Movie News

ఆమిర్ ఖాన్ మళ్లీ తేనె తుట్టెను కదిపాడు

వివాద రహితుడిగా, అందరివాడుగా కనిపించే ఆమిర్ ఖాన్.. కొన్నేళ్ల కిందట చేసిన ఓ కామెంట్‌తో ఏ స్థాయిలో వ్యతిరేకత ఎదుర్కొన్నాడో తెలిసిందే. ఇండియాలో ‘అసహనం’ పెరిగిపోతోందని.. తన భార్య దేశం విడిచి వెళ్లిపోదామా అందని ఓ ఇంటర్వ్యూలో అతను చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. మోడీ సర్కారు అధికారంలో ఉండగా ముస్లింలకు దేశంలో రక్షణ లేదంటూ ఓ వర్గం చేస్తున్న వాదనను బలపరిచేలా ఆమిర్ అప్పుడు వ్యాఖ్యలు చేశాడు. ఐతే ఆమిర్ దేశాన్ని కించపరిచేలా మాట్లాడాడంటూ తటస్థంగా ఉండే వాళ్లు సైతం అప్పుడు అతడిపై విరుచుకుపడ్డారు. ఇండియాలో ఆమిర్ లాంటి సెలబ్రెటీకి వచ్చిన కష్టం ఏంటో చెప్పాలంటూ మండిపడ్డారు. ఈ దెబ్బకు ఆమిర్ ఇమేజ్ బాగా డ్యామేజ్ అయింది. అతను ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న బ్రాండ్‌లు కూడా దెబ్బ తినే పరిస్థితి వచ్చింది.

అప్పట్నుంచి సంయమనం పాటిస్తూ వస్తున్నాడు ఆమిర్. కానీ ఇప్పుడో మరోసారి తనలోని మరో కోణాన్ని ఆమిర్ బయటపెట్టాడు. మళ్లీ సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నాడు. తన కొత్త చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’ షూటింగ్ కోసం ఆమిర్ చిత్ర బృందంతో కలిసి టర్కీకి వెళ్లాడు. అక్కడ టర్కీ ప్రధాని బినాలి యిల్దిరిమ్ భార్య, టర్కీ ప్రథమ మహిళ ఎమిన్ ఎర్దోగన్‌ను కలిశాడు. టర్కీ ప్రధాని పలుమార్లు ఇండియాకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడు. విషం కక్కాడు. కశ్మీర్ అంశంలో పాకిస్థాన్‌కు మద్దతు ఇచ్చాడు. అలాంటి వ్యక్తి భార్యను ఆమిర్ కలిసి సమావేశం అయి ఆ ఫొటోలను మీడియాకు రిలీజ్ చేయడంతో ఆమిర్‌ను దేశద్రోహిగా అభివర్ణిస్తున్నారు. ఇక్కడ ప్రస్తావించాల్సిన మరో విషయం ఏంటంటే కశ్మీర్ సహా వివిధ అంశాల్లో భారత్‌కు పూర్తి మద్దతు ప్రకటించే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహ భారత్‌కు వచ్చినపుడు.. ముంబయిలో ఖాన్ త్రయాన్ని కలవాలనుకున్నాడు. కానీ ఆమిర్‌తో పాటు సల్మాన్, షారుఖ్ ఆయన్ని కలవడానికి ఇష్టపడలేదు. ఆ విషయాన్ని కూడా ఇప్పుడు బయటికి తీసి ఆమిర్‌ మీద విరుచుకుపడుతున్నారు నెటిజన్లు.

This post was last modified on August 17, 2020 7:24 pm

Share
Show comments
Published by
suman
Tags: Aamir Khan

Recent Posts

దెబ్బతిన్న హీరోలు vs రావిపూడి

టాలీవుడ్‌లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…

16 minutes ago

తెలంగాణ జనసేన టార్గెట్ ఫిక్స్… పొత్తు ఉంటుందా పవన్ సార్?

తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్‌ శంకర్‌గౌడ్‌…

42 minutes ago

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

2 hours ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

2 hours ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

2 hours ago

రాజాసాబ్.. దేవర రూట్లో వెళ్లినా..

సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…

3 hours ago