Movie News

‘వేదాళం’ నాకే రాసిపెట్టుంది

ఒక సినిమా ఒక హీరోతో అనుకొని మరొక హీరోతో చేయడం చాలా సార్లు చూశాం.  ‘భోళా శంకర్’ కూడా అదే కోవలోకి వస్తుంది. అజిత్ హీరోగా తమిళ్ లో వచ్చిన ‘వేదళం’ సినిమాను నిర్మాత ఏ ఎం రత్నం తెలుగులో పవన్ కళ్యాణ్ తో ప్లాన్ చేసుకున్నారు. తమిళ దర్శకుడు KT నేసన్ ను పెట్టుకొని సినిమాను లాంచ్ చేశారు. పవన్ కూడా ముహూర్తంలో పాల్గొన్నాడు. కానీ కట్ చేస్తే పవన్ వేదాళం వదిలేసి మరో రీమేక్ ప్లాన్ చేసుకున్నాడు. 

అయితే ఈ రీమేక్ సినిమా తనకే రాసిపెట్టి ఉందని మెహర్ రమేష్ తాజాగా ఇంటర్వ్యూలో చెప్పుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చేయలేదు అనే రీజన్ తనకి తెలియదదు. కానీ చిరంజీవి గారితో ఈ రీమేక్ చేసి నేను కం బ్యాక్ అవ్వాలని ఉంది కాబట్టే పవన్ కళ్యాణ్ తో రత్నం గారు చేయాలని అనుకున్నా చేయలేకపోయారని చెప్పుకున్నాడు మెహర్.  వేదాళంలో అన్నీ అంశాలు సమపాలల్లో ఉన్నాయి. హీరోయిజం, కామెడీ , సిస్టర్ సెంటిమెంట్ , ఇలా చాలా ఉన్నాయని , కథ కొందరికి తెలిసినా నా స్టైల్ లో ఈ సినిమా చేశానంటూ చెప్పుకున్నాడు మెహర్. 

ఇక సినిమాలో సిస్టర్ కేరెక్టర్ కోసం ముందు నుండి కీర్తి సురేష్ నే అనుకున్నామని , ఆమెను కాంటాక్ట్ అవ్వడానికి నిర్మాత స్వప్న దత్ సహాయం తీసుకున్నాను, ఈ సందర్భంగా నేను సిస్టర్ గా భావించే స్వప్న కి థాంక్స్ చెప్పుకుంటున్నా,  స్వప్న సిస్టర్ ద్వారా సినిమాలో కీర్తి సిస్టర్ వచ్చిందని తెలిపాడు. ఈ రీమేక్ మీద ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు మెహర్. తనకి హిట్లు ఇచ్చిన రీమేక్ వర్క్ మళ్ళీ తనని ట్రాక్ లోకి తీసుకొస్తుందని నమ్ముతున్నాడు. మరి మెహర్ ఆశలు భోళా తీరుస్తుందేమో చూడాలి.

This post was last modified on August 8, 2023 6:18 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

రేపే ర‌ణ‌భేరి.. ‘గాంధీ’ల ప‌రువు ద‌క్కుతుందా?

దేశంలో జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఐదో ద‌శ పోలింగ్ సోమ‌వారం ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభం కానుంది. మొత్తం 6…

1 min ago

తేనెతుట్టెను గెలుకుతున్న రేవంత్ !

లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే తెలంగాణలో ఉన్న 33 జిల్లాలను 17 జిల్లాలకు కుదిస్తారని వస్తున్న వార్తలు…

1 hour ago

సేఫ్ గేమ్ ఆడుతున్న ఆర్ఆర్ఆర్ నిర్మాత

ఇండస్ట్రీలో సుదీర్ఘ అనుభవంతో ఎన్నో బ్లాక్ బస్టర్లు చూసిన డివివి దానయ్య సగటు మాములు ప్రేక్షకుడికి బాగా దగ్గరయ్యింది మాత్రం…

2 hours ago

మాజీ ప్ర‌ధాని మ‌న‌వ‌డి కోసం… బ్లూ కార్నర్ నోటీసు!

భార‌త దేశ చ‌రిత్ర‌లో ఇదోక అనూహ్య‌మైన.. అస‌హ్యించుకునే ఘ‌ట‌న‌. ఈ దేశాన్ని పాలించి, రైతుల మ‌న్న‌న‌లు, మ‌హిళ‌ల మ‌న్న‌న‌లు పొందిన…

2 hours ago

జ‌గ‌న్.. నీరో : జేడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఏపీ సీఎం జ‌గ‌న్‌.. నీరో చ‌క్ర‌వ‌ర్తిని త‌ల‌పిస్తున్నారంటూ.. సీబీఐ మాజీ డైరెక్ట‌ర్ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ సంచ ల‌న వ్యాఖ్య‌లు చేశారు.…

3 hours ago

ఐపీఎల్ ప్లే ఆఫ్స్ లో ఆర్సీబీ..కప్ కొడతారా?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో అత్యంత దురదృష్టకరమైన జట్టు పేరు చెప్పమని అడిగితే…ఠపీమని ఆర్సీబీ పేరు చెప్పేస్తారు క్రికెట్…

4 hours ago