ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న మోస్ట్ వాంటెడ్ మూవీస్లో ‘పుష్ప-2’ ఒకటి. 2021చివర్లో విడుదలై పాన్ ఇండియా స్థాయిలో పెద్ద హిట్టయిన ‘పుష్ప’ చిత్రానికి సుకుమార్ అండ్ టీం కొనసాగింపుగా తీస్తున్న సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. ముందు అనుకున్న ప్రణాళిక ప్రకారం అయితే ‘పుష్ప-1’ రిలీజైన ఏడాదికే ఈ సినిమా కూడా రావాల్సింది. కానీ రెండేళ్ల తర్వాత కూడా ఇది వచ్చేలా లేదు.
షూట్ మొదలవడంలోనే చాలా ఆలస్యం అయింది. షూట్ మొదలయ్యాక కూడా అనుకున్నంత వేగంగా పని సాగట్లేదు. సుక్కు ఎప్పట్లాగే సన్నివేశాలను చెక్కుతూ ఉన్నాడని.. మధ్య మధ్యలో బ్రేక్స్ తప్పట్లేదని.. అందుకే రిలీజ్ కూడా చాలా ఆలస్యం అయ్యేలా ఉందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ మధ్య సినిమా నుంచి ఏ అప్డేట్ కూడా లేకపోవడంతో అల్లు అర్జున్ అభిమానులు ఫీలైపోయి నెగెటివ్ హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ చేశారు.
ఇదిలా ఉంటే ‘పుష్ప-2’ వచ్చే ఏడాది వేసవికి రిలీజైపోతుందంటూ ఒక ప్రచారం నడుస్తోంది. ఏప్రిల్లోనే విడుదల అంటూ డిస్కషన్లు కూడా పెట్టేస్తున్నారు బన్నీ ఫ్యాన్స్. కానీ చిత్ర వర్గాల నుంచి విశ్వసనీయ సమాచారం ప్రకారం వచ్చే వేసవికి కూడా ‘పుష్ప-2’ రిలీజ్ కావడం సందేహమేనట. ఇప్పటిదాకా జరిగిన షూట్ 30 శాతమేనట.
ఈ ఏడాది చివరికి 60 శాతం షూటింగ్ అయితే గొప్ప అంటున్నాయి చిత్ర వర్గాలు. ఇంకా మేజర్ సీక్వెన్సులన్నీ పెండింగ్లోనే ఉన్నాయి. సుకుమార్ పర్ఫెక్షన్ కోసం ఎంత తపిస్తాడో అందరికీ తెలుసు. కాబట్టి వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ‘పుష్ప-2’ రిలీజయ్యే అవకాశాలు దాదాపు లేవని సమాచారం. వచ్చే దసరా టైంకి అయితే ఆశలు పెట్టుకోవచ్చని అంటున్నారు. ప్రస్తుతం షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకున్న టీం పాటల పనిలో బిజీగా ఉంది. ట్యూన్స్ రెడీ చేసుకుని.. సాంగ్స్ షూట్కు ప్రణాళికలు రచిస్తున్నారట.
This post was last modified on August 6, 2023 11:06 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…