బాలీవుడ్లో ఒక దశలో హీరోలతో సమానంగా సూపర్ స్టార్ ఇమేజ్ సంపాదించిన కథానాయిక కంగనా రనౌత్. అలా ఒక స్థాయి అందుకున్నాక ఆమె ప్రవర్తన, మాటతీరు పూర్తిగా మారిపోయాయి. కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న మోడీ సర్కారుకు గట్టి మద్దతుదారుగా మారి రాజకీయ రంగు పులుముకున్నాక ఆమె కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంకో స్థాయికి వెళ్లిపోయాయి.
ఇక అప్పట్నుంచి బాలీవుడ్లో కొందరు ప్రముఖులను అదే పనిగా టార్గెట్ చేయడం మొదలుపెట్టింది కంగనా. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది కరణ్ జోహార్ గురించే. ఆయనతో ఆజన్మ శతృత్వం ఉన్నట్లుగా అదే పనిగా విమర్శలు గుప్పిస్తూ ఉంటుంది కంగనా. ముఖ్యంగా కరణ్ తీసిన సినిమాలేవైనా నెగెటివ్ టాక్ తెచ్చుకున్నాయంటే కంగనాకు పండుగ అన్నట్లే. తీవ్రాతి తీవ్రమైన వ్యాఖ్యలతో కరణ్ మీద విరుచుకుపడుతుంటుంది. ఆయన సినిమాలను ఎగతాళి చేస్తుంటుంది.
తాజాగా కరణ్ నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహాని’ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకున్న నేపథ్యంలో కంగనా స్పందించింది. ‘‘ప్రేక్షకులను ఇక మోసం చేయలేరు. ఇలాంటి ఫేక్ సెట్స్, కాస్ట్యూమ్స్ను వాళ్లు అంగీకరించరు. నిజ జీవితంలో ఎవరైనా అలాంటి బట్టలు వేసుకుంటారా? 90వ దశకంలో తాను తెరకెక్కించిన సినిమాలనే కాపీ కొట్టి రూ.250 కోట్ల బడ్జెట్లో ఈ సినిమా చేసినందుకు కరణ్ సిగ్గుపడాలి.
అంత బడ్జెట్ పెట్టి డైలీ సీరియల్ తీశారు. టాలెంట్ ఉన్న వాళ్లు ఆర్థిక వనరులు దొరక్క ఇబ్బంది పడుతుంటే.. ఇంత డబ్బు ఆయనకు ఎవరిచ్చారు? కరణ్.. ఇండస్ట్రీ ప్రస్తుతం ఉన్న పరిస్థఇతుల్లో డబ్బు వృథా చేయడం మానేసి రిటైరైపో. కొత్త టాలెంట్కు ఛాన్సులు కల్పించు. రణ్వీర్కు నేనిచ్చే సలహా ఒక్కటే. డ్రెస్సింగ్ విషయంలో దయచేసి కరణ్ను ఫాలో కావద్దు. సాధారణ వ్యక్తుల్లా బట్టలు వేసుకో. దక్షిణాది నటులు ఎంత హుందాగా దుస్తులు వేసుకుంటారో చూడు’’ అని కంగనా పేర్కొంది.
ప్రపంచమంతా ఒక సినిమా కోసం ఎదురు చూడటం చాలా అరుదు. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ది ఒడిస్సీ ఈ…
ఊరు వాడ పేరుతో ఎన్టీఆర్ అభిమానులు చేపడుతున్న సేవా కార్యక్రమాల వ్యవహారం ఇటీవల ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారిన సంగతి…
న్యాయస్థానంలో సాక్ష్యాధారాలే కీలకం. మూఢనమ్మకాలతో చట్టాన్ని ప్రభావితం చేయలేరు... అయితే అమాయకత్వమో.. మరి ఏమో కానీ తీర్పు తనకు అనుకూలంగా…
సినీ రంగంలో గొప్ప స్థాయికి చేరుకున్న చాలామంది దర్శకులు ఒకప్పుడు అనామకులే. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అవకాశాల కోసం కాళ్లరిగేలా…
ఒకే రోజు ఏపీలో రెండు ఘటనలు.. ఒకటి ప్రకాశం జిల్లా సింగరాయకొండ. మరొకటి పల్నాడు జిల్లా వినుకొండ. రెండు ప్రాంతాలు…
రాయలసీమను కూటమి ప్రభుత్వం పెట్టుబడుల సీమగా మారుస్తోంది. పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలి వస్తున్నాయి. తాజాగా దాల్మియా సిమెంట్ భారీ…