శతమానం భవతి.. టాలీవుడ్లో అన్ని వర్గాల ప్రేక్షకులూ మెచ్చిన కుటుంబ కథా చిత్రాల్లో ఇదొకటి. ఒకప్పుడు దిల్ రాజు సంస్థ నుంచి వచ్చిన ‘బొమ్మరిల్లు’ ఎలా అయితే ఫ్యామిలీస్ను పెద్ద ఎత్తున థియేటర్లకు రప్పించిందో.. ఆయన ప్రొడక్షన్లోనే వచ్చిన ‘శతమానం భవతి’ చిత్రం కూడాా కుటుంబ ప్రేక్షకులతో థియేటర్లను కళకళలాడించింది. 2017 సంక్రాంతికి ఖైదీ నంబర్ 150, గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి భారీ చిత్రాల పోటీని తట్టుకుని అప్పట్లోనే రూ.35 కోట్ల షేర్ సాధించిన సినిమా ఇది. ‘శతమానం భవతి’ తర్వాత దర్శకుడు సతీష్ వేగేశ్న మీద భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.
కానీ ‘శ్రీనివాస కళ్యాణం’, ‘ఎంత మంచివాడవురా’ చిత్రాలతో నిరాశ పరిచిన సతీష్ మీద ప్రేక్షకులకు నమ్మకం పోయింది. వరుసగా రెండు ఫెయిల్యూర్లకు తోడు కొత్తగా మొదలుపెట్టిన సినిమాలు కూడా ముందుకు కదలక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు సతీష్. ఆల్రెడీ శ్రీహరి కొడుకుని, తన కొడుకుని హీరోలుగా పరిచయం చేస్తూ సతీష్ తీసిన ‘కోతి కొమ్మచ్చి’ షూటింగ్ పూర్తి చేసుకుని కూడా విడుదలకు నోచుకోకుండా ఆగిపోయింది.
దీని తర్వాత ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ అనే సినిమా మొదలుపెడితే దానికి మధ్యలో బ్రేక్ పడింది. నితిన్ ఈ మధ్యే ఇంకో కొత్త సినిమా ఏదో మొదలుపెట్టాడు. సతీష్తో చేస్తున్న సినిమా సంగతి అతీ గతీ లేకుండా పోయింది. ఈ రెండు చిత్రాల సంగతి తేల్చకుండా కొత్తగా ‘కథాకేళి’ అంటూ మరో కొత్త సినిమాను మొదలుపెట్టాడు సతీష్. తనకు మంచి పేరు, డిమాండ్ తెచ్చిపెట్టిన ‘శతమానం భవతి’ సినిమా పేరుతోనే బేనర్ మొదలుపెట్టి అందులోనే ‘కథాకేళి’ సినిమా చేస్తున్నాడు.
ఇందులో అందరూ కొత్త వాళ్లే నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ప్రమోషన్ల కోసం దిల్ రాజు, హరీష్ శంకర్ లాంటి వాళ్లను పిలిపించుకుని సినిమా గురించి మంచి మాటలు చెప్పించాడు సతీష్. ఈ సందర్భంగానే కోతికొమ్మచ్చి, శ్రీశ్రీశ్రీ రాజావారు సినిమాలు ఆలస్యమవుతున్న విషయం కూడా చెప్పాడు. మరి ఆ సినిమాల సంగతేమవుతుందో.. ‘కథాకేళి’ని అయినా సతీష్ విజయవంతంగా బయటికి తీసుకొస్తాడో లేదో చూడాలి.
This post was last modified on August 8, 2023 10:48 am
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో లిక్కర్ కుంభకోణం మళ్ళీ తెరపైకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో నాశిరకం మద్యం వ్యాపారాన్ని…
``కాంగ్రెస్ పార్టీలో నేనైనా ఆమె అయినా ఒక్కటే. పార్టీ క్రమశిక్షణ విషయంలో అందరూ సమానమే. ఎవరు ఏం చేశారన్నది పార్టీ…
ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్రతిపార్టీలోనూ ఇబ్బందులు వస్తే.. ప్రతిపార్టీపైనా…
‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…
వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…
మలయాళంలో రీసెంట్ గా విడుదలైన బెత్లేహెమ్ కుటుంబ యూనిట్ కేరళలో ఘనవిజయం సాధించింది. విశ్వనాథ్ అండ్ సన్స్ తరహాలో హీరోయిన్…