సూపర్ స్టార్ మహేష్ కి క్లోజ్ గా ఉండే నిర్మాత ఎవరంటే టక్కున వినిపించే పేరు అనీల్ సుంకర. కృష్ణ గారి వీరాభిమానిగా మహేష్ కి దగ్గరైన అనిల్ సుంకర తన మిత్రులతో కలిసి సూపర్ స్టార్ తో దూకుడు , ఆగడు వంటి సినిమాలు నిర్మించాడు. మహేష్ తో ‘సరిలేరు నీకెవ్వరు’ కూడా నిర్మించాడు. ఇక మహేష్ అప్ కమింగ్ మూవీస్ లిస్టులో కూడా అనిల్ సుంకర కి చోటుంది. తన సినిమాలకు సంబంధించి మహేష్ తో అప్పుడప్పుడు చెప్పుకుంటారు నిర్మాత. ఇదే క్రమంలో చిరంజీవి గారితో సినిమా చేస్తున్నానని చెప్పిన వెంటనే మహేష్ చెప్పిన ఓ విషయం తనకి బాగా హెల్ప్ అయ్యిందని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకున్నాడు అనిల్ సుంకర.
“సహజంగా నేను షూటింగ్స్ కి ఎక్కువ వెళ్ళను. అమెరికా టూ ఇండియా తిరిగే క్రమంలో షూటింగ్స్ కి వెళ్ళడం వీలు పడదు. కానీ మహేష్ తో సినిమా చేస్తే మాత్రం షూటింగ్ లో తప్పకుండా ఉంటాను. అలాగే భోళా శంకర్ షూటింగ్ కి కూడా ఎక్కువ సార్లు వెళ్ళాను. డానికి రీజన్. నాతో సినిమా చేస్తున్నప్పుడు ఎలా ఉన్నావో అలాగే చిరంజీవి గారితో చేసేటప్పుడు సెట్స్ లో ఉండాలని మహేష్ చెప్పారు. చిరంజీవి గారికి నిర్మాత అలా ఉండటం చాలా ఇష్టమని తెలిపాడు. వాళ్ళకి వాళ్ళ గురించి బాగా తెలుసు కనుక మహేష్ చెప్పిన మాట నాకు చాలా హెల్ప్ అయ్యింది. నేను సెట్స్ లో ఉంటూ అన్నీ దగ్గరుండి చూసుకోవడం చిరంజీవి గారికి బాగా నచ్చింది” అంటూ అనిల్ చెప్పుకున్నారు.
“వేదాళం కన్నడ రీమేక్ రైట్స్ తన దగ్గర ఉన్నాయని , ఈ క్రమంలో మెహర్ రమేష్ తో ఆ విషయం చెప్తే నేను కూడా చిరంజీవి గారితో తెలుగులో అనుకున్నాను రెండేళ్ల క్రితం ఆయనతో ఆ రీమేక్ గురించి మాట్లాడాను అని అన్నాడు. ఆ తర్వాత తెలుగు రీమేక్ రైట్స్ ను ఏ ఎం రత్నం గారి దగ్గర నుండి తీసుకొని ముందు తెలుగులో రీమేక్ చేశాను. ఈ రీమేక్ ను చిరంజీవి గారి దగ్గరికి తీసుకెళ్లింది రమేష్ గారే. “అంటూ తెలిపాడు.
This post was last modified on August 9, 2023 12:55 pm
ఏపీకి చెందిన క్రైస్తవ మత బోధకుడు ప్రవీణ్ పగడాల మరణంపై నెలకొన్న అస్పష్టతకు తెర పడిపోయింది. ఈ మేరకు ఏలూరు రేంజి…
ముందు విడుదల తేదీని ప్రకటించుకుని, ఆ తర్వాత పోటీదారులు వస్తే తప్పని పరిస్థితుల్లో డేట్ మార్చుకునే పరిస్థితి చిన్న సినిమాలకే…
ఏపీలో రాముడి తరహా రామరాజ్యం తీసుకురావాలన్నదే తన లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. రామరాజ్యం అంటే.. ఏపీ సమగ్ర అభివృద్ధి…
తమిళనాడులో బీజేపీ-అన్నాడీఎంకే పొత్తు పెట్టుకోవడంపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు.…
హీరోలు మాత్రమేనా పాన్ ఇండియా రేంజికి వెళ్లేది.. నిర్మాతలు వెళ్లలేరా అన్నట్లు బహు భాషల్లో సినిమాలు తీస్తూ దూసుకెళ్తోంది టాలీవుడ్ అగ్ర…
సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు ఎంతకు తెగిస్తున్నారన్న దానికి ఈ ఘటన నిలువెత్తు నిదర్శనమని చెప్పక తప్పదు. జనసేన అధినేత, ఏపీ…