ప్రతీ సినిమా నుండి దర్శక నిర్మాతలు ఏదో ఒక విషయం తెలుసుకుంటారు. ఇంకొన్ని నేర్చుకుంటారు. అయితే హిట్ సినిమాల నుండి ఎక్కువ నేర్చుకునే విషయలు ఉండకపోవచ్చు. కానీ భారీ నష్టం తీసుకొచ్చిన డిజాస్టర్ నుండి ఎంతో నేర్చుకోవచ్చు. తాజాగా నిర్మాత అనిల్ సుంకర ఏజెంట్ సినిమాతో అలాంటి ఓ ఖరీదైన పాఠాన్ని నేర్చుకున్నానని తెలిపాడు.
విషయం లోకి వెళ్తే , అఖిల్ -సురేందర్ రెడ్డి కాంబోలో అనిల్ సుంకర నిర్మించిన ఏజెంట్ ఎంత పెద్ద డిజాస్టర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా రిలీజయ్యక నిర్మాత సోషల్ మీడియా ద్వారా బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండా సెట్స్ పైకి వెళ్ళడం వళ్ళే ఈ తప్పు జరిగిందని ఓ స్టేట్ మెంట్ ఇచ్చాడు. అయితే ఈ విషయంలో ఎవరినీ తప్పు పట్టనని, తప్పంతా నాదే అంటూ చెప్పుకున్నాడు.
తాజాగా భోళా శంకర్ ప్రమోషన్స్ లో ఈ విషయంపై మళ్ళీ మాట్లాడాడు. ఏజెంట్ నేర్పిన పాఠం ఏమిటనే ప్రశ్నకి బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండా సెట్స్ పైకి వెళ్లకూడదని తెలుసుకున్నాని, ఇకపై అలాంటి పొరపాటు చేయనని, అందుకే నెక్స్ట్ సినిమాలను స్క్రిప్ట్ లేకుండా మొదలు పెట్టడం లేదని, పూర్తి కథ లేకుండా ప్రీ ప్రొడక్షన్ చేయవచ్చు కానీ షూటింగ్ చేయకూడదని డిసైడ్ అయ్యానని ఇకపై అదే పాటిస్తూ సినిమాలు నిర్మిస్తానని అన్నాడు.
నిజానికి అనిల్ సుంకర కి సోలోగా నిర్మించిన అన్నీ సినిమాలు బాగా నష్టాలు తెచ్చాయి. ఏజెంట్ మాత్రం కోలుకోలేని దెబ్బ తీసింది. ఆ సినిమాతో బ్యానర్ బ్రాండ్ కి బాగా డ్యామేజ్ అయ్యింది. తాజాగా ఏజెంట్ తో నష్టపోయిన ఓ డిస్ట్రిబ్యూటర్ కూడా అనిల్ సుంకర మీద తీవ్రంగా వ్యాఖ్యలు చేస్తూ భోళా శంకర్ రిలీజ్ పై వివాదం నెలకొల్పాడు. ఏదేమైనా కావాలని చేయకపోయినా ఏజెంట్ ఫలితం వల్ల అనిల్ సుంకర చాలా ఇబ్బందులు పడాల్సివస్తుంది.
This post was last modified on August 9, 2023 1:10 pm
నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…
సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…