్తాడని అంతా అనుకుంటున్నారు. దాన్ని ‘ప్రభాస్ 21’గా పేర్కొంటున్న సంగతి తెలిసిందే. అది భారీగా విజువల్ ఎఫెక్ట్స్, భారీ తారాగణం, వందల కోట్ల బడ్జెట్, భారీ లొకేషన్లతో ముడిపడ్డ సినిమా.
కనీసం ఏడాది పాటు చిత్రీకరణ జరపాల్సి ఉంటుంది. ప్రస్తుత కరోనా ప్రభావం చూస్తుంటే.. ‘రాధేశ్యామ్’ను పూర్తి చేశాక నాగ్ అశ్విన్ సినిమాను వచ్చే ఏడాది మధ్యలో కానీ మొదలు పెట్టే అవకాశం లేదు. ఈ సంగతి తెలిసి కూడా ‘ఆదిపురుష్’ను 2021లో మొదలుపెట్టి 2022లో విడుదల చేస్తామని ప్రకటించారంటే ఏదో తేడాగానే అనిపిస్తోంది.
అశ్విన్ సినిమాను ప్రభాస్ హోల్డ్లో పెట్టి.. ముందు ఓం రౌత్ మూవీని పూర్తి చేసి.. ఆ తర్వాతే దాని సంగతి చూస్తాడేమో అనిపిస్తోంది. ఆ లెక్కన ‘ఆదిపురుష్’యే ప్రభాస్ 21వ సినిమాగా భావించాల్సి ఉంటుంది.
This post was last modified on August 20, 2020 3:18 pm
సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్ను ఉర్రూతలూగిస్తూ…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…
లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా పాటల గొప్పదనం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సంగీతాభిమానులు ఆయన్ని దేవుడిలా కొలుస్తారు.…
కూటమి అధికారంలోకి రాగానే.. తాను చేసే తొలి సంతకం.. మెగా డీఎస్సీపైనేనని.. దీనివల్ల 20 వేల మంది నిరుద్యోగులకు మేలు…
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీర రాజమౌళి కాంబోలో తెరకెక్కబోయే ప్యాన్ వరల్డ్ మూవీ గురించి షూటింగ్ స్టార్ట్…
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్కు భారీ షాక్ తగిలింది. కీలకమైన పార్లమెంటు ఎన్నికల సమయం లో…