మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘భోళా శంకర్’ విషయంలో మెగా అభిమానులే ముందు నుంచి అంత సంతృప్తిగా లేరన్నది వాస్తవం. ఈ రోజుల్లో రీమేక్ సినిమాలనగానే సగం ఆసక్తి చచ్చిపోతోంది. వాటి బిజినెస్, రెవెన్యూస్ కూడా అందుకు తగ్గట్లే ఉంటున్నాయి. అందులోనూ ‘వేదాలం’ లాంటి సగటు మాస్ సినిమాను చిరు రీమేక్ కోసం ఎంచుకోవడం.. పైగా శక్తి, షాడో లాంటి ఆల్ టైం డిజాస్టర్లు ఇచ్చి.. పదేళ్లుగా సినిమాలు తీయని మెహర్ రమేష్ చేతికి ఈ ప్రాజెక్టును అప్పగించడంతో ‘భోళా శంకర్’పై అంచనాలు మరింత తగ్గిపోయాయి.
ఈ సినిమా ప్రోమోలు కూడా అంతంతమాత్రంగానే కనిపించాయి. ఐతే ఎన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ మెగాస్టార్ చరిష్మా, మాస్లో ఆయనకున్న ఆకర్షణ సినిమాను బాక్సాఫీస్ తీరం దాటించేస్తాయన్న ధీమాతో చిత్ర బృందం ఉంది. ‘వాల్తేరు వీరయ్య’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చిరు నుంచి వస్తున్ సినిమా కావడం కూడా కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు.
ఇక ‘భోళా శంకర్’కు ఎలాంటి టాక్ వస్తుంది.. రివ్యూలు ఎలా ఉంటాయనే విషయంలో ఎవరిలోనూ పెద్దగా ఉత్కంఠ లేదు. టీజర్, ట్రైలర్ చూసినపుడే చాలామందికి ఇదొక రొటీన్ మాస్ మసాలా సినిమా అనే విషయం అర్థమైపోయింది. ఈ రోజుల్లో ఇలాంటి సినిమాను క్రిటిక్స్ ఏ దృష్టితో చూస్తారో కూడా తెలుసు. అందుకే మెగా అభిమానుల్లోనే కొందరు.. రివ్యూలు ఎలా ఉంటాయో ముందే గెస్ చేసి పోస్టులు పెడుతున్నారు.
ఈ విషయంలో చిత్ర బృందానికి కూడా ఒక క్లారిటీ ఉంది. బ్లాక్బస్టర్ అయిన ‘వాల్తేరు వీరయ్య’కు కూడా తక్కువ రేటింగ్సే వచ్చాయి. అయినా సరే ఆ సినిమా బ్లాక్బస్టర్ అయింది. కాబట్టి ‘భోళా శంకర్’కు ఎలాంటి రివ్యూలు, రేటింగ్స్ వస్తాయనే విషయంలో టెన్షన్ ఏమీ లేదు. తక్కువ రేటింగ్సే వస్తాయని ముందే ప్రిపేరై.. మాస్ను థియేటర్ల వైపు ఆకర్షించేలా ప్రమోషన్లు ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. మరి మెగాస్టార్ మరోసారి క్రిటిక్స్ వేసే స్పీడ్ బ్రేకర్లను దాటి బాక్సాఫీస్ గమ్యాన్ని దాటుతాడేమో చూడాలి.
This post was last modified on August 4, 2023 7:18 pm
గజ్వేల్ నియోజకవర్గం.. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కంచుకోట. అయితే.. ఇక్కడే పాగా వేయాలని.. వచ్చే…
తమిళంలో డెబ్యూతోనే సూపర్ హిట్ అందుకున్న సుహాస్ గురించి చెన్నై మండాడి సక్సెస్ మీట్ లో దర్శకుడు చేసిన కామెంట్స్…
అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…
ఏపీ ప్రతిపక్షం వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అయితే.. ఇప్పటి వరకు చూసింది ఒక లెక్క.. ఇక నుంచి మరో…
ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశంగా మారిన 'డీజే సౌండ్' వ్యవహారం.. కీలక మలుపు తిరిగింది. తాజాగా అనంతపురంలో నిర్వహించిన వినాయక నిమజ్జన…
ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమ అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సినిమా.. ది ప్యారడైజ్. క్వాలిటీ సినిమాలతో పెద్ద స్టార్గా…