Movie News

‘వేదాళం’ నాకే రాసిపెట్టుంది

ఒక సినిమా ఒక హీరోతో అనుకొని మరొక హీరోతో చేయడం చాలా సార్లు చూశాం.  ‘భోళా శంకర్’ కూడా అదే కోవలోకి వస్తుంది. అజిత్ హీరోగా తమిళ్ లో వచ్చిన ‘వేదళం’ సినిమాను నిర్మాత ఏ ఎం రత్నం తెలుగులో పవన్ కళ్యాణ్ తో ప్లాన్ చేసుకున్నారు. తమిళ దర్శకుడు KT నేసన్ ను పెట్టుకొని సినిమాను లాంచ్ చేశారు. పవన్ కూడా ముహూర్తంలో పాల్గొన్నాడు. కానీ కట్ చేస్తే పవన్ వేదాళం వదిలేసి మరో రీమేక్ ప్లాన్ చేసుకున్నాడు. 

అయితే ఈ రీమేక్ సినిమా తనకే రాసిపెట్టి ఉందని మెహర్ రమేష్ తాజాగా ఇంటర్వ్యూలో చెప్పుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చేయలేదు అనే రీజన్ తనకి తెలియదదు. కానీ చిరంజీవి గారితో ఈ రీమేక్ చేసి నేను కం బ్యాక్ అవ్వాలని ఉంది కాబట్టే పవన్ కళ్యాణ్ తో రత్నం గారు చేయాలని అనుకున్నా చేయలేకపోయారని చెప్పుకున్నాడు మెహర్.  వేదాళంలో అన్నీ అంశాలు సమపాలల్లో ఉన్నాయి. హీరోయిజం, కామెడీ , సిస్టర్ సెంటిమెంట్ , ఇలా చాలా ఉన్నాయని , కథ కొందరికి తెలిసినా నా స్టైల్ లో ఈ సినిమా చేశానంటూ చెప్పుకున్నాడు మెహర్. 

ఇక సినిమాలో సిస్టర్ కేరెక్టర్ కోసం ముందు నుండి కీర్తి సురేష్ నే అనుకున్నామని , ఆమెను కాంటాక్ట్ అవ్వడానికి నిర్మాత స్వప్న దత్ సహాయం తీసుకున్నాను, ఈ సందర్భంగా నేను సిస్టర్ గా భావించే స్వప్న కి థాంక్స్ చెప్పుకుంటున్నా,  స్వప్న సిస్టర్ ద్వారా సినిమాలో కీర్తి సిస్టర్ వచ్చిందని తెలిపాడు. ఈ రీమేక్ మీద ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు మెహర్. తనకి హిట్లు ఇచ్చిన రీమేక్ వర్క్ మళ్ళీ తనని ట్రాక్ లోకి తీసుకొస్తుందని నమ్ముతున్నాడు. మరి మెహర్ ఆశలు భోళా తీరుస్తుందేమో చూడాలి.

This post was last modified on August 8, 2023 6:18 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

6 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

8 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

9 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

9 hours ago

చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?

రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…

10 hours ago

పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!

వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…

12 hours ago