మోస్ట్ వాంటెడ్ ప్యాన్ ఇండియా మూవీస్ లో అగ్ర స్థానంలో ఉన్న సలార్ విడుదలకు ఇంకో రెండు నెలలు మాత్రమే టైం ఉంది. చూస్తుండగానే కాలం ఇట్టే కరిగిపోతుంది కాబట్టి బిజినెస్ వ్యవహారాలతో పాటు ఇతరత్రా కార్యక్రమాల కోసం హోంబాలే ఫిలింస్ ప్లానింగ్ రెడీ చేస్తోంది. బిజినెస్ ఊపందుకుంది. డిస్ట్రిబ్యూటర్లు ఇస్తున్న క్రేజీ ఆఫర్లను క్షుణ్ణంగా పరిశీలించి ట్రైలర్ వచ్చాక వాటిని ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇక సలార్ కథకు సంబంధించిన లీక్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తూ ఆసక్తిని పెంచుతున్నాయి. ముఖ్యంగా స్టోరీ లైన్ గురించిన చర్చే ఎక్కువగా ఉంది.
వాటి ప్రకారం సలార్ పాత్ర పోషించిన ప్రభాస్ తల్లికి, స్నేహితుడికి ఇచ్చిన వేర్వేరు మాట కోసం పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తుంది. ఈ సంఘర్షణ వల్ల అతనికి కొత్త శత్రువులు ఏర్పడతారు. మాఫియా కబంధ హస్తాల్లో ఉన్న ఒక చీకటి ప్రపంచాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలని ఆశపడిన ఒక రాజుకి బాహుబలి లాంటి సైనికుడు తోడైతే ఎలా ఉంటుందో ఆ ఆలోచనే సలార్ కు శ్రీకారం చుట్టేలా చేసిందని దర్శకుడు ప్రశాంత్ నీల్ తన సన్నితులతో అన్నారట. పృథ్విరాజ్ సుకుమారన్ పాత్ర ప్రభాస్ తో సమానంగా చాలా షాకింగ్ గా ఉంటుందని కూడా అంటున్నారు.
ఎమోషన్స్ ని అందులోనూ తల్లి సెంటిమెంట్ ని గొప్పగా పండిస్తాడని పేరున్న ప్రశాంత్ నీల్ సలార్ లో వాటిని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లడం ఖాయం. ఆగస్ట్ లో ట్రైలర్ లాంచ్ జరిగే అవకాశాలున్నాయి. ఆదిపురుష్ ఫైనల్ రన్ ముగిసిపోయింది కాబట్టి ప్రభాస్ ప్రస్తుతం అందుబాటులోనే ఉన్నాడు. యాభై రోజుల విదేశీ ట్రిప్ పూర్తి చేసుకుని ఇటీవలే హైదరాబాద్ తిరిగి వచ్చాడు. హోంబాలే బృందంతో మాట్లాడి ప్రమోషన్ల కోసం డేట్లు బ్లాక్ చేసి మిగిలినవి కల్కి, మారుతి సినిమాలకు ఇవ్వబోతున్నాడు. అభిమానుల్లో సలార్ ఫీవర్ మొదలైపోయిందని ట్రెండ్ ని బట్టే చెప్పొచ్చు.
This post was last modified on July 29, 2023 12:01 pm
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష(ప్రధాన కాదు) నాయకుడు, వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో అన్యాయంగా…