వాల్తేరు వీరయ్య రెండు వందల రోజుల వేడుకలో చిరంజీవి ప్రజా సమస్యలను పట్టించుకోమని, ఇండస్ట్రీని లక్ష్యంగా పెట్టుకోవద్దని చెప్పిన తీరు రివర్స్ లో ఆయన్నే ఏపీ అధికార పార్టీకి లక్ష్యంగా మారేలా చేసింది. ఒక్క పోలవరం తప్ప ఇంకే అంశం గురించి నేరుగా ఆంధ్రప్రదేశ్ అని కానీ సిఎం జగన్ మోహన్ రెడ్డి అని కానీ ప్రస్తావించని చిరు మాటలకు ప్రతిగా ఏకంగా మంత్రులు, ఎమ్మెల్యేలు కౌంటర్ ఎటాక్ మొదలు పెట్టారు. కొడాలి నాని, బొత్స సత్యనారాయణ, పేర్ని నాని తదితరులంతా ఒకప్పుడు చిరు మీద ఎంతో గౌరవం ప్రదర్శించిన వాళ్లే. ఇప్పుడు ఒక్కసారిగా విమర్శల దండకం అందుకుంటున్నారు.
నిజానికి చిరంజీవి దారుణమైన వ్యాఖ్యలు కానీ అభ్యంతరకర పదాలు కానీ వాడలేదు. కొంచెం సున్నితంగానే తన మనసులో మాట చెప్పారు. ఇంత ముప్పేట దాడి బహుశా ఊహించి ఉండరు. భోళా శంకర్ విడుదలను రెండు రోజుల్లో పెట్టుకుని ఇలా జరగడం వల్ల ఆ సినిమా మీద నెగటివ్ క్యాంపైన్ జరుగుతుందనే ఆందోళన అభిమానుల్లో కనిపిస్తోంది. ఒకవేళ డివైడ్ టాక్ వచ్చినా దాన్ని ప్రతికూలంగా వాడుకుంటారని టెన్షన్ పడుతున్నారు. ఇప్పటిదాకా స్పందించింది ఇద్దరు ముగ్గురు ప్రజా ప్రతినిధులే. గంటల వ్యవధిలో ఇది పదుల సంఖ్యకు చేరినా ఏ మాత్రం ఆశ్చర్యం లేదు.
ఒకవేళ మాములు టైంలో ఇలాంటిది జరిగి ఉంటే ఏమో కానీ భోళా శంకర్ లాంటి పెద్ద మూవీ ముంగిట కావడం ఊహించని పరిణామమే. బ్రోకు ఎదురైనా పవన్ కళ్యాణ్ దాన్ని అంత సీరియస్ గా తీసుకోలేదు. ప్రత్యర్థుల మాటల దాడి అలవాటైపోయింది. సందర్భం చూసి దానికి బదులు ఘాటుగానే ఇస్తున్నారు. కానీ చిరంజీవి రాజకీయాల్లో లేరు. అన్నింటికి వివరణ ఇస్తూ ఉండలేరు. మౌనం వహిస్తారు కానీ ఫ్యాన్స్ అలా కాదుగా. సోషల్ మీడియాలో రెండు వర్గాల మధ్య దీని గురించిన చర్చ వేడిగానే ఉంది.
This post was last modified on August 9, 2023 9:20 am
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…
ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…
ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…