Movie News

‘భోళా శంకర్’ వెనుక ట్విస్టులే ట్విస్టులు

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘భోళా శంకర్’ ఇంకో మూడు రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇదొక సగటు మాస్ మసాలా మూవీనే కానీ.. ఈ సినిమా పట్టాలెక్కడానికి ముందు మాత్రం ట్విస్టుల మీద ట్విస్టులు నడిచాయి. అసలీ సినిమాను చిరంజీవి చేయాల్సింది కాదు. అజిత్ హీరోగా ‘శౌర్యం’ శివ రూపొందించిన ‘వేదాళం’కు ఇది రీమేక్ అన్న సంగతి తెలిసిందే.

ఆ చిత్రం 2015లో విడుదల కాగా.. తమిళంలో మంచి విజయం సాధించడంతో తెలుగులో ‘ఆవేశం’ పేరుతో డబ్ చేసి రిలీజ్‌కు రెడీ చేశారు. ఒరిజినల్లో సూపర్ హిట్టయిన ఆలుమా డోలుమా పాటను తెలుగులో రిలీజ్ చేశారు కూడా. కానీ అనూహ్యంగా తర్వాత డబ్బింగ్ వెర్షన్ రిలీజ్‌‌ను ఆపేశారు. ఆపై కొన్నేళ్లకు పవన్ కళ్యాణ్ హీరోగా రీమేక్ చేయడానికి సన్నాహాలు జరిగాయి. తమిళ దర్శకుడు నీసన్ డైరెక్షన్లో ఎ.ఎం.రత్నం ఈ సినిమాను మొదలుపెట్టాడు. 

ఐతే ముహూర్త కార్యక్రమం జరిగాక అనూహ్య పరిణామాల మధ్య ఈ సినిమా ఆగిపోయింది. తెలుగు వెర్షన్ కోసం స్క్రిప్టు కూడా రెడీ చేశాక దాన్ని పక్కన పెట్టేశారు. తర్వాత ‘వేదాళం’ రీమేక్ గురించి రకరకాల ఊహాగానాలు నడిచాయి. చివరికి ఈ సినిమా చిరు చేతుల్లోకి వచ్చింది. ముందు ఆయన వేరే దర్శకుల పేర్లను పరిశీలించారు.

కానీ కరోనా టైంలో తాను చేపట్టిన సహాయ కార్యక్రమాలను ముందుండి నడిపించిన తన బంధువు మెహర్ రమేష్‌కు తన వంతుగా ఏదైనా చేయాలనిపించి ఈ ప్రాజెక్టును తన చేతికి అప్పగించాడు. అనిల్ సుంకరతో పాటు తనకు బాగా క్లోజ్ అయిన సీనియర్ నిర్మాత కె.ఎస్.రామారావును ఈ ప్రాజెక్టులో భాగస్వామిని చేశారు. కొన్ని కారణాల వల్ల తర్వాత రామారావు ఈ సినిమా నుంచి బయటికి వెళ్లారు. ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లడంలో కొంచెం ఆలస్యం జరిగింది. షూటింగ్ కూడా ఆలస్యమైంది. ఏప్రిల్లోనే రావాల్సిన ఈ సినిమా ఎట్టకేలకు ఆగస్టు 11న ప్రేక్షకులను పలకరించబోతోంది.

This post was last modified on August 9, 2023 9:15 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

1 hour ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

2 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

3 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

3 hours ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

5 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

5 hours ago