మెగాస్టార్ చిరంజీవి ఒక టైంలో నాలుగైదు సినిమాలను లైన్లో పెట్టినట్లు కనిపించారు. కానీ అందులో కొన్ని పక్కకు వెళ్లిపోయాయి. వెంకీ కుడుములతో చేయాల్సిన ప్రాజెక్టు క్యాన్సిల్ అయింది. బింబిసార దర్శకుడు వశిష్ఠతో అనుకున్న సినిమా కూడా ముందుకు కదల్లేదు. చిరుతో సినిమా చేసే దర్శకులుగా ఇంకా ఇద్దరు ముగ్గురి పేర్లు వినిపించాయి. కానీ వారిలో కళ్యాణ్ కృష్ణ కురసాల సినిమా మాత్రమే ఓకే అయినట్లు వార్తలొచ్చాయి.
దాని గురించి కూడా ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఐతే ఇప్పుడు చిరు స్వయంగా ఆ ప్రాజెక్టు గురించి క్లారిటీ ఇచ్చాడు. కళ్యాణ్ పేరు చెప్పకుండా తన కొత్త సినిమా గురించి ఖరారు చేశారు. ‘వాల్తేరు వీరయ్య’ 200 రోజుల వేడుకలో చిరు మాట్లాడుతూ.. టాలీవుడ్లో చాలా స్పీడుగా సినిమాలు చేసుకుపోయే రవితేజ గురించి మాట్లాడారు.
రవితేజ ఈ మధ్య తనతో మాట్లాడుతూ.. వచ్చే ఏడాది తన నుంచి ఐదు రిలీజ్లు ఉంటాయని చెప్పాడని.. అతణ్ని చూసి తాను కూడా ఇన్స్పైర్ అయి వేగంగా సినిమాలు చేస్తున్నానని.. వచ్చే ఏడాది కనీసం తన నుంచి రెండు రిలీజ్లు ఉంటాయని చిరు చెప్పారు. అందులో ఒకటి తన కూతురు సుశ్మితకే చేస్తున్నట్లు చిరు వెల్లడించారు.
‘బ్రో డాడీ’కి రీమేక్గా చెప్పుకుంటున్న ఈ సినిమానే కళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు. దీని తర్వాత తాను యువి క్రియేషన్స్ సంస్థలో ఓ సినిమా చేయనున్నట్లు చిరు తెలిపారు. నిజానికి వెంకీ కుడుముల సినిమాను యువి వాళ్లే ప్రొడ్యూస్ చేయాల్సింది. మరి ఇప్పటికీ అతనే ఈ సినిమాను డైరెక్ట్ చేస్తాడా.. లేక దర్శకుడు మారాడా అన్నది తెలియదు కానీ.. యువి సంస్థలో మాత్రం చిరు సినిమా కన్ఫమ్ అయింది. తాను ఇంకా కొందరు దర్శకులతో చర్చలు జరుపుతున్నట్లు కూడా చిరు వెల్లడించడం విశేషం.
This post was last modified on August 9, 2023 9:19 am
టాలీవుడ్లో బిగ్గెస్ట్ సినీ ఫ్యామిలీ ఏది అంటే.. మెగా కుటుంబం గురించే ముందుగా చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో ఉన్నంత మంది…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడైనా హీరోల ఆధిపత్యమే నడుస్తుంటుంది. దర్శక నిర్మాతలు వాళ్ల మాటను అనుసరించే నడుచుకోవాల్సి ఉంటుంది. హీరోలు మాట తప్పినా..…
ఒక పాట థియేటర్లలో కంటే బయట ఎంతలా వినిపిస్తుందనే దానిపైనే ఆ సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. తాజాగా ఉప్పల్…