ఈ వారం కొత్త సినిమాల మీద ప్రేక్షకులకు ఏమాత్రం ఆసక్తి కనిపించడం లేదు. ఏవేవో చిన్నా చితకా సినిమాలు రాబోతున్నాయి. దీంతో ప్రేక్షకుల దృష్టంతా తర్వాతి వారం సినిమాల మీదికి మళ్లింది. అందులో ముందుగా ప్రేక్షకులను పలకరించబోయేది సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా ‘జైలర్’. ఆగస్టు 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో వారం ముందే ట్రైలర్ లాంచ్ చేసింది చిత్ర బృందం.
చాన్నాళ్ల తర్వాత రజినీ సినిమా కొంచెం కొత్తగా, ఆయన అభిమానులు కోరుకునేలా ఉండొచ్చనే సంకేతాలు కనిపించాయి ఈ ట్రైలర్ చూస్తే. ఇందులో రజినీ స్టైల్, సటిల్గా చెప్పిన మాస్ డైలాగులు ఈలలు వేయించేలాగే ఉన్నాయి. ‘కబాలి’ తర్వాత రజినీ ఇంత స్టైలిష్గా ఏ సినిమాలో కనిపించలేదంటే అతిశయోక్తి కాదు. ‘జైలర్’ మాస్తో పాటు క్లాస్ను కూడా ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ట్రైలర్ మొత్తం రజినీ స్వాగ్ను చూపిస్తూ సాగడంతో అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.
కానీ ‘షోకేస్’ పేరుతో వచ్చిన ‘జైలర్’ ట్రైలర్లో హీరోయిన్ తమన్నా కనిపించకపోవడం ఆమె అభిమానులను నిరాశకు గురి చేసింది. ఈ సినిమాకు ముందు హైప్ రావడంలో తమన్నా పాత్ర కీలకం. ‘కావాలయ్యా’ పాటలో తమన్నా వేసిన స్టెప్పులు, తన గ్లామర్ సోషల్ మీడియాను ఈ పాట ఊపేయడానికి దోహదపడ్డాయి. షార్ట్స్, రీల్స్లో నెల రోజులుగా ఎక్కడ చూసినా ఇదే పాట కనిపిస్తోంది. ఆడియో వేడుకలో కూడా తమన్నా బాగా హైలైట్ అయింది.
కానీ హీరోయిన్ అయినప్పటికీ తమన్నాకు ట్రైలర్లో చోటు దక్కలేదు. లీడ్ హీరోయిన్ని చూపించకుండా ట్రైలర్ కట్ చేయడం అరుదు. ట్రైలర్లో మరీ ప్రాధాన్యం ఇవ్వకపోయినా.. కనీసం ఒకట్రెండు షాట్లు అయినా హీరోయిన్ కనిపించేలా చూడటం ధర్మం. మరెందుకో ‘జైలర్’ టీం ఆమెను పక్కన పెట్టేసింది. తమన్నానే కాదు.. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన మోహన్ లాల్ను సైతం ట్రైలర్లో చూపించలేదు. దీని వెనుక ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ ఉందేమో తెలియదు మరి.
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…
ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…