అల్లు శిరీష్ ఈ మధ్య సినిమాయేతర విషయంతో వార్తల్లోకి వచ్చాడు. ఏడాదికి పైగా ఏ సినిమా చేయకుండా ఖాళీగా ఉన్న శిరీష్.. ఈ మధ్య దేశంలో చైనా వ్యతిరేక ఉద్యమం ఊపందుకున్న నేపథ్యంలో అల్లు శిరీష్.. దేశీయ ఉత్పత్తుల వాడకం గురించి జనాల్లో ఒక మూమెంట్ తీసుకురావడం మీద దృష్టిసారించాడు.
పూర్తిగా చైనా, ఇతర దేశఆల ఉత్పత్తులను నివారించడం సాధ్యం కాదని చెబుతూనే.. సాధ్యమైనంతగా వాటిని తగ్గించి, దేశీయ ఉత్పత్తులు వినియోగించాల్సిన అవసరాన్ని శిరీష్ నొక్కి చెబుతున్నాడు. పతంజలి పేస్ట్ సహా తాను వాడుతున్న భారతీయ ఉత్పత్తుల వివరాలను వెల్లడించాడు. దీని మీద శిరీష్ అన్నయ్య అల్లు అర్జున్ సైతం ఒక ట్వీట్ వేసి తమ్ముడిని ప్రోత్సహించిన సంగతి తెలిసిందే.
ఐతే దీని మీద సోషల్ మీడియాలో జనాలు వేసే కౌంటర్లు, పేల్చే జోకుల గురించి ఓ ఇంటర్వ్యూలో శిరీష్ దగ్గర ప్రస్తావిస్తే.. దాని గురించి తనకు తెలుసన్నాడు. ఈ విషయంలో తనను చాలామంది కామెడీ చేశారని చెప్పాడు. సోషల్ మీడియా జనాల వరకు ఎందుకు.. తన స్నేహితులకు దేశీయ ఉత్పత్తుల వాడకం అవసరాన్ని చెబితే వాళ్లు కూడా తనను తమాషా చేశారని.. కానీ వాళ్లకు అర్థమయ్యేలా చెబితే వాళ్లూ సాధ్యమైనంతగా దేశీయ ఉత్పత్తులు వాడే ప్రయత్నం చేస్తున్నారని.. ఇలా అందరూ కదిలితే మన ఎకానమీకి ప్రయోజనం చేకూరుతుందని అతనన్నాడు.
తాను వాడుతున్న దేశీయ ఉత్పత్తుల గురించి ట్వీట్ చేయమని తానేమీ బన్నీని కోరలేదని.. తన వదిన స్నేహకు ఫొటో పంపితే అది చూసి బన్నీ తనకు తానుగా ట్వీట్ చేశాడని.. అతను ఊరికే దేన్ని పడితే దాన్ని ప్రమోట్ చేయడని శిరీష్ అన్నాడు. ఇక సినీ కెరీర్ విషయానికి వస్తే.. తాను రెండు సినిమాల్లో నటించబోతున్నట్లు అతను వెల్లడించాడు.
This post was last modified on August 20, 2020 3:19 pm
అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ హీరోగా స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రూపొందించిన ‘ఏజెంట్’ టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద…
ఒక సినిమా రిలీజైన రెండు మూడేళ్ల తర్వాత కూడా దాని కలెక్షన్ల గురించి విపరీతమైన చర్చ జరగడం అరుదు. ‘దేవర’ విషయంలో ఇదే…
కేంద్ర విద్యా శాఖకు నూతన మంత్రిగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్న ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు.…
బాక్సాఫీస్ దగ్గర పోటీ ఉన్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతాయి. ఇది అలాంటిదే. కేవలం ఒక్క రోజు గ్యాప్ తో…
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న స్పైడర్ మ్యాన్ సిరీస్ లోని కొత్త సినిమా బ్రాండ్ న్యూ డే జూలై…
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ కొత్త లాజిక్ మాట్లాడుతున్నారు. నైతిక బాధ్యత వహిస్తూ…