మెగాస్టార్ చిరంజీవి ఒక టైంలో నాలుగైదు సినిమాలను లైన్లో పెట్టినట్లు కనిపించారు. కానీ అందులో కొన్ని పక్కకు వెళ్లిపోయాయి. వెంకీ కుడుములతో చేయాల్సిన ప్రాజెక్టు క్యాన్సిల్ అయింది. బింబిసార దర్శకుడు వశిష్ఠతో అనుకున్న సినిమా కూడా ముందుకు కదల్లేదు. చిరుతో సినిమా చేసే దర్శకులుగా ఇంకా ఇద్దరు ముగ్గురి పేర్లు వినిపించాయి. కానీ వారిలో కళ్యాణ్ కృష్ణ కురసాల సినిమా మాత్రమే ఓకే అయినట్లు వార్తలొచ్చాయి.
దాని గురించి కూడా ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఐతే ఇప్పుడు చిరు స్వయంగా ఆ ప్రాజెక్టు గురించి క్లారిటీ ఇచ్చాడు. కళ్యాణ్ పేరు చెప్పకుండా తన కొత్త సినిమా గురించి ఖరారు చేశారు. ‘వాల్తేరు వీరయ్య’ 200 రోజుల వేడుకలో చిరు మాట్లాడుతూ.. టాలీవుడ్లో చాలా స్పీడుగా సినిమాలు చేసుకుపోయే రవితేజ గురించి మాట్లాడారు.
రవితేజ ఈ మధ్య తనతో మాట్లాడుతూ.. వచ్చే ఏడాది తన నుంచి ఐదు రిలీజ్లు ఉంటాయని చెప్పాడని.. అతణ్ని చూసి తాను కూడా ఇన్స్పైర్ అయి వేగంగా సినిమాలు చేస్తున్నానని.. వచ్చే ఏడాది కనీసం తన నుంచి రెండు రిలీజ్లు ఉంటాయని చిరు చెప్పారు. అందులో ఒకటి తన కూతురు సుశ్మితకే చేస్తున్నట్లు చిరు వెల్లడించారు.
‘బ్రో డాడీ’కి రీమేక్గా చెప్పుకుంటున్న ఈ సినిమానే కళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు. దీని తర్వాత తాను యువి క్రియేషన్స్ సంస్థలో ఓ సినిమా చేయనున్నట్లు చిరు తెలిపారు. నిజానికి వెంకీ కుడుముల సినిమాను యువి వాళ్లే ప్రొడ్యూస్ చేయాల్సింది. మరి ఇప్పటికీ అతనే ఈ సినిమాను డైరెక్ట్ చేస్తాడా.. లేక దర్శకుడు మారాడా అన్నది తెలియదు కానీ.. యువి సంస్థలో మాత్రం చిరు సినిమా కన్ఫమ్ అయింది. తాను ఇంకా కొందరు దర్శకులతో చర్చలు జరుపుతున్నట్లు కూడా చిరు వెల్లడించడం విశేషం.
This post was last modified on August 9, 2023 9:19 am
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…