బాక్సాఫీస్ వద్ద సీనియర్ హీరోల యుద్ధానికి రంగం సిద్ధమయ్యింది. జైలర్ ప్రీమియర్లు ఇవాళ ఉదయం నుంచి మొదలైపోగా భోళా శంకర్ రేపు బరిలో దిగేందుకు రెడీ అవుతున్నాడు. చిరంజీవి వయసు 67 సంవత్సరాలు కాగా రజనీకాంత్ కు 72 ఏళ్ళు. అశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ ఇద్దరు పరస్పరం తలపడిన దాఖలాలు పెద్దగా లేవు. ఇద్దరు కలిసి నటించిన సినిమాలున్నాయి. బందిపోటు సింహంలో చిరు విలన్ గా చేస్తే, కాళీలో సమాన ప్రాధాన్యం కలిగిన క్యారెక్టర్లు చేశారు. మాపిళ్ళైలో మెగాస్టార్ అతిధి పాత్ర పోషించగా కాంబోలో ఒక సీన్ ఉంటుంది.
ఒక స్థాయికి వచ్చాక ఈ కలయిక మళ్ళీ సాధ్యం కాలేదు. బయట వేడుకల్లో కలుసుకోవడం తప్ప ఆన్ స్క్రీన్ కాంబినేషన్ రాలేదు. ఇప్పుడూ జరగలేదు కానీ నువ్వా నేనా అనే పోటీ అయితే వచ్చింది. జైలర్ భీభత్సమైన బుకింగ్స్ తో ఓవర్సీస్ లోనూ అదరగొడుతోంది. భోళా శంకర్ ప్రమోషన్ల పరంగా ఎంత కష్టపడినా డైరెక్టర్ బ్రాండ్ తో పాటు రీమేక్ అనే అంశం కొంత నెగటివిటీని తీసుకొచ్చింది. ఫలితంగానే ఆన్ లైన్ అమ్మకాలు నెమ్మదిగా సాగినా రేపు ఉదయానికి అన్నీ సర్దుకుంటాయని, మరోసారి బాస్ మాస్ విశ్వరూపం చూడొచ్చని నిర్మాత అనిల్ సుంకర హామీ ఇస్తున్నారు.
వీటి ఫలితాలు పట్ల ట్రేడ్ చాలా ఆసక్తిగా ఉంది. ఎందుకంటే రెండు సక్సెస్ అయితే ఎంతలేదన్నా మూడు వందల కోట్ల దాకా మార్కెట్ రెవిన్యూ కళ్లజూడొచ్చు. జైలర్ కు మల్టీ లాంగ్వేజ్ రిలీజ్ పెద్ద అడ్వాంటేజ్ గా నిలవగా కంప్లీట్ కమర్షియల్ ప్యాకేజీగా రూపొందిన భోళా శంకర్ బిసి సెంటర్స్ లో ఆడేసుకుంటాడనే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. అన్నట్టు వీళ్ళతోనే తలపడుతున్న గదర్ 2 హీరో సన్నీ డియోల్ ఏజ్ 65 కాగా, ఓ మై గాడ్ టూతో వస్తున్న అక్షయ్ కుమార్ సైతం 55 పడిలో ఉన్నోడే. ఇలా సీనియర్ మోస్ట్ స్టార్లంతా ఒకేసారి బరిలో దిగడం ఆసక్తి కలిగించే పరిణామం. చూడాలి ఎవరు విజేతలవుతారో.
This post was last modified on August 10, 2023 10:12 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…