Movie News

రాంగ్ టైంలో టార్గెట్ అయిన చిరు

వాల్తేరు వీరయ్య రెండు వందల రోజుల వేడుకలో చిరంజీవి ప్రజా సమస్యలను పట్టించుకోమని, ఇండస్ట్రీని లక్ష్యంగా పెట్టుకోవద్దని చెప్పిన తీరు రివర్స్ లో ఆయన్నే ఏపీ అధికార పార్టీకి లక్ష్యంగా మారేలా చేసింది. ఒక్క పోలవరం తప్ప ఇంకే అంశం గురించి నేరుగా ఆంధ్రప్రదేశ్ అని కానీ సిఎం జగన్ మోహన్ రెడ్డి అని కానీ ప్రస్తావించని చిరు మాటలకు ప్రతిగా ఏకంగా మంత్రులు, ఎమ్మెల్యేలు కౌంటర్ ఎటాక్ మొదలు పెట్టారు. కొడాలి నాని, బొత్స సత్యనారాయణ, పేర్ని నాని తదితరులంతా ఒకప్పుడు చిరు మీద ఎంతో గౌరవం ప్రదర్శించిన వాళ్లే. ఇప్పుడు ఒక్కసారిగా విమర్శల దండకం అందుకుంటున్నారు.

నిజానికి చిరంజీవి దారుణమైన వ్యాఖ్యలు కానీ అభ్యంతరకర పదాలు కానీ వాడలేదు. కొంచెం సున్నితంగానే తన మనసులో మాట చెప్పారు. ఇంత ముప్పేట దాడి బహుశా ఊహించి ఉండరు. భోళా శంకర్ విడుదలను రెండు రోజుల్లో పెట్టుకుని ఇలా జరగడం వల్ల ఆ సినిమా మీద నెగటివ్ క్యాంపైన్ జరుగుతుందనే ఆందోళన అభిమానుల్లో కనిపిస్తోంది. ఒకవేళ డివైడ్ టాక్ వచ్చినా దాన్ని ప్రతికూలంగా వాడుకుంటారని టెన్షన్ పడుతున్నారు. ఇప్పటిదాకా స్పందించింది ఇద్దరు ముగ్గురు ప్రజా ప్రతినిధులే. గంటల వ్యవధిలో ఇది పదుల సంఖ్యకు చేరినా ఏ మాత్రం ఆశ్చర్యం లేదు.

ఒకవేళ మాములు టైంలో ఇలాంటిది జరిగి ఉంటే ఏమో కానీ భోళా శంకర్ లాంటి పెద్ద మూవీ ముంగిట కావడం ఊహించని పరిణామమే. బ్రోకు ఎదురైనా పవన్ కళ్యాణ్ దాన్ని అంత సీరియస్ గా తీసుకోలేదు. ప్రత్యర్థుల మాటల దాడి అలవాటైపోయింది. సందర్భం చూసి దానికి బదులు ఘాటుగానే ఇస్తున్నారు. కానీ చిరంజీవి రాజకీయాల్లో లేరు. అన్నింటికి వివరణ ఇస్తూ ఉండలేరు. మౌనం వహిస్తారు కానీ ఫ్యాన్స్ అలా కాదుగా. సోషల్ మీడియాలో రెండు వర్గాల మధ్య దీని గురించిన చర్చ వేడిగానే ఉంది.

This post was last modified on August 9, 2023 9:20 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మారిపోయిన దేవర విలన్

బాలీవుడ్ స్టార్లు ప్రైవేటు పెళ్లిళ్లకు వెళ్లి డ్యాన్సులు చేయడం ఎప్పట్నుంచో ఉన్న సంప్రదాయమే. అందుకోసం భారీగా పారితోషకాలు అందుకుంటూ ఉంటారు. షారుఖ్…

1 hour ago

‘ఫ్యామిలీ స్టార్’ను మరిచావా మృణాల్?

సినీ జనాలు తమ కెరీర్లో ఏదైనా పెద్ద డిజాస్టర్ ఎదురైనపుడు.. దాని గురించి తర్వాతి రోజుల్లో మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడరు.…

2 hours ago

లోక్‌స‌భ‌లో రచ్చ‌ జరిగినా ఆగని బిల్లు

పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాలు శుక్ర‌వారం(రేపు)తో ముగియ‌నున్నాయి. ఈ స‌మావేశాల్లో చివ‌రి రెండో రోజైన గురువారం రాజ‌కీయ వేడి లోక్‌స‌భ‌ను కుదిపేసింది.…

2 hours ago

శేష్ గోల్డ్ ఫిష్… ఈసారి ఎదురీదగలదా ?

రెండేళ్లు సిల్వర్ స్క్రీన్ గ్యాప్ తీసుకున్న అడవి శేష్ ఈసారి డెకాయిట్ గా రాబోతున్నాడు. టీజర్ ప్రామిసింగ్ గా అనిపించింది.…

3 hours ago

వల్లభనేని వంశీపై మరో కేసు

వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గన్నవరం టీడీపీ ఆఫీసుపై…

3 hours ago

‘మిరాయ్’తో వచ్చింది… వీటితో పోయింది

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటే వేరే వాళ్ల భాగస్వామ్యంలో లో బడ్జెట్ సినిమాలు తీసే నిర్మాణ సంస్థ. కానీ గత కొన్నేళ్లలో…

3 hours ago