ఇంకో ఆరు రోజుల్లో విడుదల కాబోతున్న భోళా శంకర్ త్వరగానే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెట్టుకుంది. హైదరాబాద్ లాంటి ప్రధాన కేంద్రాల ఆన్ లైన్ టికెట్స్ బుక్ మై షోలో పెట్టేశారు. మరీ హాట్ కేక్స్ లా కాదు కానీ క్రమంగా ఊపందుకునేలా ఉన్నాయి. అంచనాల విషయంలో కొంత వెనుకబడిన మాట వాస్తవం. రేపు సాయంత్రం శిల్పా కళావేదికలో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ తో హైప్ కి కొంత ఊపొస్తుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ప్రత్యేకంగా అతిథులు ఎవరూ ఉండకపోవచ్చని టాక్. రామ్ చరణ్ రావొచ్చనే ప్రచారం ఉంది కానీ చివరి నిమిషం దాకా చెప్పలేం.
ఇక కంటెంట్ విషయానికి వస్తే భోళా శంకర్ తమిళ హిట్ వేదాళం రీమేకన్న సంగతి సగటు ప్రేక్షకులకు తెలిసిందే. సిస్టర్ సెంటిమెంట్ తో రొటీన్ మాఫియా రివెంజ్ బ్యాక్ డ్రాప్ లోనే సాగుతుంది. అయితే కీలకమైన విశ్రాంతి ఎపిసోడ్ ఒరిజినల్ వెర్షన్ సక్సెస్ లో చాలా కీలక పాత్ర పోషించింది. విదేశాల్లో ఉన్న విలన్ ని కవ్వించి ఇండియాకు వచ్చేలా చేసి, మొదటిసారి కలుసుకున్నప్పుడు ముందు అమాయకంగా నటించి తర్వాత క్రూరంగా నవ్వే సీన్ ని అజిత్ అద్భుతంగా పండించాడు. ఇప్పటికీ సోషల్ మీడియాలో దీని గురించి ప్రస్తావన తరచుగా వస్తూనే ఉంటుంది.
దీన్ని మెహర్ రమేష్ ఎలా రీ క్రియేట్ చేశాడు, చిరంజీవి ఎలాంటి ఎక్స్ ప్రెషన్లు ఇచ్చి పండించారనేది కీలకంగా మారనుంది. ఏ మాత్రం తేడా వచ్చినా ట్విట్టర్ లో పెద్ద ట్రోలింగ్ మెటీరియల్ అయిపోతుంది. గాడ్ ఫాదర్ టైంలో ఇలాగే పోలీస్ ఆఫీసర్ గుండెల మీద కాలు పెట్టే సన్నివేశం గురించి పెద్ద ఎత్తున ట్వీట్ల క్యాంపైన్ జరిగింది. కానీ ఇది అంతకన్నా క్లిష్టమైన ఎపిసోడ్. మరి మెహర్ చిరులు ఈ ఒక్క పోలికను విజయవంతంగా నెగ్గుకొస్తే మిగిలిన కమర్షియల్ మసాలా రొటీన్ గా ఉన్నా పాస్ అయిపోవచ్చు. మహతిస్వర సాగర్ నేపధ్య సంగీతం మీద కూడా పెద్ద బరువే ఉంది. చూద్దాం.
This post was last modified on August 5, 2023 1:29 pm
బాలీవుడ్లో మంచి పేరున్న హీరోయిన్లు తెలుగులో సినిమాలు చేయడం కొత్తేమీ కాదు. కానీ హిందీలో స్టార్ స్టేటస్ సంపాదించాక, తెలుగులో…
గత వారం విడుదలైన కెజెక్యూ మీద పరిశ్రమలో ప్రత్యేకమైన సానుభూతి ఉండేది. దర్శకుడు కెకె దీని షూటింగ్ పూర్తవ్వడానికి దగ్గరగా…
వైసీపీ హయాంలో జరిగిన ఘటనలపై కేసులు కొనసాగుతున్నాయి. అనేక మంది నాయకులపై కేసులు నమోదై... ప్రస్తుతం విచారణ దశలో ఉన్నాయి.…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనకు వస్తున్నారంటే చాలు.. కర్నూలు జిల్లా ఆలూరులో వ్యాపారులు ముందుగానే తమ దుకాణాలు మూసివేయడం…
ఏపీ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు సోమవారం(ఆగస్టు 17) నుంచి ప్రారంభం అవుతున్నాయి. అసెంబ్లీకి వైసీపీ నాయకులు ఎలానూ రావడం…
హైదరాబాద్ ఈగల్ పోలీసులకు గంజాయి ముఠా చుక్కలు చూపించింది. పక్కా సమాచారంతో పట్టుకునేందుకు వెళ్లిన ఈగల్ పోలీసులపై తిరగబడిన గంజాయి…