ఈ వారం కొత్త సినిమాల మీద ప్రేక్షకులకు ఏమాత్రం ఆసక్తి కనిపించడం లేదు. ఏవేవో చిన్నా చితకా సినిమాలు రాబోతున్నాయి. దీంతో ప్రేక్షకుల దృష్టంతా తర్వాతి వారం సినిమాల మీదికి మళ్లింది. అందులో ముందుగా ప్రేక్షకులను పలకరించబోయేది సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా ‘జైలర్’. ఆగస్టు 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో వారం ముందే ట్రైలర్ లాంచ్ చేసింది చిత్ర బృందం.
చాన్నాళ్ల తర్వాత రజినీ సినిమా కొంచెం కొత్తగా, ఆయన అభిమానులు కోరుకునేలా ఉండొచ్చనే సంకేతాలు కనిపించాయి ఈ ట్రైలర్ చూస్తే. ఇందులో రజినీ స్టైల్, సటిల్గా చెప్పిన మాస్ డైలాగులు ఈలలు వేయించేలాగే ఉన్నాయి. ‘కబాలి’ తర్వాత రజినీ ఇంత స్టైలిష్గా ఏ సినిమాలో కనిపించలేదంటే అతిశయోక్తి కాదు. ‘జైలర్’ మాస్తో పాటు క్లాస్ను కూడా ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ట్రైలర్ మొత్తం రజినీ స్వాగ్ను చూపిస్తూ సాగడంతో అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.
కానీ ‘షోకేస్’ పేరుతో వచ్చిన ‘జైలర్’ ట్రైలర్లో హీరోయిన్ తమన్నా కనిపించకపోవడం ఆమె అభిమానులను నిరాశకు గురి చేసింది. ఈ సినిమాకు ముందు హైప్ రావడంలో తమన్నా పాత్ర కీలకం. ‘కావాలయ్యా’ పాటలో తమన్నా వేసిన స్టెప్పులు, తన గ్లామర్ సోషల్ మీడియాను ఈ పాట ఊపేయడానికి దోహదపడ్డాయి. షార్ట్స్, రీల్స్లో నెల రోజులుగా ఎక్కడ చూసినా ఇదే పాట కనిపిస్తోంది. ఆడియో వేడుకలో కూడా తమన్నా బాగా హైలైట్ అయింది.
కానీ హీరోయిన్ అయినప్పటికీ తమన్నాకు ట్రైలర్లో చోటు దక్కలేదు. లీడ్ హీరోయిన్ని చూపించకుండా ట్రైలర్ కట్ చేయడం అరుదు. ట్రైలర్లో మరీ ప్రాధాన్యం ఇవ్వకపోయినా.. కనీసం ఒకట్రెండు షాట్లు అయినా హీరోయిన్ కనిపించేలా చూడటం ధర్మం. మరెందుకో ‘జైలర్’ టీం ఆమెను పక్కన పెట్టేసింది. తమన్నానే కాదు.. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన మోహన్ లాల్ను సైతం ట్రైలర్లో చూపించలేదు. దీని వెనుక ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ ఉందేమో తెలియదు మరి.
This post was last modified on August 3, 2023 9:52 am
వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ను గెలిపించే బాధ్యతను భుజాలకెత్తుకున్న కేటీఆర్ ప్రచారంలో తీరిక లేకుండా ఉన్నారు. సభలు,…
గత ఏడాది అతి పెద్ద బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా రికార్డులు సృష్టించిన బేబీ సంచలనం ఏకంగా దాన్ని హిందీలో…
మహానటిలో సావిత్రిగా తన అద్భుత నటనతో కట్టిపడేసిన కీర్తి సురేష్ మళ్ళీ దాన్ని తలపించే ఇంకో పాత్ర చేయలేదంటేనే ఆ…
'ఎక్కడున్నా భారత్కు తిరిగొచ్చి విచారణకు హాజరవ్వు. తప్పించుకోవద్దని నేను అభ్యర్థిస్తున్నాను. ఏ తప్పూ చేయకపోతే.. ఎందుకు భయపడుతున్నావ్? ఎన్ని రోజులు…
ఏపీలో ఎన్నికలు ముగిసి.. వారం రోజులు అయిపోయింది. ఈ నెల 13న నాలుగో దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో భాగంగా…
కాంగ్రెస్ హైకమాండ్ ఎంత చెప్పినా తెలంగాణలోని ఆ పార్టీకి చెందిన కొంతమంది మంత్రుల్లో ఎలాంటి మార్పు రావడం లేదని తెలిసింది.…