మహా అయితే ఇంకో పాతిక ముప్పై గంటల్లో భోళా శంకర్ ప్రీమియర్లు పడిపోతాయి. బుకింగ్స్ కొంత నెమ్మదిగా ఉన్నప్పటికీ మెల్లగా పుంజుకుంటాయనే నమ్మకం యూనిట్ లో ఉంది. ఇదిలా ఉండగా ఫ్రైడే రిలీజ్ ఉంటే బుధవారం సాయంత్రం దాకా ఆంధ్ర ప్రదేశ్ కు సంబంధించి బుకింగ్స్ మొదలుపెట్టకపోవడం పట్ల అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒకపక్క తెలంగాణ థియేటర్ల అమ్మకాలు బుక్ మై షో, పేటిఎంలో జరుగుతున్నాయి. కానీ ఏపీ మాత్రం ఎలాంటి అప్డేట్ లేదు. చీటికీ మాటికీ చెక్ చేసుకుంటున్న ఫ్యాన్స్ అసహనం పీక్స్ కు చేరుకుంటోంది.
టికెట్ రేట్ల పెంపు కోసం ఏకె ఎంటర్ టైన్మెంట్స్ పెట్టుకున్న అప్లికేషన్ కి ఇంకా సమ్మతి రాలేదని సమాచారం. సరైన డాక్యుమెంట్లు లేవని, కోరిన వివరాలు ఇవ్వలేదనే కారణంతో పెండింగ్ పెట్టినట్టు తెలిసింది. మొన్న చిరంజీవి వాల్తేరు వీరయ్య వేడుకలో చేసిన కామెంట్లు పెద్ద రాజకీయ రచ్చకే దారి తీశాయి. అంబటి రాంబాబు, రోజా, కొడాలి నాని, పేర్ని నానితో సహా చాలా మంది మంత్రులు మెగాస్టార్ మీద మాటలతో ముప్పేట దాడి చేశారు. దెబ్బకు భోళా శంకర్ కు వెసులుబాటు ఎందుకివ్వాలని పలువురు మినిస్టర్లు కస్సుమనడంతో సమస్య పరిష్కారం లేట్ అవుతోంది.
పెద్ద హీరో అయినా చిన్నవాళ్ళైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో అడ్వాన్స్ సేల్స్ కీలకంగా మారుతున్నాయి. ఒకపక్క జైలర్ టికెట్లు తెలుగులోనూ వారం ముందే అందుబాటులోకి రాగా చిరంజీవి సినిమాకు మాత్రం ఇలా జరగడం విచిత్రం. ఏపీ రేట్లు మరీ తక్కువగా ఉండటం వల్ల పాతిక రూపాయల హైక్ అడగాల్సి వచ్చిందని అంతే తప్ప ప్యాన్ ఇండియా మూవీ అనో లేదా ఇంకేదో డబ్బులు చేసుకుందామనో కాదంటున్నారు యూనిట్ వర్గాలు. ఈలెక్కన చూస్తే ఇలాంటి పెంపులు కావాలంటే రెండు మూడు వారాల ముందే గవర్నమెంటుకు అప్లికేషన్ పెట్టుకోవడం సుఖం ఉత్తమం.
This post was last modified on August 9, 2023 8:48 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…