పవన్ కళ్యాణ్ – సాయిధరమ్ తేజ్ తొలి కలయిక బ్రో ది అవతార్ తీపి జ్ఞాపకంగా మిగులుతుందనుకుంటే అందులో క్లైమాక్స్ లాగే చేదుగా మారుతోంది. నిన్నటితో మొదటి వారం పూర్తి చేసుకున్న బ్రో ఇప్పటిదాకా వసూలు చేసిన షేర్ 55 నుంచి 60 కోట్ల మధ్యలోనే ఉందని ట్రేడ్ రిపోర్ట్. మొదటి మూడు రోజులు చూపించిన దూకుడు ఒక్కసారిగా కింద పడిపోవడంతో మళ్ళీ కోలుకోలేదు. అంబటి రాంబాబు వివాదం, దాని మీద న్యూస్ ఛానల్స్ లో జరిగిన చర్చ మైలేజ్ ఇవ్వలేదని అర్థమవుతోంది. ట్విట్టర్ లో వీడియోలు వైరల్ చేసుకోవడానికి తప్ప ఈ ఇష్యూ వల్ల ఒరిగిందేమీ లేదు.
బ్రేక్ ఈవెన్ చేరుకోవాలంటే 95 కోట్ల షేర్ ని దాటేయాలి. అంటే ఇంకా 40 కోట్ల దాకా వసూలు కావాలి. ఈ ఒక్క వీకెండ్ మాత్రమే చేతిలో ఉంది. శుక్రవారం చెప్పుకోదగ్గ రిలీజులు లేకపోవడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ కి పెద్ద ఛాయస్ లు లేవు. సో సెలవుని థియేటర్ లో ఎంజాయ్ చేయాలంటే బ్రో తప్ప వేరే మార్గం లేదు. అలా అని థియేటర్లు నిండిపోతాయని కాదు. సూర్య సన్ అఫ్ కృష్ణన్ లాంటి రీ రిలీజులకు కనిపిస్తున్న రెస్పాన్స్ ఇవాళ మిగిలిన వాటికి లేదు. వచ్చే వారం రజనీకాంత్ జైలర్, అన్నయ్య చిరంజీవి భోళా శంకర్ లు గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేసుకున్నాయి.
ఆ సమయానికి బ్రో థియేటర్లు చాలా మటుకు తగ్గిపోయి నామమాత్రంగా మిగులుతాయి. అలాంటప్పుడు తొంభై అయిదు కోట్ల మార్కుని చేరుకోవడం జరగని పని. కనీసం సూపర్ హిట్ అవుతుందనుకున్న పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈ ట్రెండ్ పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటు బ్రో బృందానికి సైతం వాస్తవాలు కనిపిస్తున్నాయి. సాయి తేజ్ సక్సెస్ టూర్ అంటూ బయలుదేరాడు కానీ దాని వల్ల కలిగే ప్రయోజనం పెద్దగా లేదని అర్థం చేసుకుని షెడ్యూల్ చేసిన ప్లాన్ కన్నా ముందే హైదరాబాద్ కు తిరిగి రావొచ్చని ఇన్ సైడ్ టాక్. ఇక మెగా ఫ్యాన్స్ చూపంతా నెక్స్ట్ భోళా శంకర్ మీదే.
This post was last modified on August 4, 2023 5:18 pm
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష(ప్రధాన కాదు) నాయకుడు, వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో అన్యాయంగా…