భోళా శంకర్ తర్వాత చిరంజీవి ఎవరితో సినిమాలు చేస్తారనే విషయంలో ఎలాంటి డౌట్స్ లేవు. మొదటిది కల్యాణ కృష్ణ దర్శకత్వంలో కూతురు సుష్మిత కొణిదెల నిర్మాణంలో రూపొందబోయే ఎంటర్ టైనరనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇది మలయాళం హిట్ మూవీ బ్రో డాడీ రీమేకనే ప్రచారం నెల రోజులకు పైగా మీడియాలో నానుతూనే ఉంది. అభిమానులు ట్విట్టర్ వేదికగా వద్దని విన్నపాలు చేస్తూనే ఉన్నారు. తొలుత సిద్దు జొన్నలగడ్డను సెకండ్ లీడ్ గా తీసుకుని తర్వాత ఆ స్థానంలో శర్వానంద్ ని ఎంపిక చేశారనే టాక్ కూడా రెండు రోజులుగా తిరుగుతోంది.
ఇవన్నీ చూస్తూ ప్రస్తుతానికి టీమ్ సైలెంట్ గానే ఉంది. కథను అందించిన రచయిత బెజవాడ ప్రసన్నకుమార్ బృందం అఫ్ ది రికార్డు మాట్లాడుతూ ఇది బ్రో డాడీ రీమేక్ కాదంటూనే వెయిట్ చేయమని కోరుతోంది. అప్పుడెప్పుడో వచ్చిన శ్రీకాంత్ మా నాన్నకు పెళ్లి ఛాయల్లో ఫుల్ కామెడీగా ఉంటుందనే వార్త కూడా ఫిలింనగర్ వర్గాల్లో ఉంది. అయితే చిరుని తండ్రిగా చూపించకుండా అన్నయ్యగా మార్చి ఫ్యాన్స్ కి ఇబ్బంది లేకుండా సెట్ చేశారని వినికిడి. వీటికి చెక్ పడాలంటే ఆగస్ట్ 22న ఇచ్చే అనౌన్స్ మెంట్ లో క్యాస్టింగ్ తో పాటు ఇది దేనికీ రీమేక్ కాదనే క్లారిటీ ఇవ్వాలి.
ఇప్పటికీ రీ ఎంట్రీ తర్వాత చిరు మూడు రీమేకులు చేశారు. ఖైదీ నెంబర్ 150 సూపర్ హిట్ అయ్యింది. గాడ్ ఫాదర్ యావరేజ్ దగ్గర ఆగిపోయింది. విడుదలకు ముందే అంచనాల విషయంలో వెనుకబడిన భోళా శంకర్ ఫలితం ఇంకో పది రోజుల్లో తేలిపోతుంది. తిరిగి ఇంకో రీమేక్ అంటే సహజంగానే ఆసక్తి తగ్గుతుంది.బింబిసార ఫేమ్ వశిష్ఠతో పాటు తమిళ దర్శకుడు మిత్రన్ కు కమిట్ మెంట్స్ ఇచ్చిన చిరు వాటికి డేట్లు వచ్చే ఏడాది ప్రారంభం నుంచి ఇవ్వబోతున్నట్టు మెగా అప్డేట్. అఫీషియల్ గా వేటినీ ప్రకటించకపోయినా స్క్రిప్ట్ ల తాలూకు పనులలో ఆయా దర్శకులు బిజీగా ఉన్నారట.
This post was last modified on August 4, 2023 11:42 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…