ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న మోస్ట్ వాంటెడ్ మూవీస్లో ‘పుష్ప-2’ ఒకటి. 2021చివర్లో విడుదలై పాన్ ఇండియా స్థాయిలో పెద్ద హిట్టయిన ‘పుష్ప’ చిత్రానికి సుకుమార్ అండ్ టీం కొనసాగింపుగా తీస్తున్న సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. ముందు అనుకున్న ప్రణాళిక ప్రకారం అయితే ‘పుష్ప-1’ రిలీజైన ఏడాదికే ఈ సినిమా కూడా రావాల్సింది. కానీ రెండేళ్ల తర్వాత కూడా ఇది వచ్చేలా లేదు.
షూట్ మొదలవడంలోనే చాలా ఆలస్యం అయింది. షూట్ మొదలయ్యాక కూడా అనుకున్నంత వేగంగా పని సాగట్లేదు. సుక్కు ఎప్పట్లాగే సన్నివేశాలను చెక్కుతూ ఉన్నాడని.. మధ్య మధ్యలో బ్రేక్స్ తప్పట్లేదని.. అందుకే రిలీజ్ కూడా చాలా ఆలస్యం అయ్యేలా ఉందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ మధ్య సినిమా నుంచి ఏ అప్డేట్ కూడా లేకపోవడంతో అల్లు అర్జున్ అభిమానులు ఫీలైపోయి నెగెటివ్ హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ చేశారు.
ఇదిలా ఉంటే ‘పుష్ప-2’ వచ్చే ఏడాది వేసవికి రిలీజైపోతుందంటూ ఒక ప్రచారం నడుస్తోంది. ఏప్రిల్లోనే విడుదల అంటూ డిస్కషన్లు కూడా పెట్టేస్తున్నారు బన్నీ ఫ్యాన్స్. కానీ చిత్ర వర్గాల నుంచి విశ్వసనీయ సమాచారం ప్రకారం వచ్చే వేసవికి కూడా ‘పుష్ప-2’ రిలీజ్ కావడం సందేహమేనట. ఇప్పటిదాకా జరిగిన షూట్ 30 శాతమేనట.
ఈ ఏడాది చివరికి 60 శాతం షూటింగ్ అయితే గొప్ప అంటున్నాయి చిత్ర వర్గాలు. ఇంకా మేజర్ సీక్వెన్సులన్నీ పెండింగ్లోనే ఉన్నాయి. సుకుమార్ పర్ఫెక్షన్ కోసం ఎంత తపిస్తాడో అందరికీ తెలుసు. కాబట్టి వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ‘పుష్ప-2’ రిలీజయ్యే అవకాశాలు దాదాపు లేవని సమాచారం. వచ్చే దసరా టైంకి అయితే ఆశలు పెట్టుకోవచ్చని అంటున్నారు. ప్రస్తుతం షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకున్న టీం పాటల పనిలో బిజీగా ఉంది. ట్యూన్స్ రెడీ చేసుకుని.. సాంగ్స్ షూట్కు ప్రణాళికలు రచిస్తున్నారట.
This post was last modified on August 6, 2023 11:06 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…