అల్లు శిరీష్ ఈ మధ్య సినిమాయేతర విషయంతో వార్తల్లోకి వచ్చాడు. ఏడాదికి పైగా ఏ సినిమా చేయకుండా ఖాళీగా ఉన్న శిరీష్.. ఈ మధ్య దేశంలో చైనా వ్యతిరేక ఉద్యమం ఊపందుకున్న నేపథ్యంలో అల్లు శిరీష్.. దేశీయ ఉత్పత్తుల వాడకం గురించి జనాల్లో ఒక మూమెంట్ తీసుకురావడం మీద దృష్టిసారించాడు.
పూర్తిగా చైనా, ఇతర దేశఆల ఉత్పత్తులను నివారించడం సాధ్యం కాదని చెబుతూనే.. సాధ్యమైనంతగా వాటిని తగ్గించి, దేశీయ ఉత్పత్తులు వినియోగించాల్సిన అవసరాన్ని శిరీష్ నొక్కి చెబుతున్నాడు. పతంజలి పేస్ట్ సహా తాను వాడుతున్న భారతీయ ఉత్పత్తుల వివరాలను వెల్లడించాడు. దీని మీద శిరీష్ అన్నయ్య అల్లు అర్జున్ సైతం ఒక ట్వీట్ వేసి తమ్ముడిని ప్రోత్సహించిన సంగతి తెలిసిందే.
ఐతే దీని మీద సోషల్ మీడియాలో జనాలు వేసే కౌంటర్లు, పేల్చే జోకుల గురించి ఓ ఇంటర్వ్యూలో శిరీష్ దగ్గర ప్రస్తావిస్తే.. దాని గురించి తనకు తెలుసన్నాడు. ఈ విషయంలో తనను చాలామంది కామెడీ చేశారని చెప్పాడు. సోషల్ మీడియా జనాల వరకు ఎందుకు.. తన స్నేహితులకు దేశీయ ఉత్పత్తుల వాడకం అవసరాన్ని చెబితే వాళ్లు కూడా తనను తమాషా చేశారని.. కానీ వాళ్లకు అర్థమయ్యేలా చెబితే వాళ్లూ సాధ్యమైనంతగా దేశీయ ఉత్పత్తులు వాడే ప్రయత్నం చేస్తున్నారని.. ఇలా అందరూ కదిలితే మన ఎకానమీకి ప్రయోజనం చేకూరుతుందని అతనన్నాడు.
తాను వాడుతున్న దేశీయ ఉత్పత్తుల గురించి ట్వీట్ చేయమని తానేమీ బన్నీని కోరలేదని.. తన వదిన స్నేహకు ఫొటో పంపితే అది చూసి బన్నీ తనకు తానుగా ట్వీట్ చేశాడని.. అతను ఊరికే దేన్ని పడితే దాన్ని ప్రమోట్ చేయడని శిరీష్ అన్నాడు. ఇక సినీ కెరీర్ విషయానికి వస్తే.. తాను రెండు సినిమాల్లో నటించబోతున్నట్లు అతను వెల్లడించాడు.
This post was last modified on August 20, 2020 3:19 pm
తమిళగ వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖరారైంది. ఆరు రోజులుగా ట్విస్టులతో సాగిన రాజకీయ…
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…