ఒక సినిమా విషయంలో అధికార పార్టీ విపరీతంగా స్పందించడం ఒక్క పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలోనే జరుగుతుందనేది వకీల్ సాబ్, భీమ్లా నాయక్ లు ఆల్రెడీ నిరూపించాయి. ఇప్పుడు బ్రో దాన్ని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లింది. ఒక మంత్రి ఏరియాల వారిగా కలెక్షన్లు, దానికి ఫైనల్ గా ఎంత గ్రాస్ వస్తుంది, డిజాస్టరవుతుందనే జోస్యం చెప్పడం ఇవన్నీ ఎక్కడా చూసుండం. ఏకంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కు డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చే రేంజ్ లో అంబటి రాంబాబు స్పందించడం చూస్తే బ్రోలో శ్యామ్ బాబు క్యారెక్టర్ కి ఆయన బాగా హర్ట్ అయినట్టు చిన్న పిల్లలకు సైతం సులభంగా అర్థమైపోయింది. ఇక బాధ్యతల విషయానికి వద్దాం.
కాకతాళీయంగా టి షర్ట్ ఒకటే మ్యాచ్ అయ్యిందని, అసలు తాము రాంబాబుని ఉద్దేశించి పృథ్వి పాత్రను పెట్టలేదని నిర్మాత ఎంత చెప్పినా సరే అసలు కథకు సంబంధమే లేని శ్యామ్ బాబు పేరుతో సహా అన్నీ అవే పోలికలతో కనిపించడం దాచి పెట్టలేం. సరే వాళ్ళు కావాలనే చేసినా ఇది అంత స్పందించాల్సిన విషయమే కాదు. అంబటి రాంబాబు మౌనంగా ఉంటే సరిపోయేది. అది వదిలేసి ప్రెస్ మీట్ పెట్టి మరీ వసూళ్ల గురించి మాట్లాడ్డం సోషల్ మీడియాలో చులకనయ్యేందుకు అవకాశం ఇచ్చింది. ఇలాంటి పబ్లిసిటీ వల్ల ఆడే స్థితి పవన్ కళ్యాణ్ సినిమాలకు ఎప్పుడూ రాకూడదు.
పొలిటికల్ అజెండాతో తీసి ఉంటే అది వేరే విషయం కానీ ఒక ఎమోషనల్ ఫాంటసీ పాయింట్ మీద రూపొందిన బ్రోలో కారణం ఏదైనా అవసరం లేని అంశాలకు చోటివ్వడం వల్లే ఇంత రాద్ధాంతానికి చోటిచ్చినట్టు అయ్యింది. అంబటి మాటలు, వాటికి కౌంటర్లతో జనసేన, వైసిపిలు బిజీగా ఉంటే మధ్యలో నెటిజెన్లు శుభ్రంగా టైం పాస్ చేస్తున్నారు. సాయిధరమ్ తేజ్ ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా సక్సెస్ టూర్లో బిజీగా తిరుగుతున్నాడు.అతను బ్రో బాగుంది చూడమని పిలుపు ఇస్తుంటే మరోవైపు శ్యామ్ బాబు రగడ తప్ప బ్రోలో ఇంకేం లేదన్న రేంజ్ లో జరుగుతున్న రాంగ్ క్యాంపైన్ అసలు ఉద్దేశాన్ని దెబ్బ తీస్తోంది. అంత సులభంగా దీనికి చెక్ పడేలా లేదు.
This post was last modified on August 2, 2023 11:07 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…