మెగాస్టార్ చిరంజీవి ఒక టైంలో నాలుగైదు సినిమాలను లైన్లో పెట్టినట్లు కనిపించారు. కానీ అందులో కొన్ని పక్కకు వెళ్లిపోయాయి. వెంకీ కుడుములతో చేయాల్సిన ప్రాజెక్టు క్యాన్సిల్ అయింది. బింబిసార దర్శకుడు వశిష్ఠతో అనుకున్న సినిమా కూడా ముందుకు కదల్లేదు. చిరుతో సినిమా చేసే దర్శకులుగా ఇంకా ఇద్దరు ముగ్గురి పేర్లు వినిపించాయి. కానీ వారిలో కళ్యాణ్ కృష్ణ కురసాల సినిమా మాత్రమే ఓకే అయినట్లు వార్తలొచ్చాయి.
దాని గురించి కూడా ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఐతే ఇప్పుడు చిరు స్వయంగా ఆ ప్రాజెక్టు గురించి క్లారిటీ ఇచ్చాడు. కళ్యాణ్ పేరు చెప్పకుండా తన కొత్త సినిమా గురించి ఖరారు చేశారు. ‘వాల్తేరు వీరయ్య’ 200 రోజుల వేడుకలో చిరు మాట్లాడుతూ.. టాలీవుడ్లో చాలా స్పీడుగా సినిమాలు చేసుకుపోయే రవితేజ గురించి మాట్లాడారు.
రవితేజ ఈ మధ్య తనతో మాట్లాడుతూ.. వచ్చే ఏడాది తన నుంచి ఐదు రిలీజ్లు ఉంటాయని చెప్పాడని.. అతణ్ని చూసి తాను కూడా ఇన్స్పైర్ అయి వేగంగా సినిమాలు చేస్తున్నానని.. వచ్చే ఏడాది కనీసం తన నుంచి రెండు రిలీజ్లు ఉంటాయని చిరు చెప్పారు. అందులో ఒకటి తన కూతురు సుశ్మితకే చేస్తున్నట్లు చిరు వెల్లడించారు.
‘బ్రో డాడీ’కి రీమేక్గా చెప్పుకుంటున్న ఈ సినిమానే కళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు. దీని తర్వాత తాను యువి క్రియేషన్స్ సంస్థలో ఓ సినిమా చేయనున్నట్లు చిరు తెలిపారు. నిజానికి వెంకీ కుడుముల సినిమాను యువి వాళ్లే ప్రొడ్యూస్ చేయాల్సింది. మరి ఇప్పటికీ అతనే ఈ సినిమాను డైరెక్ట్ చేస్తాడా.. లేక దర్శకుడు మారాడా అన్నది తెలియదు కానీ.. యువి సంస్థలో మాత్రం చిరు సినిమా కన్ఫమ్ అయింది. తాను ఇంకా కొందరు దర్శకులతో చర్చలు జరుపుతున్నట్లు కూడా చిరు వెల్లడించడం విశేషం.
This post was last modified on August 9, 2023 9:19 am
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. వాస్తవానికి ఇప్పటికే చాలా బిల్లులు పెండింగులో ఉండగా..…
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…