సూపర్ స్టార్ మహేష్ కి క్లోజ్ గా ఉండే నిర్మాత ఎవరంటే టక్కున వినిపించే పేరు అనీల్ సుంకర. కృష్ణ గారి వీరాభిమానిగా మహేష్ కి దగ్గరైన అనిల్ సుంకర తన మిత్రులతో కలిసి సూపర్ స్టార్ తో దూకుడు , ఆగడు వంటి సినిమాలు నిర్మించాడు. మహేష్ తో ‘సరిలేరు నీకెవ్వరు’ కూడా నిర్మించాడు. ఇక మహేష్ అప్ కమింగ్ మూవీస్ లిస్టులో కూడా అనిల్ సుంకర కి చోటుంది. తన సినిమాలకు సంబంధించి మహేష్ తో అప్పుడప్పుడు చెప్పుకుంటారు నిర్మాత. ఇదే క్రమంలో చిరంజీవి గారితో సినిమా చేస్తున్నానని చెప్పిన వెంటనే మహేష్ చెప్పిన ఓ విషయం తనకి బాగా హెల్ప్ అయ్యిందని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకున్నాడు అనిల్ సుంకర.
“సహజంగా నేను షూటింగ్స్ కి ఎక్కువ వెళ్ళను. అమెరికా టూ ఇండియా తిరిగే క్రమంలో షూటింగ్స్ కి వెళ్ళడం వీలు పడదు. కానీ మహేష్ తో సినిమా చేస్తే మాత్రం షూటింగ్ లో తప్పకుండా ఉంటాను. అలాగే భోళా శంకర్ షూటింగ్ కి కూడా ఎక్కువ సార్లు వెళ్ళాను. డానికి రీజన్. నాతో సినిమా చేస్తున్నప్పుడు ఎలా ఉన్నావో అలాగే చిరంజీవి గారితో చేసేటప్పుడు సెట్స్ లో ఉండాలని మహేష్ చెప్పారు. చిరంజీవి గారికి నిర్మాత అలా ఉండటం చాలా ఇష్టమని తెలిపాడు. వాళ్ళకి వాళ్ళ గురించి బాగా తెలుసు కనుక మహేష్ చెప్పిన మాట నాకు చాలా హెల్ప్ అయ్యింది. నేను సెట్స్ లో ఉంటూ అన్నీ దగ్గరుండి చూసుకోవడం చిరంజీవి గారికి బాగా నచ్చింది” అంటూ అనిల్ చెప్పుకున్నారు.
“వేదాళం కన్నడ రీమేక్ రైట్స్ తన దగ్గర ఉన్నాయని , ఈ క్రమంలో మెహర్ రమేష్ తో ఆ విషయం చెప్తే నేను కూడా చిరంజీవి గారితో తెలుగులో అనుకున్నాను రెండేళ్ల క్రితం ఆయనతో ఆ రీమేక్ గురించి మాట్లాడాను అని అన్నాడు. ఆ తర్వాత తెలుగు రీమేక్ రైట్స్ ను ఏ ఎం రత్నం గారి దగ్గర నుండి తీసుకొని ముందు తెలుగులో రీమేక్ చేశాను. ఈ రీమేక్ ను చిరంజీవి గారి దగ్గరికి తీసుకెళ్లింది రమేష్ గారే. “అంటూ తెలిపాడు.
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా సినిమా మేజర్ షెడ్యూల్ ఈ జూన్ మధ్యలో ప్రారంభం కాబోతున్నట్లు…
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…
వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…