శతమానం భవతి.. టాలీవుడ్లో అన్ని వర్గాల ప్రేక్షకులూ మెచ్చిన కుటుంబ కథా చిత్రాల్లో ఇదొకటి. ఒకప్పుడు దిల్ రాజు సంస్థ నుంచి వచ్చిన ‘బొమ్మరిల్లు’ ఎలా అయితే ఫ్యామిలీస్ను పెద్ద ఎత్తున థియేటర్లకు రప్పించిందో.. ఆయన ప్రొడక్షన్లోనే వచ్చిన ‘శతమానం భవతి’ చిత్రం కూడాా కుటుంబ ప్రేక్షకులతో థియేటర్లను కళకళలాడించింది. 2017 సంక్రాంతికి ఖైదీ నంబర్ 150, గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి భారీ చిత్రాల పోటీని తట్టుకుని అప్పట్లోనే రూ.35 కోట్ల షేర్ సాధించిన సినిమా ఇది. ‘శతమానం భవతి’ తర్వాత దర్శకుడు సతీష్ వేగేశ్న మీద భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.
కానీ ‘శ్రీనివాస కళ్యాణం’, ‘ఎంత మంచివాడవురా’ చిత్రాలతో నిరాశ పరిచిన సతీష్ మీద ప్రేక్షకులకు నమ్మకం పోయింది. వరుసగా రెండు ఫెయిల్యూర్లకు తోడు కొత్తగా మొదలుపెట్టిన సినిమాలు కూడా ముందుకు కదలక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు సతీష్. ఆల్రెడీ శ్రీహరి కొడుకుని, తన కొడుకుని హీరోలుగా పరిచయం చేస్తూ సతీష్ తీసిన ‘కోతి కొమ్మచ్చి’ షూటింగ్ పూర్తి చేసుకుని కూడా విడుదలకు నోచుకోకుండా ఆగిపోయింది.
దీని తర్వాత ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ అనే సినిమా మొదలుపెడితే దానికి మధ్యలో బ్రేక్ పడింది. నితిన్ ఈ మధ్యే ఇంకో కొత్త సినిమా ఏదో మొదలుపెట్టాడు. సతీష్తో చేస్తున్న సినిమా సంగతి అతీ గతీ లేకుండా పోయింది. ఈ రెండు చిత్రాల సంగతి తేల్చకుండా కొత్తగా ‘కథాకేళి’ అంటూ మరో కొత్త సినిమాను మొదలుపెట్టాడు సతీష్. తనకు మంచి పేరు, డిమాండ్ తెచ్చిపెట్టిన ‘శతమానం భవతి’ సినిమా పేరుతోనే బేనర్ మొదలుపెట్టి అందులోనే ‘కథాకేళి’ సినిమా చేస్తున్నాడు.
ఇందులో అందరూ కొత్త వాళ్లే నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ప్రమోషన్ల కోసం దిల్ రాజు, హరీష్ శంకర్ లాంటి వాళ్లను పిలిపించుకుని సినిమా గురించి మంచి మాటలు చెప్పించాడు సతీష్. ఈ సందర్భంగానే కోతికొమ్మచ్చి, శ్రీశ్రీశ్రీ రాజావారు సినిమాలు ఆలస్యమవుతున్న విషయం కూడా చెప్పాడు. మరి ఆ సినిమాల సంగతేమవుతుందో.. ‘కథాకేళి’ని అయినా సతీష్ విజయవంతంగా బయటికి తీసుకొస్తాడో లేదో చూడాలి.
This post was last modified on August 8, 2023 10:48 am
ప్రతి దర్శకుడూ తన అరంగేట్ర చిత్రంతోనే తన స్టైల్ ఏంటో, మున్ముందు ఎలాంటి సినిమాలు తీయబోతున్నానో ఒక సంకేతం ఇచ్చేస్తాడు. తొలి సినిమాను…
ఒకప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోగా సుమంత్ కు మంచి ఫాలోయింగ్ ఉండేది. సత్యం, గౌరీ, గోదావరి లాంటి…
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…