గత వారం విడుదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ‘బ్రో’ వీకెండ్ వరకు మంచి జోరే చూపించింది. లో బజ్, డివైడ్ టాక్ను తట్టుకుని కూడా ఈ చిత్రం తొలి వీకెండ్లో రూ.100 కోట్లకు చేరువగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. కానీ వీకెండ్ తర్వాత ‘బ్రో’ వసూళ్లు ఒక్కసారిగా డ్రాప్ అయ్యాయి. సోమవారానికి ఎలాంటి సినిమాకైనా డ్రాప్ మామూలే కానీ.. ‘బ్రో’ డ్రాప్ మాత్రం మరీ ఎక్కువగా ఉండటంతో డిస్ట్రిబ్యూటర్లు కంగారు పడిపోయారు. తర్వాత రెండు మూడు రోజుల్లో కూడా వసూళ్లు పెద్దగా పుంజుకోలేదు.
కానీ వీకెండ్లో ‘బ్రో’ బాక్సాఫీస్ రన్ ఆశాజనకంగానే సాగింది. ఈ వారం చెప్పుకోదగ్గ కొత్త రిలీజ్లు ఏవీ లేకపోవడం ఈ చిత్రానికి కలిసొచ్చింది. ‘బేబి’ సినిమాకు కూడా మంచి ఆక్యుపెన్సీలు కనిపించాయి. శనివారం ‘బ్రో’కు కొన్ని మల్టీప్లెక్స్ స్క్రీన్లలో హౌస్ ఫుల్స్ కూడా పడ్డాయి. సోమవారం కూడా బుకింగ్స్ పర్వాలేదు. ఐతే ‘బ్రో’ పట్ల ప్రేక్షకులను ఆకర్షించడానికి చిత్ర బృందమే పెద్దగా ప్రయత్నిస్తున్నట్లు కనిపించడం లేదు. ఏపీ మంత్రి అంబటి రాంబాబు చేసిన గొడవ వల్ల ‘బ్రో’ గురించి మీడియాలో, సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయే తప్ప.. చిత్ర బృందం మాత్రం పబ్లిసిటీ మీద పెద్దగా దృష్టిపెట్టలేదు.
సాయిధరమ్ తేజ్ ఏదో కొంచెం కష్టపడి తిరుగుతున్నాడే తప్ప.. మిగతా టీం నుంచి స్పందన కరవైంది. పవన్ కళ్యాణ్ వచ్చి సినిమాను ప్రమోట్ చేయడని అందరికీ తెలుసు కానీ.. వేరే ప్రమోషనల్ ఈవెంట్లు ఏవైనా చేస్తే బాగుండేదని.. సోషల్ మీడియాలో, మీడియాలో కూడా పెద్దగా పబ్లిసిటీ చేయకుండా సినిమాను అలా వదిలిపెట్టేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘బేబి’ అనే చిన్న సినిమాను ప్రమోట్ చేసిన తీరు చూసి అయినా ‘బ్రో’ టీం కొంచెం పాఠాలు నేర్వాల్సింది. ఏదేమైనా ఈ వీకెండ్ తర్వాత ‘బ్రో’ నుంచి పెద్దగా షేర్ ఆశించడానికి లేదన్నది స్పష్టం. ఆదివారంతో రన్ దాదాపుగా పూర్తయినట్లే.
This post was last modified on August 6, 2023 11:15 am
సుధీర్ బాబు గంపెడాశలు పెట్టుకున్న హరోంహర విడుదల వాయిదా పడింది. మే 31 నుంచి జూన్ 14కి వెళ్తున్నట్టు అధికారికంగా…
నాలుగేళ్ల క్రితం చేసిన రక్షణ అనే సినిమా నిర్మాతలు ప్రమోషన్ కోసం తనను వేధిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేస్తూ హీరోయిన్…
రాజకీయాల్లో అన్ని వేళలా పంతమే పనికిరాదు. ఒక్కొక్కసారి పట్టు విడుపులు కూడా ముఖ్యమే. ఈ విషయంలో నాయకులు, పార్టీలు కూడా..…
హనుమాన్ రూపంలో 2024లోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు ప్రశాంత్ వర్మ బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్…
ఆంధ్రప్రదేశ్లోని కొంతమంది అధికారులు, పోలీసు ఆఫీసర్లకు రెడ్బుక్ భయం పట్టుకుందనే చర్చ హాట్టాపిక్గా మారింది. ఇన్ని రోజులు అధికార వైసీపీ…
హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో ఉన్న రవాణశాఖ అధికారి కార్యాలయం జాక్ పాట్ కొట్టింది. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి ఒక…