మనకు తెలిసిన గాయకుడు సిద్ శ్రీరామ్ కేవలం మెలోడీ పాటలకే పరిమితం. అతని బెస్ట్ సాంగ్స్ ఏవంటే ఉండిపోరాదే, ఇంకేం ఇంకేం కావాలే, నీలి నీలి ఆకాశం, నిజమేనే చెబుతున్నా అంటూ కమ్మటి పాటలే గుర్తొస్తాయి. ఒకప్పుడు హరిహరన్, ఉన్నికృష్ణన్ తరహాలో ఒక రకమైన సాఫ్ట్ నెస్ కు పూర్తిగా అలవాటు పడిపోయాం. కానీ తమన్ ఈసారి వెరైటీతో ఫాస్ట్ బీట్ తో ఓ పాట పాడించి మ్యూజిక్ లవర్స్ కి షాక్ ఇచ్చాడు. ఇవాళ రిలీజైన స్కంద మొదటి ఆడియో సింగల్ లో నీ చుట్టు చుట్టు తిరిగే నా గుండెనడిగినా అంటూ సాగే లిరిక్స్ లో కొత్త సిద్ శ్రీరామ్ దర్శనమిచ్చాడు. అదేనండి వినిపించాడు.
వినగానే ఎక్స్ ట్రాడినరీ అనిపించకపోయినా క్రమంగా ఎక్కేలా ట్యూన్ కంపోజింగ్ ఉంది. అసలు పేరు చెప్పకుండా వినిపిస్తే ఇది సిద్ శ్రీరామ్ అని వెంటనే గుర్తుపట్టలేనట్టుగా మిక్స్ చేశారు. రామ్, శ్రీలీల హుషారైన డాన్సులు, ఖరీదైన సెట్ నిండుదనాన్ని తీసుకొచ్చాయి. ఇప్పటిదాకా ప్రమోషన్ పరంగా పెద్దగా హడావిడి చేయని స్కంద టీమ్ ఇవాళ ఈ పాటతోనే పబ్లిసిటీ మొదలుపెట్టింది. వారియర్ డిజాస్టర్ తర్వాత రామ్ దీని మీద బోలెడు నమ్మకంతో ఉన్నాడు. క్యారెక్టర్ కోసమే బరువు పెరిగి మరీ దర్శకుడు బోయపాటి శీను కోరుకున్న బిల్డప్ ని సెట్ చేసుకున్నాడు
సెప్టెంబర్ 15 విడుదల కాబోతున్న స్కంద ప్రస్తుతం బిజినెస్ వ్యవహారాల్లో ఉంది. ఇంకా ఫైనల్ చేయలేదు కానీ ఏరియాల వారిగా నిర్మాత చెబుతున్న రేట్లు ఎక్కువగా ఉండటంతో ఇంకో వారం పది రోజుల్లో బయ్యర్లు డీల్స్ ని ఫైనల్ చేసుకోబోతున్నారు. ట్రైలర్ వచ్చాక హైప్ ఇంకో లెవెల్ కు వెళ్తుందని టీమ్ నమ్మకంగా ఉంది. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాక బోయపాటి శీను చేస్తున్న మూవీ కావడంతో మాస్ ఆడియన్స్ లో మంచి బజ్ ఉంది. టీజర్ విజువల్స్ గట్రా దానికి తగ్గట్టే అనిపిస్తున్నాయి. బడ్జెట్ పరంగా రామ్ కెరీర్ లో స్కందనే అత్యంత ఖరీదైన ప్యాన్ ఇండియా మూవీ.
This post was last modified on August 3, 2023 11:13 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…