మాములుగా దేవుడి కాన్సెప్ట్ మీద తీసే సినిమాలకు క్లీన్ యు సర్టిఫికెట్ వస్తుంది. ఎందుకంటే అభ్యంతరక, అసభ్య సన్నివేశాలు ఉండవు కాబట్టి. కానీ ఆగస్ట్ 11న విడుదల కాబోతున్న అక్షయ్ కుమార్ ఓ మై గాడ్ 2కి సెన్సార్ అధికారులు షాక్ ఇచ్చారు. ఏకంగా ఇరవై కట్లను రికమండ్ చేస్తూ, ఒకవేళ వాటికి ఒప్పుకోని పక్షంలో అడల్ట్ ఓన్లీ ఇస్తామని నిర్మాతలకు చెప్పారట. దీంతో ఖంగారెత్తిన నిర్మాతలు రివైజింగ్ కమిటీకి అప్పీల్ చేశారు. దీని మొదటి భాగం బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. తెలుగులో గోపాల గోపాల, కన్నడలో ముకుంద మురారిగా రీమేకై మంచి విజయం అందుకుంది.
అందుకే సీక్వెల్ అనగానే సహజంగానే అంచనాలు ఉంటాయి. దర్శకుడు అమిత్ రాయ్ కావాలనే ఇందులో కాంట్రావర్సి అంశాలు పొందుపరిచారని, కులాలు మతాలకు సంబంధించిన కొన్ని సున్నితమైన విషయాలను టచ్ చేయడం వల్లే సెన్సార్ అబ్జెక్షన్ వచ్చిందని ముంబై టాక్. ఓ మై గాడ్ కు పిల్లల ఫాలోయింగ్ ఉంది. అలాంటప్పుడు ఎందుకిలా చేశారనే అనుమానం రావడం సహజం. కాశిలో నివసించే అపర భక్తుడిగా పంకజ్ త్రిపాఠి, భువికి దిగివచ్చే శివుడిగా అక్షయ్ కుమార్ ఇందులో నటించారు. టీజర్ హైప్ తీసుకురాగా ఫ్యాన్స్ ట్రైలర్ కోసం ఎదురు చూస్తున్నారు.
అసలే అక్షయ్ వరస డిజాస్టర్లతో మార్కెట్ ని రిస్కులో పెట్టుకున్నాడు. ఇప్పుడీ పరిణామాలు మరింత ఇబ్బంది కలిగిస్తున్నాయి. ఓ మై గాడ్ 2 కన్నా అదే రోజు రిలీజవుతున్న గదర్ 2 మీద ట్రేడ్ వర్గాలు ఎక్కువ నమ్మకం పెట్టుకున్నాయి. మాస్ ని సన్నీ డియోల్ థియేటర్లకు తెస్తాడని ఎదురు చూస్తున్నారు. అలాంటప్పుడు ఓ మై గాడ్ 2 వైపు ఆడియన్స్ కన్నెత్తి చూడాలంటె అది న్యూస్ లో నలగాలి. అందుకే ఇలా చేశారనే ప్రచారం కూడా ఉంది. మొత్తానికి దేవుడిని హైలైట్ చేస్తూ రూపొందిన ఒక సినిమాకు ఇలా జరగడం మాత్రం బహుశా ఇదే మొదటిసారని చెప్పొచ్చు.
This post was last modified on July 27, 2023 1:23 pm
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…