సూపర్ స్టార్ మహేష్ కి క్లోజ్ గా ఉండే నిర్మాత ఎవరంటే టక్కున వినిపించే పేరు అనీల్ సుంకర. కృష్ణ గారి వీరాభిమానిగా మహేష్ కి దగ్గరైన అనిల్ సుంకర తన మిత్రులతో కలిసి సూపర్ స్టార్ తో దూకుడు , ఆగడు వంటి సినిమాలు నిర్మించాడు. మహేష్ తో ‘సరిలేరు నీకెవ్వరు’ కూడా నిర్మించాడు. ఇక మహేష్ అప్ కమింగ్ మూవీస్ లిస్టులో కూడా అనిల్ సుంకర కి చోటుంది. తన సినిమాలకు సంబంధించి మహేష్ తో అప్పుడప్పుడు చెప్పుకుంటారు నిర్మాత. ఇదే క్రమంలో చిరంజీవి గారితో సినిమా చేస్తున్నానని చెప్పిన వెంటనే మహేష్ చెప్పిన ఓ విషయం తనకి బాగా హెల్ప్ అయ్యిందని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకున్నాడు అనిల్ సుంకర.
“సహజంగా నేను షూటింగ్స్ కి ఎక్కువ వెళ్ళను. అమెరికా టూ ఇండియా తిరిగే క్రమంలో షూటింగ్స్ కి వెళ్ళడం వీలు పడదు. కానీ మహేష్ తో సినిమా చేస్తే మాత్రం షూటింగ్ లో తప్పకుండా ఉంటాను. అలాగే భోళా శంకర్ షూటింగ్ కి కూడా ఎక్కువ సార్లు వెళ్ళాను. డానికి రీజన్. నాతో సినిమా చేస్తున్నప్పుడు ఎలా ఉన్నావో అలాగే చిరంజీవి గారితో చేసేటప్పుడు సెట్స్ లో ఉండాలని మహేష్ చెప్పారు. చిరంజీవి గారికి నిర్మాత అలా ఉండటం చాలా ఇష్టమని తెలిపాడు. వాళ్ళకి వాళ్ళ గురించి బాగా తెలుసు కనుక మహేష్ చెప్పిన మాట నాకు చాలా హెల్ప్ అయ్యింది. నేను సెట్స్ లో ఉంటూ అన్నీ దగ్గరుండి చూసుకోవడం చిరంజీవి గారికి బాగా నచ్చింది” అంటూ అనిల్ చెప్పుకున్నారు.
“వేదాళం కన్నడ రీమేక్ రైట్స్ తన దగ్గర ఉన్నాయని , ఈ క్రమంలో మెహర్ రమేష్ తో ఆ విషయం చెప్తే నేను కూడా చిరంజీవి గారితో తెలుగులో అనుకున్నాను రెండేళ్ల క్రితం ఆయనతో ఆ రీమేక్ గురించి మాట్లాడాను అని అన్నాడు. ఆ తర్వాత తెలుగు రీమేక్ రైట్స్ ను ఏ ఎం రత్నం గారి దగ్గర నుండి తీసుకొని ముందు తెలుగులో రీమేక్ చేశాను. ఈ రీమేక్ ను చిరంజీవి గారి దగ్గరికి తీసుకెళ్లింది రమేష్ గారే. “అంటూ తెలిపాడు.
This post was last modified on August 9, 2023 12:55 pm
సామాజికంగా.. సమస్యల పరిష్కారం పరంగా.. నాయకులు దూకుడు ప్రదర్శిస్తారు. నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క…
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…