విజయ్ దేవరకొండ ఆల్రెడీ పాన్ ఇండియా రిలీజ్ ప్రయత్నాలు చేసి దెబ్బ తిన్నాడు. అర్జున్ రెడ్డి తెలుగు వెర్షనే వివిధ భాషల ప్రేక్షకులను ఆకట్టుకుని తనకు కొంచెం ఫాలోయింగ్ తెచ్చి పెట్టడంతో డియర్ కామ్రేడ్ దక్షిణాది భాషలన్నింట్లో రిలీజ్ చేసి చూశాడు. కానీ ఆ సినిమా తేడా కొట్టేసింది. తెలుగులోనే డిజాస్టర్ అయిన డియర్ కామ్రేడ్.. ఇతర భాషల్లో కనీస ప్రభావం కూడా చూపలేదు.
ఆ తర్వాత లైగర్ రూపంలో ప్రాపర్ పాన్ ఇండియా సినిమా చేశాడు. నార్త్ మార్కెట్లో పెద్ద స్థాయిలో రిలీజైంది ఈ చిత్రం. కానీ ఈ సినిమా ఇంకా పెద్ద డిజాస్టర్ అయి విజయ్ పాన్ ఇండియా ఫాలోయింగ్ ఆశలపై నీళ్లు చల్లింది. అయినా విజయ్ తగ్గట్లేదు. తన కొత్త చిత్రం ఖుషిని పాన్ ఇండియా స్థాయిలోనే రిలీజ్ చేయిస్తున్నాడు. కానీ ఈ సినిమా ఏమాత్రం ప్రభావం చూపుతుందో అన్న సందేహాలు కలుగుతున్నాయి.
ఖుషి ట్రైలర్ చూడటానికి బాగానే ఉంది. కానీ అదొక సగటు లవ్-ఫ్యామిలీ డ్రామాలా కనిపిస్తోందే తప్ప.. ఇతర భాషల ప్రేక్షకులను ఆకర్షించే యునీక్ క్వాలిటీ కానీ.. భారీతనం కానీ..వైవిధ్యం కానీ కనిపించట్లేదు. ఈ నేపథ్యంలోనే ఖుషి మల్టీ లాంగ్వేజ్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి వచ్చిన ఇతర భాషల జర్నలిస్టులు.. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయడం గురించి సందేహాలు వ్యక్తం చేస్తూ ప్రశ్నలు అడిగారు.
దీనికి బదులిస్తూ.. ఈ సినిమాను ఇతర భాషల్లో రిలీజ్ చేయడం డబ్బుల మీద ఆశతో కాదని విజయ్ చెప్పడం గమనార్హం. మామూలుగా పాన్ ఇండియా స్థాయిలో రిలీజయ్యే తెలుగు చిత్రాల్లో భారీతనం, యాక్షన్ ఉంటుందని.. కానీ ఖుషిలో అన్ని భాషల వాళ్లకూ కనెక్టయ్యే ఎమోషన్లు, ఫీల్ ఉంటాయని.. అందుకే ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నామని విజయ్ తెలిపాడు. మరి ఖుషి ఇతర భాషల ప్రేక్షకులను ఏమేర ఆకర్షిస్తుందో, ఆకట్టుకుంటుందో చూడాలి.
This post was last modified on August 10, 2023 9:12 am
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…