మోస్ట్ వాంటెడ్ ప్యాన్ ఇండియా మూవీస్ లో అగ్ర స్థానంలో ఉన్న సలార్ విడుదలకు ఇంకో రెండు నెలలు మాత్రమే టైం ఉంది. చూస్తుండగానే కాలం ఇట్టే కరిగిపోతుంది కాబట్టి బిజినెస్ వ్యవహారాలతో పాటు ఇతరత్రా కార్యక్రమాల కోసం హోంబాలే ఫిలింస్ ప్లానింగ్ రెడీ చేస్తోంది. బిజినెస్ ఊపందుకుంది. డిస్ట్రిబ్యూటర్లు ఇస్తున్న క్రేజీ ఆఫర్లను క్షుణ్ణంగా పరిశీలించి ట్రైలర్ వచ్చాక వాటిని ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇక సలార్ కథకు సంబంధించిన లీక్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తూ ఆసక్తిని పెంచుతున్నాయి. ముఖ్యంగా స్టోరీ లైన్ గురించిన చర్చే ఎక్కువగా ఉంది.
వాటి ప్రకారం సలార్ పాత్ర పోషించిన ప్రభాస్ తల్లికి, స్నేహితుడికి ఇచ్చిన వేర్వేరు మాట కోసం పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తుంది. ఈ సంఘర్షణ వల్ల అతనికి కొత్త శత్రువులు ఏర్పడతారు. మాఫియా కబంధ హస్తాల్లో ఉన్న ఒక చీకటి ప్రపంచాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలని ఆశపడిన ఒక రాజుకి బాహుబలి లాంటి సైనికుడు తోడైతే ఎలా ఉంటుందో ఆ ఆలోచనే సలార్ కు శ్రీకారం చుట్టేలా చేసిందని దర్శకుడు ప్రశాంత్ నీల్ తన సన్నితులతో అన్నారట. పృథ్విరాజ్ సుకుమారన్ పాత్ర ప్రభాస్ తో సమానంగా చాలా షాకింగ్ గా ఉంటుందని కూడా అంటున్నారు.
ఎమోషన్స్ ని అందులోనూ తల్లి సెంటిమెంట్ ని గొప్పగా పండిస్తాడని పేరున్న ప్రశాంత్ నీల్ సలార్ లో వాటిని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లడం ఖాయం. ఆగస్ట్ లో ట్రైలర్ లాంచ్ జరిగే అవకాశాలున్నాయి. ఆదిపురుష్ ఫైనల్ రన్ ముగిసిపోయింది కాబట్టి ప్రభాస్ ప్రస్తుతం అందుబాటులోనే ఉన్నాడు. యాభై రోజుల విదేశీ ట్రిప్ పూర్తి చేసుకుని ఇటీవలే హైదరాబాద్ తిరిగి వచ్చాడు. హోంబాలే బృందంతో మాట్లాడి ప్రమోషన్ల కోసం డేట్లు బ్లాక్ చేసి మిగిలినవి కల్కి, మారుతి సినిమాలకు ఇవ్వబోతున్నాడు. అభిమానుల్లో సలార్ ఫీవర్ మొదలైపోయిందని ట్రెండ్ ని బట్టే చెప్పొచ్చు.
This post was last modified on July 29, 2023 12:01 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…