Movie News

ఫ్లాపుల గురించి నిర్మొహమాటంగా చెప్పేశాడు

విజయ్ దేవరకొండకు ఖుషి మీద మాములు నమ్మకం లేదు. గీత గోవిందం టైంలో వచ్చి ఆ తర్వాత పక్కకెళ్ళిపోయిన ఫ్యామిలీ ఆడియన్స్ ని తిరిగి దగ్గర చేస్తుందనే కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. దానికి తగ్గట్టే మైత్రి మూవీ మేకర్స్ ఇది ఎంత లవ్ ఎంటర్ టైనరైనప్పటికీ ప్రమోషన్ల విషయంలో చాలా ఖర్చు పెడుతున్నారు. ఇవాళ ప్యాన్ ఇండియా మీడియాని ప్రత్యేకంగా ఆహ్వానించి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చేయడం దానికి ఉదాహరణ. తిరిగి ఆగస్ట్ 15న ఒక గ్రాండ్ మ్యూజికల్ కన్సర్ట్ ని ప్లాన్ చేయబోతున్నారు. అంచనాల నిర్మాణంలో ఇవన్నీ బాగా ఉపయోగపడబోతున్నాయి.

చాలా గ్యాప్ తర్వాత విజయ్ దేవరకొండ మీడియా ముందుకు వచ్చాడు. లైగర్ తర్వాత ఎక్కడా మైకులకు దొరకలేదు. దీంతో సహజంగానే ఆ డిజాస్టర్ ప్రస్తావన వస్తుంది. అయితే తప్పించుకునే ప్రయత్నం, కప్పి పుచ్చుకోవడం కానీ ఏమీ చేయలేదు. అంచనాలకు తగ్గట్టు లైగర్ ఆడలేదనే మాట వాస్తవమేనని, తాను అంతకు ముందు పరాజయాలు చూశాను ఇకపై కూడా హిట్లు ఫ్లాపులు చూస్తానని చాలా స్పష్టంగా చెప్పి మెచ్యూరిటీని ప్రదర్శించాడు. అంటే ఏ హీరో అయినా సరే రెండు వస్తాయి కాబట్టి అంగీకరిస్తూ ముందుకు వెళ్లాలనే అర్థంలో చెప్పడం ఆకట్టుకుంది.

ఇదే ప్రెస్ మీట్ లో కన్నడ, హిందీ, తమిళ ప్రతినిధులతో మాట్లాడుతున్నప్పుడు బాష అర్థం కాక విజయ్ దేవరకొండతో పాటు శివ నిర్వాణలు ఇబ్బంది పడటం అందరినీ నవ్వించింది. తొలుత ఖుషిని ప్యాన్ ఇండియా ఎందుకనుకున్నామని, అయితే కథలో ఉన్న సోల్ అందరికీ కనెక్ట్ అవుతుందనే ఉద్దేశం తప్ప ఏదో క్యాష్ చేసుకోవాలని కాదని క్లారిటీ ఇవ్వడం బాగుంది. ప్రకృతి చికిత్స కోసం సమంతా అందుబాటులో లేకపోవడంతో సమావేశం మొత్తం హీరో దర్శకుడు నిర్మాతలతోనే జరిగిపోయింది. సెప్టెంబర్ 1న విడుదల కాబోతున్న ఖుషికి హేశం అబ్దుల్ వహాబ్ సంగీతం ఆకర్షణగా నిలుస్తోంది.

This post was last modified on August 9, 2023 6:06 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రీమియర్ల నుంచే హడావిడి మొదలు

కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…

1 hour ago

హ్యాపీగా వస్తే ఎవరూ పట్టించుకోలేదు

జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…

3 hours ago

‘మావిగన్’ పేరుతో జగన్ కొత్త రాజధాని ప్రతిపాదన

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…

4 hours ago

కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మంచు విష్ణు కౌంటర్

టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…

5 hours ago

అమరావతిపై జగన్ అక్కసు తగ్గలేదా?

ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…

5 hours ago

జయలలిత స్ట్రాటజీ మళ్లీ: విజయ్ పెద్ద ప్లాన్

సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…

5 hours ago