సౌత్ సినిమాలో కొత్తగా దూసుకొస్తున్న సంగీత దర్శకుడు హేశం అబ్దుల్ వహాబ్ గురించి క్రమంగా మన అగ్ర హీరోలు ఎంక్వయిరీలు మొదలుపెట్టారు. విజయ్ దేవరకొండ ఖుషికి అతనిచ్చిన మెలోడియస్ ఆల్బమ్ మ్యూజిక్ లవర్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇతని చేతిలో నాని హాయ్ నాన్నతో పాటు శర్వానంద్ సినిమా ఉంది. క్రమంగా ఆఫర్లు పెరుగుతున్నా ఒక బ్లాక్ బస్టర్ పడ్డాక స్పీడ్ పెంచే ఆలోచనలో ఉన్నాడీ 32 ఏళ్ళ యువకుడు. ఇతని పుట్టిన దేశం సౌదీ అరేబియా అంటే ఆశ్చర్యం కలగక మానదు. 8 వయసులోనే పియానోతో సంగీత సాధన మొదలుపెట్టాడు.
ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేశాడు. 2007 లో ఇండియాక వచ్చి మలయాళంలో అవకాశాలు వెతుక్కోవడం మొదలుపెట్టాడు. 2013లో తొలి రికార్డింగ్ జరిగింది. ఆ తర్వాత రెండేళ్లకు సాల్ట్ మ్యాంగో ట్రీతో ఫస్ట్ ఆఫర్ పట్టాడు. తర్వాత చెప్పుకోదగ్గ సినిమాలు, హిట్లు కొట్టినా మొదటి బ్రేక్ మాత్రం 2022 హృదయంతో దక్కింది. అందులో 15 పాటలు భాషతో సంబంధం లేకుండా ఆన్ లైన్లో విపరీతంగా ఎక్కేశాయి. అది చూశాకే దర్శకుడు శివ నిర్వాణ ఖుషి కోసం హైదరాబాద్ తీసుకొచ్చాడు. దీని ఫస్ట్ సింగల్ వచ్చాక ఇతర నిర్మాతలు చెక్కులతో కలిశారు.
మాములుగా మ్యూజిక్ డైరెక్టర్లలో ముస్లిం వర్గానికి చెందిన వాళ్ళు తక్కువగా ఉంటారు. వాళ్లలో మొదటగా గుర్తొచ్చే పేరు ఏఆర్ రెహమాన్. మళ్ళీ ఇప్పుడు హేశం అబ్దుల్ వహాబ్ ఆ స్థాయికి చేరుకోవచ్చని అభిమానులు నమ్ముతున్నారు. అయితే ఇతను ఇప్పటిదాకా కమర్షియల్ సినిమాలు చేయలేదు. పెద్ద స్టార్ హీరోలను డీల్ చేయడంలో అనుభవం వస్తే నిజంగానే డిమాండ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. టాలీవుడ్లో తమన్, దేవి, అనూప్, మిక్కీ జె మేయర్ ఇలా ఆప్షన్స్ బాగా టైట్ అయిన తరుణంలో వహాబ్ లాంటి వాళ్లకు మంచి ఫ్యూచర్ ఉంది. మరి అంత నమ్మకాన్ని నిలబెట్టుకోవడం అతని చేతుల్లోనే ఉంది.
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…