ప్రతీ సినిమా నుండి దర్శక నిర్మాతలు ఏదో ఒక విషయం తెలుసుకుంటారు. ఇంకొన్ని నేర్చుకుంటారు. అయితే హిట్ సినిమాల నుండి ఎక్కువ నేర్చుకునే విషయలు ఉండకపోవచ్చు. కానీ భారీ నష్టం తీసుకొచ్చిన డిజాస్టర్ నుండి ఎంతో నేర్చుకోవచ్చు. తాజాగా నిర్మాత అనిల్ సుంకర ఏజెంట్ సినిమాతో అలాంటి ఓ ఖరీదైన పాఠాన్ని నేర్చుకున్నానని తెలిపాడు.
విషయం లోకి వెళ్తే , అఖిల్ -సురేందర్ రెడ్డి కాంబోలో అనిల్ సుంకర నిర్మించిన ఏజెంట్ ఎంత పెద్ద డిజాస్టర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా రిలీజయ్యక నిర్మాత సోషల్ మీడియా ద్వారా బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండా సెట్స్ పైకి వెళ్ళడం వళ్ళే ఈ తప్పు జరిగిందని ఓ స్టేట్ మెంట్ ఇచ్చాడు. అయితే ఈ విషయంలో ఎవరినీ తప్పు పట్టనని, తప్పంతా నాదే అంటూ చెప్పుకున్నాడు.
తాజాగా భోళా శంకర్ ప్రమోషన్స్ లో ఈ విషయంపై మళ్ళీ మాట్లాడాడు. ఏజెంట్ నేర్పిన పాఠం ఏమిటనే ప్రశ్నకి బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండా సెట్స్ పైకి వెళ్లకూడదని తెలుసుకున్నాని, ఇకపై అలాంటి పొరపాటు చేయనని, అందుకే నెక్స్ట్ సినిమాలను స్క్రిప్ట్ లేకుండా మొదలు పెట్టడం లేదని, పూర్తి కథ లేకుండా ప్రీ ప్రొడక్షన్ చేయవచ్చు కానీ షూటింగ్ చేయకూడదని డిసైడ్ అయ్యానని ఇకపై అదే పాటిస్తూ సినిమాలు నిర్మిస్తానని అన్నాడు.
నిజానికి అనిల్ సుంకర కి సోలోగా నిర్మించిన అన్నీ సినిమాలు బాగా నష్టాలు తెచ్చాయి. ఏజెంట్ మాత్రం కోలుకోలేని దెబ్బ తీసింది. ఆ సినిమాతో బ్యానర్ బ్రాండ్ కి బాగా డ్యామేజ్ అయ్యింది. తాజాగా ఏజెంట్ తో నష్టపోయిన ఓ డిస్ట్రిబ్యూటర్ కూడా అనిల్ సుంకర మీద తీవ్రంగా వ్యాఖ్యలు చేస్తూ భోళా శంకర్ రిలీజ్ పై వివాదం నెలకొల్పాడు. ఏదేమైనా కావాలని చేయకపోయినా ఏజెంట్ ఫలితం వల్ల అనిల్ సుంకర చాలా ఇబ్బందులు పడాల్సివస్తుంది.
This post was last modified on August 9, 2023 1:10 pm
2024 సార్వత్రిక ఎన్నికల ముందు ఏపీలో కూటమి పార్టీలకు చెందిన శ్రేణుల నుంచి ఓ వినూత్న నినాదం వినిపించింది. సైకో…
బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న హిట్ 3 ది థర్డ్ కేస్ మీద జరిగిన రివ్యూలు, ఆన్ లైన్ విశ్లేషణలు, సోషల్…
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కబోయే ఎంటర్ టైనర్ కోసం హీరోయిన్ వేట కొనసాగుతోంది. ఏవేవో పేర్లు అనుకుని…
"తెలంగాణ పోలీసులు ట్రాఫిక్ విషయంలో కఠినంగా ఉంటారు. ఖచ్చితంగా ఉంటారు."- ఇదీ.. కొన్నిరోజుల కిందట పోలీసు బాస్ చేసిన కామెంట్లు.…
ఎదురు చూసి చూసి అభిమానులే అంచనాలు తగ్గించేసుకున్న హరిహర వీరమల్లు గేరు మార్చబోతోందని తాజా సమాచారం. ఈ రోజు నుంచి…
నిన్న జరిగిన లార్వెన్ ఏఐ స్టూడియో ప్రారంభోత్సవంలో దర్శకులను ఉద్దేశించి నిర్మాత దిల్ రాజు అన్న మాటలు ఆలోచింపజేసేలా ఉన్నాయి.…