పదేళ్లు వెనక్కి వెళ్తే సూపర్ స్టార్ రజినీకాంత్ క్రేజ్ను సౌత్ ఇండియాలో ఎవ్వరూ మ్యాచ్ చేయలేరు అన్నట్లుండేది. ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్, తన సినిమాల బడ్జెట్లు, వసూళ్లు అన్నీ కూడా వేరే లెవెల్లో ఉండేవి. కానీ ‘కబాలి’ సినిమా తర్వాత రజినీ క్రేజ్, మార్కెట్ పడుతూ వచ్చింది. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా కొంత తగ్గింది. రజినీ చివరి సినిమా ‘అన్నాత్తె’ టైంకి అయితే పరిస్థితి దారుణంగా తయారైంది.
‘కబాలి’ లాంటి డిజాస్టర్తో కూడా పాతిక కోట్లకు పైగా షేర్ రాబట్టిన సూపర్ స్టార్.. ‘అన్నాత్తె’ తెలుగు వెర్షన్ ‘పెద్దన్న’తో అందులో పావు వంతు కూడా వసూళ్లు రాబట్టలేకపోయాడు. కానీ సూపర్ స్టార్ కొత్త చిత్రం ‘జైలర్’కు మాత్రం అనూహ్యమైన క్రేజ్ కనిపిస్తోంది. రెండు వారాల ముందు వరకు ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు కానీ.. రిలీజ్ ముందు మాత్రం మంచి హైప్ వచ్చేసింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో రజినీ ఒకప్పటి క్రేజ్ను గుర్తు చేస్తూ ‘జైలర్’కు అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా నడుస్తున్నాయి. చాలా షోలు ఫుల్ అయిపోయాయి. మిగతావి ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్లో ఉన్నాయి. ఇక తమిళ వెర్షన్కు క్రేజ్ అయితే మామూలుగా లేదు. తమిళనాట ఈ సినిమాకు తొలి రోజు ఎక్కడా టికెట్ ముక్క మిగిలేలా కనిపించడం లేదు. ‘జైలర్’ తమిళ వెర్షన్కు హైదరాబాద్లో సైతం పెద్ద ఎత్తున షోలు ఇచ్చారు. వాటికి రెస్పాన్స్ బాగుంది.
బెంగళూరు సిటీలో అయితే ‘జైలర్’ క్రేజ్ చూసి దిమ్మదిరిగిపోతోంది. ‘కబాలి’ రోజులను గుర్తు చేసేలా అడ్వాన్స్ బుకింగ్స్ ఉన్నాయి. సిటీలో మెజారిటీ థియేటర్లు ఈ సినిమాకే ఇచ్చేశారు. తమిళం, తెలుగు వెర్షన్లు మోత మోగించబోతున్నాయి. ఇక యుఎస్లో కూడా ‘జైలర్’ దూకుడు స్పష్టంగా కనిపిస్తోంది. విడుదలకు రెండు రోజుల ముందు ఈ సినిమా 8 లక్షల డాలర్ల మార్కును దాటేసింది. ప్రిమియర్లతోనే ‘జైలర్’ మిలియన్ డాలర్ క్లబ్బులోకి అడుగు పెట్టబోతోంది.
This post was last modified on August 9, 2023 8:54 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…