సినిమా హీరోల కొడుకులు హీరోలు కావడం మామూలే. కానీ టెక్నీషియన్ల కొడుకులు తండ్రులను అనుసరించడం అరుదే. ఈ అరుదైన జాబితాలో మహతి స్వర సాగర్ ఉన్నాడు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ తనయుడే ఈ మహతి. ‘ఛలో’, ‘భీష్మ’ లాంటి చిత్రాలతో అతను సంగీత దర్శకుడిగా తనదైన ముద్ర వేశాడు. ఐతే ఇప్పటిదాకా చిన్న, మీడియం రేంజ్ సినిమాలే చేస్తూ వచ్చిన అతను.. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘భోళా శంకర్’కు సంగీతం అందించాడు.
ఈ సినిమాలో భోళా మేనియా.. మిల్కీ బ్యూటీ పాటలు అభిమానులను ఆకట్టుకున్నాయి. ‘భోళా శంకర్’ ఇంకో పది రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో మహతి మీడియాను కలిశాడు. ఈ సందర్భంగా చిరుతో తన సంగీత ప్రయాణం గురించి ఆసక్తికర సంగతులు పంచుకున్నాడు. తాను చిరంజీవి పాటను రీమిక్స్ చేస్తే ఏది ఎంచుకుంటానో కూడా అతను వెల్లడించాడు.
‘‘మా నాన్న పుట్టిన రోజు నాడు చిరంజీవి గారి సినిమాకు సంగీతం అందించాలనే ప్రపోజల్ నా ముందుకు వచ్చింది. ముందు మెహర్ రమేష్ జోక్ చేస్తున్నారని అనుకున్నా. కానీ తర్వాత కథ చెప్పి సంగీతం చేయమన్నారు. ఈ అవకాశం నాకు ఎవరెస్ట్ ఎక్కినట్లు కాదు.. ఎవరెస్ట్ని తల మీద మోస్తున్నట్లు అనిపించింది. ‘భోళా శంకర్’కు నేను చేసిన ప్రతి ట్యూన్ సెట్కు వెళ్లి చిరంజీవి గారికి వినిపించేవాడిని. ఆయన తన ఆలోచనలను పంచుకుని నాకు మార్గ నిర్దేశం చేసేవారు. ముందు ‘భోళా మేనియా’ పాటను వినిపిస్తే.. ‘చెవుల తుప్పు వదిలిపోయిందయ్యా. మణిశర్మ రేంజ్ మాస్ కొట్టావు’ అన్నారు.
ఆ తర్వాత ఇంకో మాస్ పాట వినిపిస్తే.. ‘అన్నీ మాస్ పాటలే అవుతున్నాయి. మధ్యలో కొంచెం రిలీఫ్ ఉండాలి. మీ నాన్న ఇచ్చే ఆల్బం ఎంత మాస్గా ఉన్నా వాటిలో మెలోడి ఉంటుంది’ అంటూ ‘అన్నయ్య’ సినిమాలోని ‘హిమ సీమల్లో’ పాటను గుర్తు చేశారు. అప్పుడు ‘మిల్కీ బ్యూటీ’ పాట ట్యూన్ చేసి ఇచ్చా. అలా ఆయన సలహాలు నాకు ఉఫయోగపడ్డాయి. చిరంజీవి గారి పాట ఏదైనా రీమేక్ చేయాలంటే.. ‘రాధే గోవిందా’ చేస్తా. అది కూడా రామ్ చరణ్ సినిమాకైతేనే’’ అని మహతి పేర్కొన్నాడు.
This post was last modified on August 1, 2023 1:28 pm
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…
ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్గా పెళ్లి చేసుకుంది ఈ…
విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో…