సూపర్ స్టార్ మహేష్ కి క్లోజ్ గా ఉండే నిర్మాత ఎవరంటే టక్కున వినిపించే పేరు అనీల్ సుంకర. కృష్ణ గారి వీరాభిమానిగా మహేష్ కి దగ్గరైన అనిల్ సుంకర తన మిత్రులతో కలిసి సూపర్ స్టార్ తో దూకుడు , ఆగడు వంటి సినిమాలు నిర్మించాడు. మహేష్ తో ‘సరిలేరు నీకెవ్వరు’ కూడా నిర్మించాడు. ఇక మహేష్ అప్ కమింగ్ మూవీస్ లిస్టులో కూడా అనిల్ సుంకర కి చోటుంది. తన సినిమాలకు సంబంధించి మహేష్ తో అప్పుడప్పుడు చెప్పుకుంటారు నిర్మాత. ఇదే క్రమంలో చిరంజీవి గారితో సినిమా చేస్తున్నానని చెప్పిన వెంటనే మహేష్ చెప్పిన ఓ విషయం తనకి బాగా హెల్ప్ అయ్యిందని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకున్నాడు అనిల్ సుంకర.
“సహజంగా నేను షూటింగ్స్ కి ఎక్కువ వెళ్ళను. అమెరికా టూ ఇండియా తిరిగే క్రమంలో షూటింగ్స్ కి వెళ్ళడం వీలు పడదు. కానీ మహేష్ తో సినిమా చేస్తే మాత్రం షూటింగ్ లో తప్పకుండా ఉంటాను. అలాగే భోళా శంకర్ షూటింగ్ కి కూడా ఎక్కువ సార్లు వెళ్ళాను. డానికి రీజన్. నాతో సినిమా చేస్తున్నప్పుడు ఎలా ఉన్నావో అలాగే చిరంజీవి గారితో చేసేటప్పుడు సెట్స్ లో ఉండాలని మహేష్ చెప్పారు. చిరంజీవి గారికి నిర్మాత అలా ఉండటం చాలా ఇష్టమని తెలిపాడు. వాళ్ళకి వాళ్ళ గురించి బాగా తెలుసు కనుక మహేష్ చెప్పిన మాట నాకు చాలా హెల్ప్ అయ్యింది. నేను సెట్స్ లో ఉంటూ అన్నీ దగ్గరుండి చూసుకోవడం చిరంజీవి గారికి బాగా నచ్చింది” అంటూ అనిల్ చెప్పుకున్నారు.
“వేదాళం కన్నడ రీమేక్ రైట్స్ తన దగ్గర ఉన్నాయని , ఈ క్రమంలో మెహర్ రమేష్ తో ఆ విషయం చెప్తే నేను కూడా చిరంజీవి గారితో తెలుగులో అనుకున్నాను రెండేళ్ల క్రితం ఆయనతో ఆ రీమేక్ గురించి మాట్లాడాను అని అన్నాడు. ఆ తర్వాత తెలుగు రీమేక్ రైట్స్ ను ఏ ఎం రత్నం గారి దగ్గర నుండి తీసుకొని ముందు తెలుగులో రీమేక్ చేశాను. ఈ రీమేక్ ను చిరంజీవి గారి దగ్గరికి తీసుకెళ్లింది రమేష్ గారే. “అంటూ తెలిపాడు.
This post was last modified on August 9, 2023 12:55 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…