సౌత్ సినిమాలో కొత్తగా దూసుకొస్తున్న సంగీత దర్శకుడు హేశం అబ్దుల్ వహాబ్ గురించి క్రమంగా మన అగ్ర హీరోలు ఎంక్వయిరీలు మొదలుపెట్టారు. విజయ్ దేవరకొండ ఖుషికి అతనిచ్చిన మెలోడియస్ ఆల్బమ్ మ్యూజిక్ లవర్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇతని చేతిలో నాని హాయ్ నాన్నతో పాటు శర్వానంద్ సినిమా ఉంది. క్రమంగా ఆఫర్లు పెరుగుతున్నా ఒక బ్లాక్ బస్టర్ పడ్డాక స్పీడ్ పెంచే ఆలోచనలో ఉన్నాడీ 32 ఏళ్ళ యువకుడు. ఇతని పుట్టిన దేశం సౌదీ అరేబియా అంటే ఆశ్చర్యం కలగక మానదు. 8 వయసులోనే పియానోతో సంగీత సాధన మొదలుపెట్టాడు.
ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేశాడు. 2007 లో ఇండియాక వచ్చి మలయాళంలో అవకాశాలు వెతుక్కోవడం మొదలుపెట్టాడు. 2013లో తొలి రికార్డింగ్ జరిగింది. ఆ తర్వాత రెండేళ్లకు సాల్ట్ మ్యాంగో ట్రీతో ఫస్ట్ ఆఫర్ పట్టాడు. తర్వాత చెప్పుకోదగ్గ సినిమాలు, హిట్లు కొట్టినా మొదటి బ్రేక్ మాత్రం 2022 హృదయంతో దక్కింది. అందులో 15 పాటలు భాషతో సంబంధం లేకుండా ఆన్ లైన్లో విపరీతంగా ఎక్కేశాయి. అది చూశాకే దర్శకుడు శివ నిర్వాణ ఖుషి కోసం హైదరాబాద్ తీసుకొచ్చాడు. దీని ఫస్ట్ సింగల్ వచ్చాక ఇతర నిర్మాతలు చెక్కులతో కలిశారు.
మాములుగా మ్యూజిక్ డైరెక్టర్లలో ముస్లిం వర్గానికి చెందిన వాళ్ళు తక్కువగా ఉంటారు. వాళ్లలో మొదటగా గుర్తొచ్చే పేరు ఏఆర్ రెహమాన్. మళ్ళీ ఇప్పుడు హేశం అబ్దుల్ వహాబ్ ఆ స్థాయికి చేరుకోవచ్చని అభిమానులు నమ్ముతున్నారు. అయితే ఇతను ఇప్పటిదాకా కమర్షియల్ సినిమాలు చేయలేదు. పెద్ద స్టార్ హీరోలను డీల్ చేయడంలో అనుభవం వస్తే నిజంగానే డిమాండ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. టాలీవుడ్లో తమన్, దేవి, అనూప్, మిక్కీ జె మేయర్ ఇలా ఆప్షన్స్ బాగా టైట్ అయిన తరుణంలో వహాబ్ లాంటి వాళ్లకు మంచి ఫ్యూచర్ ఉంది. మరి అంత నమ్మకాన్ని నిలబెట్టుకోవడం అతని చేతుల్లోనే ఉంది.
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…